చందర్లపాడు
చందర్లపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°42′54″N 80°12′32″E / 16.715°N 80.208889°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చందర్లపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
వైశాల్యము | |
- మొత్తం | 239.23 km² (92.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 59,943 |
- పురుషులు | 30,277 |
- స్త్రీలు | 29,666 |
- గృహాల సంఖ్య | 16,489 |
పిన్ కోడ్ | 521182 |
ఎస్.టి.డి కోడ్ | 08678. |
చందర్లపాడు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3056 ఇళ్లతో, 10958 జనాభాతో 1353 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5558, ఆడవారి సంఖ్య 5400. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2453 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 396. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589177[1].పిన్ కోడ్: 521182, ఎస్.టి.డి.కోడ్ = 08678.
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
చందర్లపాడు మండలం[మార్చు]
చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి, ఏటూరు, కోనాయపాలెం, కొడవటికల్లు, కాసరబాద, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, చందర్లపాడు, చింతలపాడు, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, పున్నవల్లె, పొక్కునూరు,పొప్పూరు, బొబ్బెళ్లపాడు, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, మునగాలపల్లె, ముప్పాల, విభరీతపాడు, వెలది, గ్రామాలు ఉన్నాయి.
సమీప గ్రామాలు[మార్చు]
[3] కోనాయపాలెం 6 కి.మీ, తోటరావులపాడు 6 కి.మీ, ముప్పాళ 7 కి.మీ, పొక్కునూరు 8 కి.మీ, కాసరబాద 9 కి.మీ
సమీప మండలాలు[మార్చు]
నందిగామ, అచ్చంపేట, కంచికచెర్ల, అమరావతి
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
చందర్లపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 51 కి.మీ దూరంలో ఉంది.
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నందిగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నందిగామలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు విజయవాడలోనూ ఉన్నాయి. డి.వి.ఆర్, రుత్విక్ మెమోరియల్ జూనియర్ కాలేజ్, ఎస్ వి కె ఎం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలమరియు నాగార్జున పబ్లిక్ స్కూల్ కూడా ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
చందర్లపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం[మార్చు]
గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
చౌకధరల దుకాణం:- ఈ దుకాణం గ్రామములోని బోసుబొమ్మ కూడలి (సెంటర్) సమీపంలో ఉన్నది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
గ్రామ దేవత శ్రీ అలివేలమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ సందర్భంగా వైభవంగా నిర్వహించెదరు. [4]
గంటలమ్మ చెట్టు[మార్చు]
భక్తుల సహకారంతో గంటలమ్మ చెట్టు అరుగును, ఆవరణను ఇటీవల అభివృద్ధిచేసారు. 2017,ఫిబ్రవరి-21వతేదీ మంగళవారంనాడు, ట్రాక్టర్ యజమానుల ఆధ్వర్యంలో మహిళలు ఈ చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. భక్తులు తయారుచేసిన ప్రసాదాలను గ్రామంలో ఊరేగించారు. గ్రామదేవత అలివేలమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు. [5]
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
చందర్లపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 186 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 10 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 16 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 15 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 13 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 16 హెక్టార్లు
- బంజరు భూమి: 2 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1095 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 941 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 172 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
చందర్లపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 86 హెక్టార్లు
- చెరువులు: 86 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
చందర్లపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]
బియ్యం
విశేషాలు[మార్చు]
చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామం మరియూ కంచికచర్ల మండలంలోని మొగులూరు గ్రామాల మధ్య, మునేరునదిపై, రు. 20 కోట్లతో, ఒక కాజ్ వే నిర్మించదానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కాజ్ వే నిర్మాణంతో చందర్లపాడు. కంచికచర్ల మండలాల మధ్య వారధి ఏర్పడటంతోపాటు, రహదారి మార్గం దగ్గరవుతుంది. 810 మీటర్ల పొడవైన ఈ హైలెవెల్ కాజ్ వే మధ్యలో నీరు పారేటందుకు వీలుగా 120 ఖానాలు ఏర్పాటుచేసెదరు. ఏటూరు, మోగులూరులవైపు దీనికి అనుబంధంగా రహదారులు నిర్మించవలసి యున్నది. ఏటూరు వద్ద, మునేరు నది, ఒక కి.మీ. దూరంలో ఉన్న కృష్ణానదిలో కలుస్తుంది. నదికి తక్కువ దూరంలోనే కాజ్ వే ప్రతిపాదిత ప్రాంతం ఉండటంతో, ఈ మేరకు సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారం కాగలదు. ఈ రెండు మండలాలలో 50,000 జనాభాకు దీనివలన ప్రయోజనం కలుగుతుంది. చందర్లపాడు మండలంలోని ఏటూరు, చింతలపాదు, తోటరావులపాడు, విపరితలపాడు, పోపూరు, వెలది కొత్తపాలెం, చందర్లపాడు గ్రామాలకు మరియూ కంచికచర్ల మండలంలోని మోగులూరు, ఎస్-అమరవరం, వేములపల్లి, మున్నలూరు, కునికినపాడు, చెవిటికల్లు గ్రామాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ఈ గ్రామాల రైతులకు మునేరుకు ఇరువైపులా పొలాలున్నవి. దీనితో మునేరులో నుండి పొలాలకు వెళ్ళాలన్నా, ఎరువులు, ఇతరత్రా సామాగ్రి తీసికొని వెళ్ళాలన్నా, పండిన పంటను ఇంటికి చేర్చుకోవాలన్నా, ఇన్నేళ్ళుగా తీవ్ర ఇబ్బందులు పడుచున్నారు. వర్షాకాలంలో నెలలపాటు నది అవతలి గట్టుకు చేరటం సాధ్యంకాని పని. వారధి నిర్మించడం ద్వారా ప్రత్తి, వరి, సుబాబుల్, మిరప, పొగాకు పంటలను రైతులు నేరుగా ఇళ్ళకు చేర్చుకోవడానికి, విజయవాడ, కంచికచర్ల ప్రాంతాలలోని మార్కెట్లకు తరలించి విక్రయించుకొనడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాజ్ వే నిర్మాణంతో ఈ రెండు మండలాల మధ్య 28 కి.మీ. దూరం తగ్గుతుంది. ఈ రెండు మండలాలలో మునేరు ఆధారంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలౌ సాగునీటి సమస్య ఉండదు. కాగ్ వే ప్రతిపాదిత స్థలంలో నీరి ఆగి ప్రవహించడంతో, భూగర్భ జలాలు పెరుగుతవి. దీనితో ఎత్తిపోతలకు భూగర్భ జలాల సమస్య తగ్గి, ఆయకట్టు భూములకు సాగునీటితోపాటు, త్రాగునీటి పథకాలకు ఇబ్బందులు ఉండవు. [2]
చందర్లపాడు మండలంలోని ద్వారకానగర్ లో, పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో, విజయనగరరాజుల కాలంనాటి ఒక పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ శిథిలాలు బయల్పడినవి. కృస్ణానది ఒడ్డున ఒక కొండమీద బయల్పడిన ఈ ఆలయానికి అవతల ఒడ్డున నవ్యాంధ్ర రాజధాని అయిన తుళ్ళూరు గ్రామం ఉంది. [3]చందర్లపాడు మండలంలోని మిగిలిన 650 మంది లబ్దిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందజేసి, మండలాన్ని పొగరహిత మండలంగా తీర్చిదిద్దినామని, 2017,జూన్-1న ప్రకటించినారు. [6]
గ్రామాలు[మార్చు]
- బొబ్బెల్లపాడు
- బ్రహ్మబొట్లపాలెం
- చందర్లపాడు
- చింతలపాడు
- ఏటూరు
- గుడిమెట్ల
- గుడిమెట్టపాలెం
- గుత్తావారిపాలెం (చందర్లపాడు)
- కసరబడ
- కత్రేనిపల్లి (కాట్రేనిపల్లి)
- కొడవటికల్లు
- కొనయపాలెం
- మేడిపాలెం
- మనుగాలపల్లి
- ముప్పాళ
- పాటెంపాడు
- పాత బెల్లంకొండవారిపాలెం
- పొక్కునూరు
- పోపూరు
- పున్నవల్లి
- తోటరవులపాడు
- తుర్లపాడు
- ఉస్తేపల్లి
- లక్ష్మీపురం (చందర్లపాడు)
- వెలది కొత్తపాలెం
- విభరీతపాడు
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక :[4]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | బొబ్బెల్లపాడు | 315 | 1,261 | 623 | 638 |
2. | బ్రహ్మబొట్లపాలెం | 96 | 432 | 230 | 202 |
3. | చందర్లపాడు | 2,375 | 10,059 | 5,092 | 4,967 |
4. | చింతలపాడు | 1,024 | 4,499 | 2,323 | 2,176 |
5. | ఏటూరు | 679 | 2,810 | 1,427 | 1,383 |
6. | గుడిమెట్ల | 841 | 3,854 | 1,982 | 1,872 |
7. | కాసరబాద | 271 | 1,135 | 559 | 576 |
8. | కొడవటికల్లు | 833 | 3,641 | 1,877 | 1,764 |
9. | కోనయిపాలెం | 1,396 | 6,082 | 3,085 | 2,997 |
10. | మునగాలపల్లి | 282 | 1,272 | 621 | 651 |
11. | ముప్పాళ | 1,428 | 5,742 | 2,886 | 2,856 |
12. | పాటెంపాడు | 99 | 399 | 209 | 190 |
13. | పొక్కునూరు | 442 | 1,949 | 989 | 960 |
14. | పోపూరు | 164 | 619 | 313 | 306 |
15. | పున్నవల్లి | 182 | 789 | 395 | 394 |
16. | తోటరావులపాడు | 728 | 3,252 | 1,647 | 1,605 |
17. | తుర్లపాడు | 991 | 4,413 | 2,281 | 2,132 |
18. | ఉస్తేపల్లి | 151 | 631 | 319 | 312 |
19. | వెలది కొత్తపాలెం | 624 | 2,688 | 1,390 | 1,298 |
20. | విభరీతపాడు | 343 | 1,358 | 731 | 627 |
వనరులు[మార్చు]
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
- ↑ "చందర్లపాడు". Retrieved 12 June 2016.
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-6; 1,2 పేజీలు. [3] ది హిందు దినపత్రిక; 2015,మార్చి-18; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మే-3; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఫిబ్రవరి-22; 2వపేజీ. [6] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,జూన్-2; 2వపేజీ.
![]() |
జగ్గయ్యపేట మండలం | నందిగామ మండలం జగ్గయ్యపేట మండలం |
నందిగామ మండలం | ![]() |
కృష్ణా నది | ![]() |
కంచికచర్ల మండలం | ||
| ||||
![]() | ||||
కృష్ణా నది | కృష్ణా నది | కృష్ణా నది |