బాబా లక్కీషా బంజారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాబా లక్కీషా బంజారా[మార్చు]

బాబా లక్కీషా బంజారా (4జూలై 1580- 07- జూన్ 1680) ఢిల్లీకి చెందిన బంజారా రాజు.ఢిల్లీ సమీపంలోని రాయిసిన తాండ నివాసి. గొప్ప ధైర్య సాహసం గల బలయోధుడు, ధనికుడు పెద ప్రజల పేన్నిది ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యాపారి.[1]

బాబా లక్కీషా బంజారా
జననంజూలై 04, 1580
హర్యానా , భారతదేశం
మరణంమే,28 , 1680
మాలచా తాండ ఢిల్లీ
మరణ కారణంవృద్ధాప్యం
వృత్తిఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త
ఉద్యోగంబంజారా రాజు, వీర యోధుడు
ప్రసిద్ధినవంబర్,11, 1675 గురు తేజ్ బాహదుర్ పార్థివ శరీరాన్ని దహన సంస్కారం
భార్య / భర్తపారా బాయి
భాగస్వాములునానురాయ్,భాయి జేతా,ఊదా
పిల్లలునీగహియా, హెమచంద్ ,హడీ,హీరా,పూండియా,బక్షీ,బాలాజ్,జవహర్, కూతురు సీతా
తండ్రిగోదు నాయక్ బంజారా

బాల్యం,కుటుంబం[మార్చు]

బాబా లక్కీషా బంజారా 04 జులై 1580‌ వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని రాయిసిన తాండలో జన్మించారు.గోర్ బంజారా వంశం,గోత్రం‌ వడ్త్యా,నాన్న పేరు గోదు నాయిక్ బంజారా, తాత ఠాకూర్ నాయక్ బంజారా వద్ద ఇంట్లోనే విద్యాభ్యాసం తో పాటు భారతీయ సంస్కృతి సభ్యత నేర్చుకున్నారు. అతని అర్ధాంగి పేరు పారాబాయి, పుత్రులు ఏడుగురు కూతురు ఒక్కరూ అందులో హేమ,హడి,నగైయా, హియా, పూండియా,‌ బక్షి, బాలాజ్ కూతురు సీతా, మొదలగు వీరి కుటుంబం. జాదవ్ బన్సీ భాట్ ఖాతా పుస్తకంలో బంజారా భాట్ ఆధారంగా ఖైరపూర్ ముజాఫర్ ఆలిపూర్ జిల్లా పాకిస్థాన్ లో జన్మించారని, సిక్కుల చరిత్ర ఆధారంగా హర్యానా రాష్ట్రలో జన్మించారని కొందరి వాదన. మరణం తేది: 28 మే 1680 కొత్త ఢిల్లీ సమీపంలోని మాలచా తాండాలో అతను 99 సంవత్సరాలు 10 నేలలు జీవించారని అంటారు.వృత్తిరీత్య వ్యాపారం చేసేవారు. ప్రపంచంలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద ధనవంతుడు.అతని వద్ద జీతగాళ్ళు లక్షల్లో ఉండేవారు, గుర్రాలు లక్షల్లో, ఏనుగులు లక్షల్లో, ఆవులు లక్షల్లో ఎడ్లు, ఎడ్ల బండ్లు లక్షల్లో అతని వద్ద ఏది ఉన్నా అవి అన్నీ లక్షల సంఖ్యలో ఉండేవని‌ అందుకే అతనిని లక్ష బంజారా అని, లక్కీ బంజారా అని, లక్కీరామ్ నాయక్ బంజారా అని లాఖా బంజారా అని, లక్కీషా బంజారా అని వివిధ పేర్లతో పిలిచేవారు[2].

వ్యాపారం[మార్చు]

బాబా లక్కీషా బంజారా  మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సైనికులకు గుర్రాలకు సంబంధించిన కళ్ళేం, ఇతర ఇతర సామాగ్రిలు వివిధ రకాల సరుకులు ఉప్పు, పప్పు, కారం, పసుపు, బెల్లం, మసాలా దినుసులు మొదలగు ఎడ్ల బండ్ల పైన రవాణ చెసేవారు.అంతేకాకుండా ఢిల్లీ నుండి  పాకిస్థాన్ లోని లాహోర్,పెషావర్, కాబుల్, కాందహర మొదలగు  ప్రాంతాలలో కూడా ఎడ్ల బండ్లు, గుర్రాల బండ్ల పైన ముఖ్యంగా ఉప్పు ఇతరసరుకులు రవాణా చేసేవారు దారిలో గుర్రపు బండ్లు , ఎడ్ల బండ్ల జీతగాళ్ళుకు స్వేద తీర్చడానికి దారిలోని వివిధ ప్రాంతాలలో తాండలు ఏర్పాటు చేసారు.

పెద్ద భూస్వామి[మార్చు]

అతను పెద్ద భూస్వామి కావడం వలన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో  వందల  ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములు అన్ని అతని అధినంలో ఉండేవి. వాటిలో రాయసిన మరాచి, నరేల ,బరాఖంబ ఢిల్లీ నగరాన రాయిఘడ్ తాండ మొదలగు ప్రాంతాలు అయిన పరదిలో ఉండేవి.ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, ఎర్రకోట, ఇండియా గేట్, చాందినీ చౌక్, చావడి బజార్, దర్యాగంజ్ ,ఢిల్లీ ఇప్పటి మెట్రో ప్రాంతం ఢిల్లీ కంటోన్మెంట్  మొదలగు ఇతని ఆధిపత్యంలో ఉండేవని సిక్కుల చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.లక్కీషా బంజారా వద్ద పనిచేసే  జీత గాళ్ళలంతా  ఢిల్లీ లోని ఎర్రకోట,పూరానా ఖిల్లా, లోడి గార్డేన్,సబ్దర్ జంగ్, ఏలియా దర్వాజా మొదలగు నిర్మాణానికి, ఎడ్ల బండ్లతో  భవనానికి సంబంధించిన రాళ్ళు, ఇటుకలు,సున్నం, లోహపు వస్తువులు తలుపులు,మొదలగు సామాగ్రిని మోసినారని చరిత్ర చెప్పుతుంది.

ధైర్య సాహసం[మార్చు]

మొఘల్ సామ్రజ్యాం చివరి చక్రవర్తిగా  ఔరంగజేబు క్రీ,శ 1658 వ సంవత్సరం నుండి 1707 వ సంవత్సరం వరకు రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో దేశాన్ని పాలించిన అత్యంత వివాదాస్పదమైన మరియు కౄరమైన వ్వక్తిగా పేరు సంపాదించారు.అతని కాలంలో  మొఘల్ సామ్రజ్యాం అత్యంత విస్తీర్ణం సాధించి  దక్షిణాన మహారాష్ట్ర,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మొదలగు ప్రాంతాలలో ఆధిపత్యం కొనసాగింది.అతని కాలంలో హిందువులు, సిక్కులు, ద్వితీయ శ్రేణి పౌరులుగా  ఉండి నిరంతరము పీడించబడుతూ భయపడుతూ కాలం గడిపేవారు. సిక్కు మతములో  తొమ్మిదవ గురువు అయిన గురు టేక్ బహదూర్ మత మార్పిడికి నిరా కరించడంతో అతనికి 11 నవంబర్ 1675 వ సంవత్సరంలో భాయిజేతా,భాయి గురుభక్షసింగ్ కళ్ళముందే ఢిల్లీ నగరం లోని చాందినీ చౌక్ వద్ద  శిరశ్చేదం చేయించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఢిల్లీ సుబేదారుల ఆజ్ఞా ప్రకారం గురువు యొక్క పార్థీవదేహాన్ని  చాందినీచౌక్ నుండి తీసుకువేళ్ళి అంతిమ సంస్కారాలు చెయ్యుటకు ఎవ్వరు కూడా ధైర్యసా హసాలు చెయ్యలేదు.ఒక రోజు భాయి నానురాయ ఇంట్లో భాయి జేతా,ఊదా అందరూ కలిసి సమావేశమై గురువు దేహ అంతిమ సంస్కారం గురించి చర్చించి చివరికి నానురాయ నిర్ణయం ప్రకారం బాబా లక్కీషాబంజారా మాత్రమే ఈ పని చెయ్యగలడని ఒక నిర్ణయానికి వచ్చారు. లక్కీషా బంజారా తన  యొక్క కొడుకులు జీత గాళ్ళతో  ఐదువందల ఎడ్లబండ్లు తీసుకోని చాందినీ చౌక్ బయలుదేరి గురువు టేక్ బహదూర్ పార్థీవ శరీరాన్ని ఔరంగజేబు సైన్యాంతో కోట్లాడి రాయిసిన తాండాకు తీసుకుని వచ్చి గురువు తల లేని మొండెంను అతని ఇంట్లోనే ఉంచి ఇంటికి నిప్పుపెట్టి గురువు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.ఇది సిక్కు మతములో బాబా లక్కీషా బంజారా సృష్టించిన కొత్త అధ్యాయం.అంతటి బల యోధుడు, వీరుడు,శురుడు, కార్య నిర్వాహకుడు,కర్తవ్య దీక్షా పరునిగా, అన్యాయాన్ని ఎదిరించే సాహసం, శత్రువులను ఎదురించే ధైర్యం తన ధైర్య సాహసంతో ఔరంగజేబు సైన్యాన్ని గడగడ లాడించి వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు బాబా లక్కీషా బంజారా.

భారతీయ రోడ్డు మార్గాలకు పునాది[మార్చు]

భారతీయ రోడ్లకు పునాదులు వేసారని, అడవుల్లో గోవులను మేపి ఎక్కడైతే చీకటి పడుతుందో ఆ ప్రాంతంలో ఢేరాలను ఏర్పాటు చేసి అచ్చటనే ఉండేవారు. ఆ ఢేరాలే ఇప్పటి తాండలు లక్కీషా బంజారా ఆవులు,ఎడ్లు, నడచిన చేసిన మార్గాలు మరియు లక్షల సంఖ్యల ఎడ్ల బండ్లతో ఉప్పు ఇతర సరుకులు రావాణా చెశారు.అవి ఏ ఏ మార్గాల నుండి రవాణా చేసినారో దానిని పరిశీలించిన అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసి గారు దానినే ఆధారంగా చేసుకుని,1853 వ సంవత్సరంలో రోడ్డు,రైలు వ్వవస్థాను ప్రారంభించారు.

అపర భగీరథుడు[మార్చు]

భగీరథుడు గంగానది ని  భూవికి తీసుకుని రావడానికి  తపస్సు చేసి శివుడు అను గ్రహించడంతో  గంగాను తలపై మోపి జటాజూటంలో బంధించి ఒక పాయను నెల పైకి వదలినాడు అని పురాణాలలో విన్నాం.16 వ శతాబ్దంలో బాబా లక్కీషా బంజారా తన వద్ద ఉన్న లక్షల ప్రజల కోసం,లక్షల మూగజీవాల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ ఝీల్ ను  నిర్మించి జనాలను,ముగజీవాలను దప్పిక తీర్చాడాని తవ్వించారని  చెరువులో నీళ్ళు రాకపోవడంతో తన స్వంత కొడుకు కోడళ్ళను నీళ్ళ కోసం బలిదానాలు చేసినాడని చెప్పడంలో ఎలాంటి  సందేహము లేదు. సాగర్ జిల్లా లోని సాగర్ చెరువు బుందేల్ ఖండ్ చెరువు, రేవులు వందల ఎకరాల విస్తరణంతో  ఇప్పటికీ ఉన్నాయి ఇది ప్రత్యేక్షసాక్షం. సాగర్‌ ఝీల్ ( లాఖా బంజారా ఝీల్ ) అను పేరుతో ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో ఉంది. లాఖా బంజారా ఝీల్ ను సందర్శించిన అప్పటి భారత ప్రథమ ప్రధాని స్వర్గీయ జవహలాల్ నెహ్రూ సాగర్ చెరువును భారతదేశపు స్విట్జర్లాండ్ అని అన్నారు.ఢిల్లీ నగరంలోని బారాబంఖీ, నరేలా,లోహగర్ కోట (యమునా నగర్ జిల్లా హర్యానా), కాసంగ్ గంజ్ రాయమల్ కాంజీ, పురాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని మథూరా, వృంధావన్  బరేలి మొదలగు నగరాల్లో లక్కీషా బంజారా తవ్వించిన  బావులు, చెరువులు రేవులు ఇప్పటికీ  మనకు దర్శనమిస్తాయి[3].

మరణం[మార్చు]

ఇంతటి ఘన చరిత్ర గల వ్యాపారి బంజారా యోధుడు తేది:28 మే 1680 లో కొత్త ఢిల్లీ సమీపంలోని మాలచా తాండ ప్రస్తుతం మాలచా ప్యాలెస్ లో తొంబై తొమ్మిది సంవత్సరాలు పది నెలలు జీవించి పరమపదించారు. ఈ మహావీరుని విగ్రహం ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Lakhi Shah Vanjara - SikhiWiki, free Sikh encyclopedia". www.sikhiwiki.org. Retrieved 2024-03-10.
  2. బి చీనియా నాయక్ (1998). బంజారా చరిత్ర (సంస్కృతి-ప్రగతి).
  3. "అపర భగీరథుడు బాబా లక్కీషా బంజారా – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-03-07. Retrieved 2024-03-10.