Coordinates: 15°56′05″N 79°38′03″E / 15.934613°N 79.634206°E / 15.934613; 79.634206

ముక్కెళ్ళపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్కెళ్ళపాడు
—  రెవెన్యూ గ్రామం  —
ముక్కెళ్ళపాడు is located in Andhra Pradesh
ముక్కెళ్ళపాడు
ముక్కెళ్ళపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°56′05″N 79°38′03″E / 15.934613°N 79.634206°E / 15.934613; 79.634206
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నూజెండ్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,920
 - పురుషుల సంఖ్య 1,968
 - స్త్రీల సంఖ్య 1,952
 - గృహాల సంఖ్య 998
పిన్ కోడ్ 522659
ఎస్.టి.డి కోడ్ 08646

ముక్కెళ్ళపాడు, పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన గ్రామం.

సమీప గ్రామాలు[మార్చు]

మూర్తజాపురం 6 కి.మీ, ఐనవోలు 6 కి.మీ, పమిడిపాడు 9 కి.మీ, శివాపురం 9 కి.మీ, అందుగులపాడు 10 కి.మీ

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామానికి చెందిన, మోతుబరి రైతు కుటుంబంలో పుట్టిన చండ్రా వెంకటనారాయణ, పి.యూ.సి చదివి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, గ్రామస్థుల ఒత్తిడి మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1978 లో ఈ గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. అప్పుడు కె.జెడ్డావారిపాలెం, పి.జెడ్డావారిపాలెం గ్రామాలూ ఇందులోనే కలిసి ఉన్నాయి. ఆ తరువాత ఆ రెండు గ్రామాలూ విడి పోయి, ముక్కెళ్ళపాడు ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత గూడా, ముక్కెళ్ళపాడు సర్పంచిగా మరో 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనాజు. 1970 నుండి 1995 వరకూ 25 ఏళ్ళు వరుసగా ఆ పదవిలో కొనసాగాడు. 2006 లో నూజెండ్ల జడ్.పీ.టీ.సీగా గెలుపొంది 5 ఏళ్ళు ఆ పదవిలో ఉన్నాడు. అప్పుడు పైసా ఖర్చు లేకుండా సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవాడు. తన పదవీ కాలంలో వినుకొండ - కురిచేడు మార్గంలో గుండ్లకమ్మ నది మీద వంతెన నిర్మింపజేశారు. సీతారాంపురంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి, 20 గ్రామాలలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భవించి 50 ఏళ్ళు అయిన సందర్భంగా 2009 లో కేంద్ర ప్రభుత్వం స్వర్ణోత్సవాలు నిర్వహించింది. 25 సంవత్సరాలు స్థానిక సంస్థల ప్రతినిదులుగా ఉండి, ఆ నాటికి గూడా పదవిలో కొనసాగుతున్న వారిని దేశవ్యాప్తంగా ఎంపికచేయగా, రాష్ట్రం నుండి 8 మంది మాత్రమే అర్హత పొందగా, గుంటూరు జిల్లాలో నారాయణ ఒక్కరికే ఈ ఘనత దక్కింది. ఢిల్లీలోని విద్యాభవన్ లో జరిగిన సన్మానకార్యక్రమంలో ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్, యూ.పి.ఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో ఆనాటి పంచాయతీ శాఖా మంత్రి సంగ్మా చేతులమీదుగా, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకున్నాడు. రాష్ట్ర ప్రథమ ఆర్థిక సంఘం 1994 జూన్ 4 న ఏర్పాటయినప్పుడు, నారాయణ అందులో నియమించబడిన నలుగురు సర్పంచులలో ఒకడు.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి నూజెండ్లలోను, మాధ్యమిక పాఠశాల వినుకొండలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వినుకొండలోను, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు వినుకొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వినుకొండలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ముక్కెళ్ళపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ముక్కెళ్ళపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ముక్కెళ్ళపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1228 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 19 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1504 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1079 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 425 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ముక్కెళ్ళపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 425 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ముక్కెళ్ళపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, కంది, మిరప

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో 2020, అక్టోబరు-29వతేదీ గురువారంనాడు, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ పోలేరమ్మ తల్లి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు. గ్రామములో ఉన్నత విద్యనభ్యసించి, పలుచోట్ల ఉద్యోగాలలో స్థిరపడిన వారు, సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో, 25 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహం, గ్రామస్థులు 25 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ పోలేరమ్మ తల్లికి ఆలయాన్నీ నిర్మించారు. [2]

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 3681, పురుషుల సంఖ్య 1862, మహిళలు 1819, నివాస గృహాలు 827, విస్తీర్ణం 2752 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు; 2013,జులై-26;.16వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]