ద్రౌపది
వికీపీడియా నుండి
ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. మహాభారతంలొ అతిముఖ్య పాత్రదారి.
విషయ సూచిక |
[మార్చు] జననం వెనుక కథ
ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. ఆమెకు భోగేచ్ఛ అత్యధికంగా ఉండడం వలన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా 'నాకు పతి కావాలి' అని ఐదుసార్లు కోరింది. శివుడు తధాస్తు అన్నాడు. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.
మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుని ఆఙ్ఞ ప్రకారం అర్జునుడు, భీమునితో కలసి వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి భాదపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది మరియు దృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది.
[మార్చు] బాల్యం
[మార్చు] పాండవులతో వివాహం
[మార్చు] మయసభ, కురురాజుకు అవమానం
[మార్చు] అరణ్య వాసం
[మార్చు] వస్త్రాపహరణం, ప్రతిఙ్ఞ
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి
దొలుతగాఁ బోరిలో, దుస్ససేను
తను వింత లింతలు తునియలై చెదరి రూ
పఱి యున్నఁ గని ఉడుకాఱుఁ గాక
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది
పెనుగద వట్టిన భీమసేను
బాహుబలంబునుఁ బాటించి గాండీవ
మను నొక విల్లెప్పుడును వహించు
కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుడును
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయమైతి మేనిఁ గృష్ణ! (తిక్కన)