ఎస్సీవీ నాయుడు
Jump to navigation
Jump to search
ఎస్సీవీ నాయుడు | |||
నియోజకవర్గము | శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానము | శ్రీకాంత్ | ||
నివాసము | శ్రీకాళహస్తి | ||
మతం | హిందు |
ఎస్సీవీ నాయుడు గా పేరుగాంచిన శాఖమూరి చెంచు వెంకటసుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకుడు. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఆయన తల్లిదండ్రులు చెంచుపాపానాయుడు, జ్ఞానమ్మ. శ్రీకాళహస్తి ఫ్రభుత్వ కళాశాలలో 1973-75 మధ్యలో ఇంటర్మీడియట్ చదివాడు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో నివాసముంటున్నాడు. ఎస్సీవీ కేబుల్ నెట్వర్క్ యజమాని.
రాజకీయ జీవితం[మార్చు]
మొదటగా తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ లోకి మారి తన రాజకీయ గురువుపైనే పోటీ చేసి గెలుపొందాడు. మరల 2009 ఎన్నికల్లో గోపాలకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యాడు.