Coordinates: 16°53′38″N 80°41′30″E / 16.893889°N 80.691667°E / 16.893889; 80.691667

రెడ్డిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెడ్డిగూడెం పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు రెడ్డిగూడెం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

రెడ్డిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రెడ్డిగూడెం is located in Andhra Pradesh
రెడ్డిగూడెం
రెడ్డిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°53′38″N 80°41′30″E / 16.893889°N 80.691667°E / 16.893889; 80.691667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ఉయ్యూరు అంజిరెడ్డి
జనాభా (2001)
 - మొత్తం 9,507
 - పురుషుల సంఖ్య 4,910
 - స్త్రీల సంఖ్య 4,597
 - గృహాల సంఖ్య 2,242
పిన్ కోడ్ 521215
ఎస్.టి.డి కోడ్ 08673

రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2619 ఇళ్లతో, 9873 జనాభాతో 1838 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5146, ఆడవారి సంఖ్య 4727. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2694 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588998. ఇది సముద్రమట్టానికి 73 మీ. ఎత్తులో ఉంది. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [1][2]

సమీప గ్రామాలు[మార్చు]

కుడప 5 కి.మీ, మాధవరం 5 కి.మీ, కునపరాజుపర్వ 5 కి.మీ, అన్నేరావుపేట 7 కి.మీ, నగులూరు 7 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రెడ్డిగూడెంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. విస్సన్నపేట, కంభంపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 45 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల విస్సన్నపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల మైలవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ విస్సన్నపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని 2016,ఫిబ్రవరి-20వ తేదీనాడు నిర్వహించారు. ఈ పాఠశాల క్రీడా మదానం అభివృద్ధి పనులను 2017,జులై-6న ప్రారంభించారు. దీనికొరకు ఉపాధిహామీ పథకంలో భాగంగా 2.05 లక్షల నిధులు సమకూర్చారు.

సి.ఎస్.ఐ. ప్రాథమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల స్థానిక ఎస్.సి.వాడలో ఉంది.

గీతాంజలి ఉన్నత పాఠశాల[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రెడ్డిగూడెంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రం పరిధిలో ఈ మండలానికి చెందిన 11 గ్రామాలున్నవి. మొత్తం 50,000 మంది జనాభాకు ఈ కేంద్రమే ఆధారం.

అంగనవాడీ కేంద్రం[మార్చు]

పశువైద్యశాల[మార్చు]

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

బ్యాంకులు[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంకు.

పాల ఉత్పత్తిదారుల కేంద్రం[మార్చు]

కొత్తరెడ్డిగూడెంలోని ఈ కేంద్రం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో పాల ఉత్పత్తిలో జిల్లాలోనే ద్వితీయ ఉత్తమ కేంద్రంగా పురస్కారం అందుకున్నది.

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,జనవరి-22వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 4.9 లక్షల రూపాయాలు కేటాయించారు. 15,900 ఘనపుమీటర్ల పూడిక మట్టిని చెరువునుండి తీయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 6 రోజులనుండి, గ్రామ రైతులు ఈ పూడికమట్టిని తమ పొలాలకు ట్రాక్టర్లద్వారా తరలించుచున్నారు. కొంతమంది రైతులు ఈ మట్టిని గ్రామంలో మెరక చేసుకొనడానికి గూడా తరలించుచున్నారు. ఈ పూడికమట్టితో చెరువు కట్టను గూడా అభివృద్ధిచేస్తున్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • వెంపటిగూడెం గ్రామం, రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉయ్యూరు అంజిరెడ్డి సర్పంచిగా 820 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. ఉప సర్పంచిగా చాట్ల చందా ఎన్నికైనాడు.[3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రాజగోపాలస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయo[మార్చు]

స్థానిక పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో, ఒక కోటి రూపాయల భక్తులు, గ్రామస్థుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠా యఙకార్యక్రమాలు, 2014,జూన్-18 నుండి 22 వరకు నిర్వహించారు. ఈ ఆలయంలో శ్రీ విజయగణపతి, శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. 22వ తేదీ ఉదయం 6 గంటల నుండి, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, గ్రామంలో బొడ్డురాయి ప్రతిష్ఠ, తరువాత 7-55 గంటలకు యంత్రస్థాపన, విగ్రహప్రతిష్ఠ, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠలు నిర్వహించారు. పలుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి, ఉత్సవంలో పాల్గొని, పూజలు చేసారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి శ్రీ సీతారాముల కల్యాణం జరిపించి, 16రోజులైన సందర్భంగా, 2014, జూలై-7, సోమవారం నాడు, మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించారు.

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015.జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. గోవుకూ, వృషభానికీ కళ్యాణం చేసారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

స్థానిక పంచాయతీలోని ఒకటవ వార్డులో ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2014,డిసెంబరు-12వతేదీ, శుక్రవారం నాడు, శంకుస్థాపన నిర్వహించారు.

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,జూన్-7వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ప్రభబండి ఊరేగించారు. మహిళలు బిందెలతో నీళ్ళు వారపోసి, అమ్మవారికి పూజలు చేసారు. ఊరేగింపు మహోత్సవంలో యువకులు పెద్దసంఖ్యలో గులాములు జల్లుకుంటూ ఉత్సాహాంగా పాల్గొన్నారు. 8వ తేదీ సోమవారంతో, ఈ ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నవి. సోమవారం రాత్రి అమ్మవారిని గ్రామ ప్రధాన వీధులలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. [10] గ్రామంలోని కాపుల బజారులో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-13వతేదీ సోమవారం నుండి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించారు. సోమవారం ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అఖండ దీపారాధన, వాస్తు మండపారాధన మొదలగు పూజలు నిర్వహించారు. మంగళవారంనాడు గ్రామోత్సవం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఉదయం, అంకమ్మ తల్లి, పోతురాజు, నాగరాజు ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను పురస్కరించుకొని, ఆలయంలో ఈ మూడురోజులూ ప్రత్యేక పూజలూ, హోమాలనూ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలసంఖ్యలో విచ్చేసి, అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2017,మార్చి-2వతేదీ గురువారంనాడు, ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామస్థుల,దాతల సహకారంతో నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-1వతేదీ శుక్రవారం ఉదయం 10-12 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

ఈ ఆలయం పునర్నిర్మాణంచేసి, 16 రోజులైన సందర్భంగా, 2015,మే నెల-16వ తేదీ, శనివారంనాడు, ఆలయంలో 16 రోజులపండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పండ్లు, తమలపాకులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకున్నారు.

చిన్న ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ అలయంలో 2016,జనవరి-1వ తేదీనాడు, స్వామివారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు ఆలయంలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించారు.

భూమి వినియోగం[మార్చు]

రెడ్డిగూడెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 317 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 263 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 57 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 27 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 37 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 190 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 67 హెక్టార్లు
  • బంజరు భూమి: 50 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 826 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 389 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 555 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రెడ్డిగూడెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 355 హెక్టార్లు
  • చెరువులు: 200 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రెడ్డిగూడెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు,మామిడి, ప్రత్తి

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

వనరులు[మార్చు]

  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఈనాడు కృష్ణా; జులై,25-2013; 8వ పేజీ.

వెలుపలి లింకులు[మార్చు]