మహెజబీన్
మహెజబీన్ | |
---|---|
![]() మహెజబీన్ | |
పుట్టిన తేదీ, స్థలం | 1961 (age 61–62)![]() |
"'మహెజబీన్"' 20 వ శతాబ్ది చివరి దశకంలో అత్యంత ప్రభావశీలంగా కవితలల్లిన కవయిత్రి.. సమకాలీన కవుల, విమర్శకుల మన్నన పొందిన అతికొద్ది మంది కవయిత్రులలో ఒకరు.
జననం[మార్చు]
మహెజబీన్ 1961లో నెల్లూరులో జన్మించారు. పూర్తి పేరు మహెజబీన్ మహ్మద్.
విద్య[మార్చు]
ఈమె సామాజిక సేవా శాస్త్రంలో మాస్టర్ డిగ్రిని, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రిని పొందారు.
వైవాహిక జీవితం[మార్చు]
వీరి జీవిత భాగస్వామి పి.వి. ఉపేంద్ర.. వీరికి ఒక కుమారుడు కలడు.
వృత్తి - ప్రవృత్తి[మార్చు]
న్యాయవాదిగా కొనసాగుతూ, సామాజిక సేవలో విశిష్ట సేవలందిస్తున్నారు .ముఖ్యంగా స్త్రీ, శిశు సంక్షేమం కొరకు చేస్తున్న సేవలకుగానూ అమె పలు పురస్కారాలు అందుకున్నారు.
సాహితీ సేవలో...[మార్చు]
తెలుగు స్త్రీవాద కవయిత్రులలో చెప్పుకోదగిన వారిలో జబీన్ ఒకరు. 1991 నుండి కవిత్వం రాస్తున్నారు[1].. ఓల్గా తదితరులతో కలిసి నీలి మేఘాలు ను వెలువరించింది. 1997లో తన తొలి కవితా సంకలనం "ఆకురాలు కాలం" ను వెలువరించింది. ఇందులో 26 కవితలు ఉన్నాయి. ఆకురాలు కాలం, జ్ఙాపకం, జావళి, ఎలిజీ, నైసర్గిక స్వరూపం, స్ట్రీట్ చిల్డ్రన్ వాటిలో కొన్ని. స్ట్రీట్ చిల్డ్రన్ కవిత ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థులకు తెలుగులో ఒక పాఠ్యాంశంగా ఉంది. ఆమె కవిత్వంలో మనకు స్త్రీవాద దృక్పథం, విప్లవ సానుభూతి కనిపిస్తుంది.
జబీన్ కవిత్వంపై ప్రముఖుల వ్యాఖ్య[మార్చు]
"A lyrical beauty" - శివారెడ్డి " ఈ దశాబ్దపు మరో వాగ్ధానం జబీన్" - చేరా
అవార్డులు[మార్చు]
మహెజబీన్ సాహితీ, సామాజిక సేవా రంగాలలో అందిస్తున్న విశిష్ట సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. వాటిలో కొన్ని...
- రమణ - సుమనశ్రీ అవార్డు (1999)
- జ్యోత్స్న కళాపీఠం అవార్డు (2006)
- రాజీవ్ గాంధీ మానవ సేవా అవార్డు ( 2007 )
- నారీశక్తి పురస్కారం (2008, భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా)
- తెలుగు భాషా పురస్కారం ( 2009 )