బాదేపల్లి
బాదేపల్లి,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.
బాదేపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | జడ్చర్ల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,598 |
- పురుషుల సంఖ్య | 16,329 |
- స్త్రీల సంఖ్య | 16,269 |
- గృహాల సంఖ్య | 6,957 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ పట్టణం జడ్చర్లకు జంట పట్టణంగా కొనసాగుతుంది. పేరుకు రెండూ వేర్వేరుగా ఉన్ననూ భౌగోళికంగా కల్సే ఉన్నాయి. రెండింటికీ ప్రస్తుతం వేర్వేరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ రెండిటినీ కల్పి మున్సీపాలిటీగా మార్చాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. విద్య,వ్యాపారం పరంగా ఇది బాగా అభివృద్ధి చెందింది. జడ్చర్ల పేరుతో రైల్వే స్టేషను ఇక్కడే ఉంది.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం[మార్చు]
శ్రీ కన్యకా పరమేశ్వరీ మాత ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. సర్వసంపదలకూ అధిపతియైన కుబేరుడే, తనకు ఒక పుత్రిక కావాలని తపస్సుచేయడం, పెనుగొండరాజు కుసుమగుప్తుడిగా కుబేరుడు జన్మించి, పార్వతీదేవినే పుత్రికగా పొంది, ఆ తల్లి వాసవీ దేవిగా పెరిగి పెద్దదై, భౌతికసుఖదుఖాలకు, దుర్మార్గులకు తలవంచనని నిరూపిస్తూ, కలియుగంలో ధర్మ సంరక్షణా ప్రయత్నంలో, ఆత్మార్పణం చేసుకున్న పవిత్రురాలు ఈ జగన్మాత. ఆ తల్లి వైశ్యుల కులదేవతగా, భక్తుల పూజలందుకొనుచుంది.[1]
విద్యాసంస్థలు[మార్చు]
- విశ్వవికాస్ జూనియర్ కళాశాల ( స్థాపన: 1996-1997 ) *
- డాక్టర్ బి.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ & పోష్టు గ్రాడ్యేట్ కళాశాల.
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు 29 నవంబరు,2013. తీర్ధయాత్ర పేజీ