కేతు విశ్వనాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:
[[బొమ్మ:Kethu viswanathareddy kathalu front cover.jpg|thumb|right|[[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు]]
[[బొమ్మ:Kethu viswanathareddy kathalu front cover.jpg|thumb|right|[[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు]]
[[దస్త్రం:Ketu vishvanatha reddy.jpg|thumb|right|200px|కేతు విశ్వనాథరెడ్డి]]
[[దస్త్రం:Ketu vishvanatha reddy.jpg|thumb|right|200px|కేతు విశ్వనాథరెడ్డి]]
'''కేతు విశ్వనాథ రెడ్డి''' ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, [[కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)]] కథాసంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం [[హిందీ]], [[కన్నడం]], [[మలయాళం]], [[బెంగాలీ]], [[మరాఠీ]], [[ఆంగ్లం]], [[రష్యన్]] భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు [[రిజర్వేషన్లు|రిజర్వేషన్లకు]] సంబంధించి [[క్రీమీ లేయర్]] మీద వెలువడిన మొట్టమొదటి [[నవల]].
'''కేతు విశ్వనాథ రెడ్డి''' ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] పొందాడు. == వ్యక్తిగత జీవితం ==
[[జూలై 10]], [[1939]] న [[వైఎస్ఆర్ జిల్లా]] [[కమలాపురం]] తాలూకా [[రంగశాయిపురం]] గ్రామంలో జన్మించాడు.

== విద్యాభ్యాసం, వృత్తి ==
[[జూలై 10]], [[1939]] న [[వైఎస్ఆర్ జిల్లా]] [[కమలాపురం]] తాలూకా [[రంగశాయిపురం]] గ్రామంలో జన్మించాడు. ఈయన తొలి కథ అనాదివాళ్ళు [[1963]]లో [[సవ్యసాచి (పత్రిక)|సవ్యసాచి]]లో ప్రచురితమైంది. ''కడపజిల్లా గ్రామనామాలు'' అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, [[తిరుపతి]], [[హైదరాబాదు]] లాంటి చోట్ల అధ్యాపకుడుగా పని చేసి [[డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]లో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. [[ఈనాడు]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.
''కడపజిల్లా గ్రామనామాలు'' అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, [[తిరుపతి]], [[హైదరాబాదు]] లాంటి చోట్ల అధ్యాపకుడుగా పని చేసి [[డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]లో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. [[ఈనాడు]], [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

== సాహిత్య రంగం ==
[[కొడవటిగంటి కుటుంబరావు]] సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. [[విశాలాంధ్ర]] తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు [[అరసం]] (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు.
ఈయన తొలి కథ అనాదివాళ్ళు [[1963]]లో [[సవ్యసాచి (పత్రిక)|సవ్యసాచి]]లో ప్రచురితమైంది. [[కొడవటిగంటి కుటుంబరావు]] సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. [[విశాలాంధ్ర]] తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు [[అరసం]] (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, [[కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)]] కథాసంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం [[హిందీ]], [[కన్నడం]], [[మలయాళం]], [[బెంగాలీ]], [[మరాఠీ]], [[ఆంగ్లం]], [[రష్యన్]] భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు [[రిజర్వేషన్లు|రిజర్వేషన్లకు]] సంబంధించి [[క్రీమీ లేయర్]] మీద వెలువడిన మొట్టమొదటి [[నవల]].

ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు.
ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు.


==పురస్కారాలు==
==పురస్కారాలు==

12:35, 13 అక్టోబరు 2014 నాటి కూర్పు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కేతు విశ్వనాథరెడ్డి కథలు
కేతు విశ్వనాథరెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. == వ్యక్తిగత జీవితం == జూలై 10, 1939వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం, వృత్తి

కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పని చేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.

సాహిత్య రంగం

ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథాసంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల.

పురస్కారాలు

అధ్యాపకుడుగా

  • విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.

ఇతరుల మాటలు

  • ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)
  • 1960 నుంచి ఒకపాతిక,ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-మధురాంతకం రాజారాం
  • విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది.అలంకారాలుండవు-అనుభూతివుంటుంది;కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది.కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారయణ
  • నీల్లులేని రాయలసీమలో జీవనప్రవాహంలో తనుమోసిన,అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య
  • ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి.కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది.అంటే అంత కఠినమైనది.తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు
  • ...సానుభూతితో,మానవతావాదంతో,వర్గచైతన్యంతో,స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ,స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా
  • ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్