మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ ఉనికి

మహబూబ్ నగర్ జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 19 మండలాలు, 471 రెవెన్యూ గ్రామాలు, 431 గ్రామపంచాయతీలు ఉన్నాయి.[1] 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 13,51,269. ఈ డివిజన్ 7 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో 3 పురపాలక సంఘాలు కూడా ఉన్నాయి. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ జిల్లాలోనే పెద్దది. మహబూబ్ నగర్ పట్టణంలో కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలోనే ఆర్డివో కార్యాలయం ఉంది.

మహబూబ్నగర్ జిల్లా పురపాలక సంఘం

డివిజన్ పరిధిలోని మండలాలు[మార్చు]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ జనాభా 13,51,269. ఇందులో పురుషులు 6,86,568 కాగా, మహిళలు 6,64,701. డివిజన్ లో పట్టణ జనాభా 3,44,742, గ్రామీణ జనాభా 10,06,527. అత్యధిక జనాభా కల మండలం మహబూబ్ నగర్ మండలం కాగా, అత్యల్ప జనాభా కల మండలం కేశంపేట.

నియోజకవర్గాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 7 శాసనసభ నియోజకవర్గాలలో విస్తరించియుంది. అలాగే 2 లోక్‌సభ నియోజకవర్గాలలో వ్యాపించియుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Hand Book of Statistics, Mahabubnagar Dist-2010, Published by Chief Planning Officer - Mahabubnagar