ఎస్.జానకి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ఎస్.జానకి | |
| నేపథ్యం | |
|---|---|
| జననం | ఏప్రిల్ 23,1938 |
| సాహిత్యం | నేపథ్యగానం, కర్ణాటక సంగీతము |
| వృత్తులు | గాయని |
| వాయిద్యాలు | గాత్ర సంగీతం |
| క్రియాశీలక కాలం | 1957-2005 |
ఎస్.జానకి (S. Janaki) (జ.ఏప్రిల్ 23,1938) దక్షిణభారత నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. ఈమె తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత మరియు సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని మరియు సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరాపై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసినది.
[మార్చు] విశేషాలు
- నీ లీల పాడెద దేవా...అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది.
- నీలిమేఘాలలో,నీ ఆశ అడియాస,పగలే వెన్నెల జగమే ఊయల,పగలైతే దొరవేరా,నడిరేయి ఏజాములో,సిరిమల్లె పువ్వల్లే నవ్వు,గోవుల్లు తెల్లనా,మనసా తుళ్లిపడకే,ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో,నరవరా ఓ కురువరా, జననీ-వరదాయనీ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మమీదా...లాంటి 16000 పాటలు పాడారు
- జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు.
- ఫన్డాక్టర్ చంద్రశేఖర్ కుమారుడు వి. రాంప్రసాద్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.