Coordinates: 16°14′10″N 80°03′14″E / 16.23611°N 80.05389°E / 16.23611; 80.05389

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇస్కాన్ టెంపుల్
ఇస్కాన్ టెంపుల్ is located in Andhra Pradesh
ఇస్కాన్ టెంపుల్
ఇస్కాన్ టెంపుల్
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°14′10″N 80°03′14″E / 16.23611°N 80.05389°E / 16.23611; 80.05389
పేరు
ప్రధాన పేరు :నరసరావుపేట ఇస్కాన్ దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పల్నాడు జిల్లా
ప్రదేశం:నరసరావుపేట
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కృష్ణుడు
ప్రధాన దేవత:రాధ
ఇతిహాసం
నిర్మాణ తేదీ:2012 మార్చి 25
సృష్టికర్త:ఇస్కాన్
వెబ్ సైట్:అధికార వెబ్‌సైట్

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, నరసరావుపేట పట్టణంలోని స్థానిక బరంపేటలో నెలకొనిఉంది.ఈ ఆలయంలోని ప్రధాన దైవం కృష్ణుడు,ప్రధాన దేవత రాధ.

చైతన్య మహాప్రభు పాదాల తాకిన నరసరావుపేట పుడమి[మార్చు]

కృష్ణుడి భక్తావతారమైన చైతన్య మహాప్రభు అతని హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా భారతదేశం అంతటా పర్యటించాడు.మొదటగా హరే కృష్ణ మంత్రం యొక్క ప్రచారం బెంగాల్ నుండి ప్రారంభించి, ఒరిస్సాలోని పూరీ వరకు కొనసాగించాడు.ఆ తరువాత దక్షిణ భారతదేశం పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మక్షేత్రం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ వాసుదేవదత్త అనే బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో కలిగి ఉండటాన్ని గమనించి అతని కుష్టు వ్యాధిని తొలగించి విముక్తి చేసాడు.వాసుదేవదత్తను కృష్ణ చైతన్యంలో గృహస్థ జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేశాడు.ఆ తరువాత యాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లేందుకు చేసిన పర్యటనలో చైతన్య మహాప్రభు తన ప్రయాణంలో నాటి అట్లూరు గ్రామం అయిన నేటి నరసరావుపేట మీదుగా వెళ్ళాడు.నరసరావుపేట భూమిపై చైతన్య మహాప్రభు పాదాలను తాకడం వలన, అతని సందర్శన నుండి హరినామ స్మరణ ప్రేరణ పొంది అప్పటి నుండి 'హరినామసంకీర్తన' నరసరావుపేట ఆలయాలలో నిరంతరం జపించబడుతోంది.[1]

ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటుకు చారిత్రిక నేపథ్యం[మార్చు]

ఇది పల్నాడు జిల్లాలో తొలిగా నిర్మించబడిన ఇస్కాన్ టెంపుల్.ఈ ఆలయం నిర్మాణం వెనుక చారిత్రక నేపథ్యం ఉందని తెలుస్తుంది.ఆలయ నిర్మాణం వెనుక ఒక దంపతుల దాతృత్వం కూడా ఉంది.బరంపేటకు చెందిన విశ్రాంత తహశీలుదారు కత్తుల రాజసింహుడు, సరోజినీదేవి దంపతులు కృష్ణ భక్తులు.2019 నాటికి 40 సంవత్సరంల క్రిందట రాజసింహుడు, సరోజినీదేవి దంపతుల సొంతానికి చెందిన య.1.38 శెంట్ల భూమిలో శ్రీకృష్ణ, బలరాములకు “శ్రీ రాధా కృష్ణ వాసుకీ క్షేత్రం” అనే పేరుతో చిన్న మందిరం నిర్మించి ఆరాధించేవారు.కాలక్రమేణా వార్కి వయసు పైబడటంతో శ్రీ కృష్ణునికి సేవలు నిర్వహించలేమని భావించి, సేవలు నిరంతరం కొనసాగాలన్న ఆకాంక్షతో ఇస్కాన్ సంస్థను ఆశ్రయించి, స్థలంతో సహా మందిరాన్ని వార్కి అప్పగించారు.అదే ప్రాంగణంలో వాసుకీ క్షేత్రం ఉండటం, రాధాకృష్ణ తోట ఉండటం వలన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటుకు అంగీకరించింది.[2]

ఆలయ నిర్మాణం ప్రారంభం[మార్చు]

టెంపుల్ ప్రధాన ద్వారం.

2000 సంవత్సరంలో ఇస్కాన్ ఈ ప్రదేశంలో అందమైన ఆలయాన్ని నిర్మించే ప్రాజెక్టు ప్రారంభించింది. 2012 మార్చి 25 నాటికి ఆలయం అన్ని హంగులతో పూర్తిచేయబడి,ప్రతిష్ట సందర్బంగా ఇస్కాన్ అధ్యక్షుడు జయపతాక స్వామి గురు మహారాజ్ తాను స్యయంగా సేవించిన సాల గ్రామాన్ని మందిరానికి సమర్పించుటతో ఆలయాన్ని ప్రారంభించుట జరిగింది.[3]

ఆలయ ప్రత్యేకతలు[మార్చు]

ఈ ప్రదేశం గోలోకంతో సమానం. ఎందుకంటే కృష్ణుడు రాధా రాణితో పాటు ఇక్కడ ఉన్నాడు. సాలగ్రామ రూపంలో శ్రీ యోగ నరసింహస్వామి బంధిత ఆత్మలపై దయ చూపిస్తున్నాడు.ఇక్కడ భగవంతుడి పేరు శ్రీ రాధగోవింద చంద్ర, బలరామ, పరమ గురువు అనంత దేవ్ కూడా ఇక్కడ వాసుకి గోసాల గోవర్ధనగిరి రూపంలో ఉంది.శ్రీ రాధాగోవిందు సంతృప్తి కోసం బృందావన తోట ఇక్కడ ఉంది. పడవ పండుగలు (తెప్పోత్సవం) ద్వారా భగవంతునికి సేవ చేయడానికి 1008 పవిత్రమైన తీర్థాలతో కూడిన అందమైన పుష్కరిణి ఉంది.ఇక్కడ దేవతలు కిషోరభావాల్తో ఉంటాయి.కాబట్టి దేవతల సాలగ్రామాలు యవ్వనంగా అందమైనవిగా కనిపిస్తాయి.యువతను ముఖ్యంగా పిల్లలను చాలా ఆకర్షిస్తాయి.సందర్శకులు ఆలయ కార్యక్రమాలలో పాల్గొనడానికి వసతి కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.[3]

ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద ఆశయాలు[మార్చు]

ఇస్కాన్ సంస్థ ప్రధాన ఆశయం మానవాళికి కర్తవ్యం భోధించి, ప్రతి వ్యక్తిని కార్యోన్ముఖుడిని చేసేందుకు ఆవిర్బంచిందే కృష్ణచైతన్య తత్వం.[4]

  1. సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతిలో ప్రచారం చేయడం, జీవితంలో విలువల యొక్క అసమతుల్యతను రూపుమాపటానికి, ప్రపంచంలో నిజమైన ఐక్యత, శాంతిని సాధించడానికి ఆధ్యాత్మిక జీవిత పద్ధతులలో ప్రజలందరికీ అవగాహన కల్పించడం.
  2. కృష్ణుడి (భగవంతుని) యొక్క చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఇది భారతదేశంలోని గొప్ప గ్రంథాలలో, ముఖ్యంగా భగవద్గీత, శ్రీమద్-భాగవతంలో వెల్లడైంది. ఆత్మ యొక్క ప్రసార సూత్రాన్ని అంగీకరించటం ప్రధాన ఉద్దేశం (పునర్జన్మ).
  3. సొసైటీ సభ్యులను ఒకరితో ఒకరు కలిసి, ప్రధాన సంస్థ అయిన కృష్ణుడికి దగ్గరగా తీసుకురావడం, తద్వారా సభ్యులలో ఆలోచనను అభివృద్ధి చేయడం, మానవత్వం పెంపొందించటం, ప్రతి ఆత్మ భగవంతుని నాణ్యత (కృష్ణ) యొక్క భాగం అని తెలియచెప్పటం.
  4. చైతన్య మహప్రభు బోధలలో వెల్లడైనట్లుగా, సంకీర్తన ఉద్యమాన్ని బోధించడం, ప్రోత్సహించడం, కృష్ణ దేవుని పవిత్ర నామాన్ని సమ్మేళనం చేయడం.
  5. కృష్ణుడి వ్యక్తిత్వానికి అంకితమైన అతిలోక కాలక్షేపాల యొక్క పవిత్ర స్థలంలో సభ్యులకు, సమాజానికి పెద్ద ఎత్తున నిలబడటం.
  6. సరళమైన, సహజమైన జీవన విధానాన్ని బోధించే ఉద్దేశ్యంతో సభ్యులను దగ్గరకు తీసుకురావడం.
  7. పైన పేర్కొన్న ప్రయోజనాలను సాధించే దిశగా, పత్రికలు, పుస్తకాలు, ఇతర రచనలను ప్రచురించడం, పంపిణీ చేయడం, ఈ ప్రయోజనాలను గ్రహించడంలో సహాయపడే వెబ్‌సైట్‌లను సృష్టించడం.

టెంపుల్ రోజువారీ  కార్యక్రమాలు[మార్చు]

  • మంగళ హారతి: 4.30 ఉదయం
  • కీర్తనలు,భజనలు: ఉదయం 5.30 నుండి ఉదయం 7.30 వరకు
  • దర్శనం,హారతి: ఉదయం 7.30
  • గురుపూజ: ఉదయం 7.45

ఫొటో గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ISKCON NARASAROPET". Archived from the original on 2019-09-21.
  2. https://web.archive.org/web/20190914172943/https://betagallery.eenadu.net/article_img/GNR22DCS_1.pdf
  3. 3.0 3.1 "Iskcon Temple, Narasaraopet". Archived from the original on 2019-09-21.
  4. "International Society for Krishna Consciousness". Archived from the original on 2018-11-08.

ఇవి కూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.