Coordinates: 13°31′40″N 79°05′40″E / 13.527773°N 79.094393°E / 13.527773; 79.094393

రాయవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయవారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాయవారిపల్లె is located in Andhra Pradesh
రాయవారిపల్లె
రాయవారిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°31′40″N 79°05′40″E / 13.527773°N 79.094393°E / 13.527773; 79.094393
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పులిచెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,274
 - పురుషుల 631
 - స్త్రీల 643
 - గృహాల సంఖ్య 370
పిన్ కోడ్ 517172
ఎస్.టి.డి కోడ్ 08584

రాయవారిపల్లె చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పులిచెర్ల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 370 ఇళ్లతో, 1274 జనాభాతో 785 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 631, ఆడవారి సంఖ్య 643. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 176 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 28. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596186[1].పిన్ కోడ్: 517172.

గ్రామజనాభా[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 1,470 - పురుషులు 708 - స్త్రీలు 762 - గృహాల సంఖ్య 356 విస్తీర్ణం. 785 హెక్టార్లు. .

రాయవారి పల్లి చరిత్ర[మార్చు]

ఊరి ప్రక్కన ఏరు, దానికి ఇరు వైపులా మొగలి డొంకలు. ఈశాన్యదిక్కులో చెరువు, పంటపొలాలు మామిడితోటలు ఉన్నాయి. బస్సులు ఆగే స్థలం కామవరంకొత్తపేట. ఒక కిలోమీటరు దూరం. ఊరు చిన్నదైనా చిన్న పెద్దా కలిపి ఆరు దేవాలయాలు ఉన్నాయి. వీనిలో కోదండ రామాలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ గుడిలోని పంచలోహ విగ్రహాలను ఒకసారి దొంగలు ఎత్తుకుపోయారు కానీ మళ్ళీ దొరికాయి. ఈ గుడి ముందు గుడికంటే ఎక్కువ వయసున్న రెండు రాగి వృక్షాలు, వాని క్రింద నాగదేవతల శిలలు ఉన్నాయి. ఈ గుడి బాగోగులను పెద్దకరణం వాళ్ళు చూస్తారు. ఈ మధ్య కొత్తపల్లి నారాయణస్వామి కట్టించిన ఆంజనేయస్వామి గుడి నిత్య పూజాపురస్కారలతో, ధూపదీప నైవేద్యాలతో భక్తులను ఆకర్షిస్తోంది. ఇంకా మునుస్వామి పెట్టిన వినాయకుని విగ్రహం ఉంది. ఇడమలపాటి రంగయ్యనాయుడు కట్టించిన ఆలయం ఎందుకో పూర్తిగాలేదు.పూర్వకాలం చాలమంది ఋషులు కలిసి దేశక్షేమంకోసం యజ్ఞయాగాలు చేయగా ఆయాగాలనుండి వచ్చిన బూడిద ఒక చిన్న గుట్టగా పడింది. అదే రాయవారిపల్లికి కొళ్ళాయగారిపల్లికి మధ్య ఉండే బూడిదమిట్ట. ఇపుడు దాన్ని చదునుచేసి కొంతమంది సేద్యం చేస్తున్నారు. పొలంలో "లింగాకారంకాడ కయ్య" అని ఒక మదడి ఉంది. ఈ ప్రదేశంలో చాలాకాలం క్రితం శివాలయం ఉండేదట. తురుష్కుల దండయాత్రలో అది కొల్లగొట్టబడి శిథిలమైపోయింది. ఆగుడి స్తంభాలు, రాళ్ళు లింగాకారంకాడ కయ్య గట్లకు వాడారు. ఆవి ఇంకా అలాగే ఉన్నాయి. పాడుబడిపోయిన ఆ శివాలయంలోని శివలింగాన్ని తీసికొనిపోయి అప్పుడు దట్టమైన అడవిగా ఉన్న తలకోనలో, తురుష్కుల బారిని పడకుండా ఉండాలని చిన్న గుడి కట్టి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అదే ఇప్పటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, పుణ్యక్షేత్రంగా పేరు పొందిన తలకోన. చిన్నప్పుడు దేవళం దగ్గర చెట్ల కొమ్మలకు మోకులుగట్టి ఊగిన ఉయ్యాలలు, చెట్ల నీడల్లో ఆడుకున్న ఆటలు, దేవళం బావిలో వేసవికాలం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈత గొట్టడం, పటం పూజలు మెరవణులు చెయ్యడం, పెద్దవాళ్ళు మెచ్చుకోవడం, మామిడికాయలు, మొగలిపువ్వులు, చింతకాయలు దొంగతనంగా కొసేసి అమ్మి చిరుతిళ్ళు కొనుక్కోవడం, పెద్దలచేత చివాట్లు తినడం, కరణం గారి దొడ్లో గేదెలకుకట్టిన రబ్బరు తాళ్ళు విప్పుకొని, వాట్ని వెలిగించుకొని, ఆంజనేయదండకం గట్టిగా పాడుకొంటూ కొమ్మిరెడ్డిగారిపల్లికి మహా భారతానికి వెళ్ళడం, వెన్నెల రాత్రిళ్ళలో వంకలోని ఇసక పై ఆడిన ఉప్పరపట్టి, చెడుగుడు ఆటలు; అలిసిపోయి ఇసకలో చెలమలుతీసి త్రాగిన చల్లటి తియ్యటి నీళ్ళు... ఓహో ఆ ఆనందం, నిర్మలత్వం, హాయి ఇప్పుడు కావలనుకోవడం అత్యాశేమో! సంక్రాంతి నెల (ధనుర్మాసం ) వచ్చిందంటే ఆనెల పొడుగునా ఊళ్ళో ఆడ పిల్లలు ప్రతి సాయంత్రం గొబ్బెమ్మలను తట్టలో ఉంచి పూలు పసుపుకుంకాలతో అలంకరించి ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి గొబ్బి పాటలు పాడుతూ బియ్యం, పప్పులు, ఉప్పులు, డబ్బులు సేకరించేవాళ్ళు. భోగి పండగ రోజున ఆ సామగ్రితో దేవళం కాడ పొయ్యి పెట్టి రకరకాల వంటలుచేసే వాళ్ళు. తరువాత దేవుడికి నైవేద్యం పెట్టి అందరికి వడ్డించేవాళ్ళు. ఈ ఊరు చిత్తూరికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి రంగంపేట, నారావారిపల్లి మీదుగా తూర్పు అడవి గుండా బాటవేశారు. దీనిమూలంగా తిరుపతికి 41 కి.మీ దూరం. ఎత్తైన కొండలు లోయలగుండా ఈ బాట వేశారు. తిరుపతినుండి వచ్చేటప్పుడు బయలుకు ఎడమవైపు కొండలో స్ప్రింక్స్ లాంటి ఆకారం గలిగిన ఒక పెద్ద రాయి ఉంది. అడవి దారిలో దారి ప్రక్కన రేగి వెలగ, నేరేడు పండ్ల చెట్లు ఉంటాయి.ఆయా ఋతువుల్లో పండ్లురాలి దారిలో పడి ఉంటాయి. చిన్న చిన్న అడవి జంతువులు కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఏనుగులు పులులు కూడా కనిపించేవి. కాని ఇప్పుడు కనిపించటం లేదు.ఈదారిలో ప్రయాణించడం ఒక మధురానుభూతి. ఊరికి దగ్గరి పొగబండి నిలయం (రైల్వేస్టేషను ) మంగళంపేట.ఈ పల్లెలో కమ్మ వారి కుటుంబాలు ఎక్కువ. రామినేని, ఇడమలపాటి, కొత్తపల్లి, లంకిపల్లి ఇంటి పేరున్నవారున్నారు. వీరితోపాటు బలిజ కంసాలి వడ్రంగి కరణం కుటుంబాలూ ఉన్నాయి. రాయవారిపల్లి చాల పురాతనమైన ఊరు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు, సమీప జూనియర్ కళాశాల యెల్లంకివారిపల్ల్లె లోను, ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పాకాలలోను ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతి లోనూ, పాలీటెక్నిక్ పీలేరు లోనూ ఉన్నాయి., అనియత విద్యా కేంద్రం పులిచెర్లలోను, ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రాయవారిపల్లెలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రాయవారిపల్లెలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 145 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 159 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 117 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 120 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 38 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 196 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 169 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 65 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రాయవారిపల్లెలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 65 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రాయవారిపల్లెలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశనగ, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బెల్లం

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. వీనిలో కోదండ రామాలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ గుడిలోని పంచలోహ విగ్రహాలను ఒకసారి దొంగలు ఎత్తుకుపోయారు కానీ మళ్ళీ దొరికాయి. ఈ గుడి ముందు గుడికంటే యెక్కువ వయసున్న రెండు రాగి వృక్షాలు, వాని క్రింద నాగదేవతల శిలలు ఉన్నాయి. ఈ గుడి బాగోగులను పెద్దకరణం వాళ్ళు చూస్తారు. ఈ మధ్య కొత్తపల్లి నారాయణస్వామి కట్టించిన ఆంజనేయస్వామి గుడి నిత్య పూజాపురస్కారలతో, ధూపదీప నైవేద్యాలతో భక్తులను ఆకర్షిస్తోంది. ఈంకా మునస్వామి పెట్టిన వినాయకుని విగ్రహం ఉంది. ఇడమలపాటి రంగయ్యనాయుడు గారు కట్టించిన ఆలయం యెందుకో పూర్తిగాలేదు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]