Coordinates: 16°52′30″N 80°13′10″E / 16.874862°N 80.219307°E / 16.874862; 80.219307

ముచ్చింతాల

వికీపీడియా నుండి
(ముంచింతల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ముచ్చింతాల
—  రెవెన్యూ గ్రామం  —
ముచ్చింతాల is located in Andhra Pradesh
ముచ్చింతాల
ముచ్చింతాల
అక్షాంశరేఖాంశాలు: 16°52′30″N 80°13′10″E / 16.874862°N 80.219307°E / 16.874862; 80.219307
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం పెనుగంచిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,577
 - పురుషులు 1,269
 - స్త్రీలు 1,308
 - గృహాల సంఖ్య 665
పిన్ కోడ్ 521190
ఎస్.టి.డి కోడ్ 08678

ముచింతల @ బోడపాడు ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 665 ఇళ్లతో, 2577 జనాభాతో 746 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1269, ఆడవారి సంఖ్య 1308. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1567 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 116. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588860. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[1][2]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

మూడు చింత చెట్లు ఉండటము వలన ఈ గ్రామం నకు ఆ పేరు వచ్చినట్లు ప్రముఖ భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ గ్రామంనకు బోడపాడు అనే మరొక పేరు కూడా ఉంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం, పెనుగంచిప్రోలు ప్రక్కన మునేటిని కాజ్ వే దాటుకొని ఆవల ప్రక్కకు వెళితే ఉండును.

సరిహద్దు గ్రామాలు[మార్చు]

ముచ్చింతాలకు తూర్పున అనిగండ్లపాడు, ఉత్తరాన కంభంపాడు, పడమరలో రేగులగడ్డ, దక్షిణాన పెనుగంచిప్రోలు గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో వేమవరం, మాచినేనిపాలెం, అల్లూరుపాడు, కాకరవాయి గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ముచింతల @ బోడపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. పెనుగంచిప్రోలు నుండి ఆటో సౌకర్యము కూడా ఉంది. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. మోటిమర్రి రైల్వేస్టేషన్. ప్రధాన రైల్వేస్టేషన్ విజయవాడ 63 కి.మీ దూరంలో ఉంది.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ముచింతల @ బోడపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి జగ్గయ్యపేటలోను, మాధ్యమిక పాఠశాల పెనుగంచిప్రోలులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పెనుగంచిప్రోలులోను, ఇంజనీరింగ్ కళాశాల జగ్గయ్యపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో, 2015.ఆగష్టు-21వ తేదీనాడు, మైత్రీవన గ్రామభ్యుదయ సమితి వారు, డ్రోన్ (ఫ్లయింగ్ కెమెరా) పనితీరును విద్యార్థులకు వివరించారు. బుల్లి విమానం ఆకాశంలో పైకి ఎగురుతూ, ఆకాశంలో ఎగురుతూ గ్రామాన్నీ, పాఠశాలను ఫొటోలు తీయడం, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఇప్పుడున్న గ్రామాన్ని, రెండు సంవత్సరాలలో, సమూల మార్పులు చేసే ప్రయత్నాలల్లో భాగంగా, ఈ ఫొటోలు తీసినట్లు వారు చెప్పినారు. [4] మూడు సంవత్సరాల క్రితం, ఈ పాఠశాలలో మైత్రీ వనం పేరిట ఏర్పడిన గ్రామస్థుల కమిటీ, పాఠశాల అభివృద్ధిపై నిత్యం చర్చించుచునేయున్నది. ఈ పాఠశాలకు, ప్రహరీ, వంటగది నిర్మాణం చేపట్టినారు. పెద్దయెత్తున మొక్కల పెంపకం చేపట్టినారు. గ్రామస్థుల చొరవ, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసారు. ఈ పాఠశాల 2016-17 విద్యా సంవత్సరంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో, నందిగామ సబ్‌డివిజన్ పరిధిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైనది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

చౌకధరల దుకాణం[మార్చు]

గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ దుకాణాన్ని, 2017, మార్చి-6న ప్రారంభించారు.

ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ కేంద్రం భవనాన్ని, 2017, జూన్-4న ప్రారంభించారు.

అంగనవాడీ కేంద్రం[మార్చు]

ఈ గ్రామంలో 9 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగనవాడీ కేంద్రం భవనాన్ని, 2017, జూన్-4న ప్రారంభించారు.

రహదారులు[మార్చు]

గ్రామంలో లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రహదారులను, 2017, జూన్-4న ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013లో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ చావల రామారావు సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. ఒక దేవాలయము.
  2. ప్రస్తుతం ఈ గ్రామంలోని రామాలయం పునర్నిర్మాణంలో ఉంది.
  3. రెండు చర్చిలు.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ముచింతల @ బోడపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 68 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 104 హెక్టార్లు
  • బంజరు భూమి: 203 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 363 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 359 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 311 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ముచింతల @ బోడపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 105 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 204 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 2 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ముచింతల @ బోడపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి, మిరప, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తుల

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కొచ్చెర్ల రమేష్, చిన్నప్పటినుండి చాలాకష్టపడి చదువుకుని పైకి వచ్చి, ప్రస్తుతం, బెంగుళూరులో "శాంసంగ్" కంపెనీలో ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. వీరు తన స్వగ్రామానికి మేలుచేయాలనే తలంపుతో, గ్రామంలో "ఫ్రండ్స్ మిషన్" అను ఒక స్వచ్ఛందసేవాసంస్థను స్థాపించి, గ్రామీణ విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం ద్వారా అంగ్లభాషలో ప్రావీణ్యం సంపాదించుకునేలాగానూ మరియూ కంప్యూటరు పరి!~ఆనం లోనూ ఉచితంగా శిక్షణను ఇప్పించుచున్నారు. ప్రస్తుతం ఈ శిక్షణ శిబిరంలో ముచ్చింతాల, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, తాళ్ళూరు గ్రామాలకు చెందిన 50 మంది విద్యార్థులు శిక్షణ పొందుచున్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

పూర్తిస్థాయి మద్యనిషేధం అమలులో ఉన్న గ్రామంగా, ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 2009 లో మొదలయిన మద్యనిషేధం నేటికీ అమలులో ఉంది. గ్రామ మహిళల స్ఫూర్తితో గుమ్మడిదుర్రు గ్రామంలోనూ, గడచిన 9 నెలలుగా మద్యం గొలుసు దుకాణాలు మూయించారు. ఈ రెండు గ్రామాలలో ఎవరైనా మద్యం విక్రయించినా, త్రాగినా వెయ్యి రూపాయల జరిమానా విధించేలాగా మహిళలు పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు. మద్యం విక్రయాలపై కొణకంచి, తోటచర్ల మహిళలు నాలుగు నెలలుగా ఉద్యమం చేసి, ఆ గ్రామంలో సైతం మద్యం అమ్మకాలు అరికట్టగలిగారు. 2100 జనాభా ఉన్న తోటచర్లలో మద్యం విక్రయాలు చేపడితే, పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హుకుం జారీ చేశారు. దీనితో ఈ నాలుగు గ్రామాలలో మద్యనిషేధం పూర్తిస్థాయిలో అమలవుతోంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2426. ఇందులో పురుషుల సంఖ్య 1224, స్త్రీల సంఖ్య 1202, గ్రామంలో నివాస గృహాలు 540 ఉన్నాయి

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]