పాండవ వనవాసం
| పాండవ వనవాసం (1965) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| నిర్మాణం | ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజనాల, కాంతారావు, ముదిగొండ లింగమూర్తి, బాలయ్య, మిక్కిలినేని, హరనాధ్, ప్రభాకరరెడ్డి, కైకాల సత్యనారాయణ, ముక్కామల, రమణారెడ్డి, పద్మనాభం, ధూళిపాళ, అల్లు రామలింగయ్య, ఎల్.విజయలక్ష్మి, సంధ్య, వాణిశ్రీ, సవితాదేవి, వీణావతి, సరస్వతి, బేబీ లత, రాజ సులోచన, చిత్తూరు నాగయ్య, ఋష్యేంద్రమణి, అజీత్ సింగ్, హేమామాలిని, మాలతి |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పి.లీల, మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
| కళ | ఎస్.కృష్ణారావు |
| నిర్మాణ సంస్థ | మాధవీ ప్రొడక్షన్స్ |
| నిడివి | 188 నిమిషాలు |
| భాష | తెలుగు |
పాండవ వనవాసం 1965 లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని సముద్రాల రాఘవాచార్య రచించారు.
విషయ సూచిక |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, తాము పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణుని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు. జరిగిన పరాభవాన్ని తలచుకొని కృంగిపోతున్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంపదను హరిస్తానని చెబుతాడు శకుని. ధృతరాష్ట్రుని ఆహ్వానంపై వచ్చిన ధర్మరాజు జూదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.
అరణ్యవాస సమయంలో పాండవుల్ని దూర్వాసుడు పరీక్షించడం, ద్రౌపది కోరికపై భీమసేనుడు సౌగంధికా కమలాలను సాధించి తేవడం, ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో పరాభవం పొందటం, పాండవుల ధాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్న సుయోధనుని ఆత్మహత్యా ప్రయత్నం, శశిరేఖ వివాహ సమయంలో లక్ష్మణ కుమారుని పరాభవం, అభిమన్యునితో వివాహం మొదలైన సంఘటనలన్నీ రసవత్తరంగా కూర్చి ఈ చిత్ర కథను రూపొందించారు.
[మార్చు] పాత్రలు-పాత్రధారులు
- నందమూరి తారక రామారావు - భీముడు
- ఎస్. వి. రంగారావు - దుర్యోధనుడు
- కాంతారావు - కృష్ణుడు
- సావిత్రి - ద్రౌపది
- ముదిగొండ లింగమూర్తి - శకుని
- గుమ్మడి వెంకటేశ్వరరావు - ధర్మరాజు
- బాలయ్య - అర్జునుడు
- మిక్కిలినేని - దుశ్శాసనుడు
- బి.పద్మనాభం - లక్ష్మణ కుమారుడు
- ప్రభాకర రెడ్డి
* హేమమాలిని - నాట్యకత్తె
- రాజసులోచన - నాట్యకత్తె
[మార్చు] విశేషాలు
- ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన హేమామాలిని కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
- ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
- జూద ఘట్టంలో మహాభారత కావ్యములో సభాపర్వములో ఆది కవి నన్నయ వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
- ఘటోత్కజుని పాత్ర చిత్రంలో సంధర్బోచితంగా ప్రవేశపెట్టారు.
- ఉత్తరాభిమన్యుల కల్యాణానికి మాయాబజార్ సినిమా లో శశిరేఖా పరిణయ ఘటాన్ని జత చేసి చిత్రానికి కొత్త సబసులద్దేరు.
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఓ వన్నెకాడా నిన్ను చూసి నా మేను పులకించెరా | సముద్రాల సీనియర్ | ఘంటసాల | ఎస్. జానకి బృందం |
| నా చందమామ నీవె భామ తారలే ఆన నీ నీడనే నా ప్రేమ సీమ | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల | ఘంటసాల పి.సుశీల |
| దేవా దీన బంధవా అసహాయురాలరా కావరా దేవా | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల | పి.లీల |
| బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు | ఆరుద్ర | ఘంటసాల | పి.సుశీల, పద్మనాభం |
| మహినేలే మహారాజు నీవే మనసేలే నెరజాణ : | సముద్రాల సీనియర్ | ఘంటసాల | పి. లీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
| మొగలీరేకుల సిగదానా మురిడీ గొలుసుల | కొసరాజు | ఘంటసాల | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
| విధి వంచితులై విభవమువీడి అన్నమాట కోసం అయ్యో అడవి పాలయేరా | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల | ఘంటసాల |
| హిమగిరి సొగసులు మురిపించును మనసులు | సముద్రాల రాఘవాచార్య | ఘంటసాల | ఘంటసాల పి.సుశీల |
| రాగాలు మేళవింప ఆహా హృదయాలు పరవశింప | సముద్రాల సీనియర్ | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| ఉరుకుల పరుగుల దొర |
[మార్చు] పద్యాలు
- అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- ఏకచక్రపురాన ఎగ్గుసిగ్గులు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది- రచన: సముద్రాల సీనియర్
- ఓ కమలాననా వికసితోత్పలోచనా నీలవేణీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్
- కారున్ కూతలు కూయబోకుమిక గర్వాంధా (పద్యం) - మాధవపెద్ది- రచన: సముద్రాల సీనియర్
- కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- ఙ్ఞానవిఙ్ఞానమోక్షదం మహాపాపరం దేవం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్
- ధారుణి రాజ్యసంపద మదంబున కోమల (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- నమో బ్రహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణహితాయచ (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- మనోజవం మారుతతుల్యవేగం ( ఆంజనేయ దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- మాయలమారివై మొగలు (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
- శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము (పద్యం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
- శ్రీకృష్ణా కమలానాభా వాసుదేవా సనాతనా గోవిందా ( పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
