ద్వారం వెంకటస్వామి నాయుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు | |
ద్వారం వెంకటస్వామి నాయుడు | |
జన్మ నామం | ద్వారం వెంకటస్వామి నాయుడు |
జననం | ![]() | 1893 నవంబరు 8
మరణం | నవంబరు 25, 1964 |
ద్వారం వెంకటస్వామి నాయుడు (ఆంగ్లం: Dwaram Venkataswamy Naidu) (నవంబరు 8, 1893 - నవంబరు 25, 1964) ఒక గొప్ప వయొలిన్ (సారంగి) విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941 లో ఇతనికి సంగీత కళానిధి అవార్డ్ ప్రధానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.
ఇతను బెంగళూరులో దీపావళివాడు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటరాయుడు సైనక దళంలో కమీషండ్ ఆఫీసరుగా పనిచేసారు.[1]విశాఖపట్నంలో పెరిగాడు.. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు. 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.
సారంగి వాయిద్యం ఒంటరి కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇవ్వడం ఇతనే ఆరంభించాడు. మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల ఆడటోరియంలో ఇతని కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఇతని వయొలీన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు.
ద్వారం వెంకటస్వామి నాయుడు సారంగి వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి. కర్ణాటక సంగీతం సారంగిపై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ఇతనే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. "తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం "వివిపించే తపస్సు" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవాడు. - ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని చెప్పేవాడు.
చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి.
పురస్కారాలు[మార్చు]
- మద్రాసు మ్యూజిక్ అకాడమీ - సంగీత కళానిధి అవార్డు - 1941.
- సంగీత నాటక అకాడమీ - 1953[2]
- పద్మశ్రీ అవార్డు - 1957.[3]
- భారతీయ తపాలా శాఖవారు 1993లో ఆతని శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు.
- రాజా లక్ష్మీ అవార్డు - 1992లో - శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారిచే, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.
మూలాలు[మార్చు]
- ↑ A titan among violin wizards
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-16. Retrieved 2020-01-07.
- ↑ http://www.india.gov.in/myindia/images/ps_awards.pdf
బయటి లింకులు[మార్చు]
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ద్వారం వారి వంశవృక్షం
- 1893 జననాలు
- 1964 మరణాలు
- తెలుగువారిలో సంగీతకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- వాయులీన విద్వాంసులు
- మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు
- విజయనగరం జిల్లా సంగీత విద్వాంసులు
- విజయనగరం జిల్లా ఉపాధ్యాయులు