నాగబాల సురేష్ కుమార్ (దండనాయకుల సురేష్ కుమార్) ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు. తను రూపొందించిన సీరియల్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.[1]
సురేష్ కుమార్ నాన్న శ్రీనివాసరావు సంగీతకారుడు, తాత రామారావు రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
1971లోనే రంగస్థలంలోకి అడుగుపెట్టారు. 1976లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఎమ్మార్వో స్థాయి వరకు పనిచేశారు. చిన్నప్పటి నుంచి కళలపట్ల ఆసక్తి ఉండడంతో కళల కోసం ఉద్యోగం మానేశారు. నాటకాలు, సీరియల్స్ చేస్తున్న క్రమంలో తనకూ ఓ బ్యానర్ ఉండాలని 1992లో తేజ ఆర్ట్స్ను స్థాపించి, 'బాలచంద్రుడు' అనే నాటికలో ఏకపాత్రాభినయం కూడా చేశారు.[1]
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్క్రియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్, టి.వి. రచయితల సంఘం స్థాపించారు. విశ్వా కమ్యూనికేషన్ అనే పేరుతో మార్కెటింగ్ ఏజెన్సీని కూడా నడిపిస్తున్నారు.
1995లో మొదటి సీరియల్ శ్రీ ఆదిపరాశక్తి తీశారు. ఇది దక్షిణ భారతంలోనే మొదటి పౌరాణిక సీరియల్ గా గుర్తింపు పొందింది. నటి సనా ఆదిపరాశక్తిగా టీవీ రంగానికి పరిచయమయింది. ఆ సీరియల్ 8 భాషల్లో అనువాదమైంది. ఆ తర్వాత ఫారెస్ట్ అడ్వంచర్గా శభాష్ బేబీ, స్వాతిచినుకులు, స్వతంత్ర సంగ్రామం లాంటి సీరియల్స్ చేశారు.[1]
నాగబాల
శ్రీ ఆదిపరాశక్తి
అపరాధి
విజయసామ్రాట్
వీరభీమ్
అభయ
శభాష్ బేబి
సౌందర్యరేఖ
ఆత్మయాత్ర
సంగ్రామం
స్వాతిచినుకులు
నాకిష్టం ఎందుకంటే
శాస్త్రం శస్త్రం
మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ వైట్
విశ్వసాయి
తెలంగాణ త్యాగధనులు
చాకలి ఐలమ్మ
వంటి 21 సీరియల్స్ పురాణ గాథలు, సృష్టి సీరియళ్ల రచన. 716 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం.
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు లో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకు.
1995లో 'ఆది పరాశక్తి' అనే సీరియల్లో సనాకి ఓ పాత్ర ఇచ్చారు. మధుమణి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈయన అవకాశాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సీరియల్ డైరెక్టర్లుగా, కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్గా తయారయ్యారు. మరి కొందరు సినిమాల్లో కూడా చేస్తున్నారు.
'నాగబాల' భారతదేశంలో మొదటి సారి పాము మీద వచ్చిన సీరియల్. 'ఆదిపరాశక్తి' మైథాలాజికల్ సీరియల్. 'ఆత్మయాత్ర'... క్లోనింగ్ మీద వచ్చింది. జపాన్లో క్లోనింగ్ ద్వారా గొర్రెను సృష్టించారు. అయితే భవిష్యత్లో మనిషిని కూడా క్లోనింగ్ చేస్తారనుకొని ఆత్మయాత్ర తీశారు.