ద్వారం భావనారాయణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వారం భావనారాయణ రావు
ద్వారం భావనారాయణ రావు
జననంద్వారం భావనారాయణ రావు
15 జూన్, 1924
బాపట్ల
మరణంజూలై 24, 2000
విశాఖపట్నం
మరణ కారణంగుండెనొప్పి
వృత్తివిజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు
ప్రసిద్ధిప్రముఖ వయొలిన్ విద్వాంసుడు
మతంహిందూ మతము
పిల్లలుముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తండ్రిద్వారం వెంకటస్వామి నాయుడు
తల్లివెంకట జగ్గాయమ్మ

ద్వారం భావనారాయణ రావు (జూన్ 15, 1924 - జూలై 24, 2000) ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు.[1]

ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించాడు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు.

ఇతడు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు, తర్వాత విజయవాడ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోను పనిచేశాడు.

ఇతడు మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, దత్తిలముని రచించిన దత్తిళమును తెలుగులోకి అనువదించి ప్రచురించారు.[2]

ఇతడు విశాఖపట్నంలో 2000 జూలై 24 తేదీన గుండెనొప్పితో అకస్మాత్తుగా పరమపదించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[3]

పురస్కారాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీత కళాప్రపూర్ణ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Bhavanarayana Rao Dwaram, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 401-2.
  2. "Treeatise on music in The Hindu". Archived from the original on 2007-11-28. Retrieved 2013-05-07.
  3. Dwaram Bhavanarayana Rao dead in The Hindu.[permanent dead link]