ప్రజా రాజ్యం పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజా రాజ్యం పార్టీ
వ్యవస్థాపనచిరంజీవి
స్థాపన2008
రద్దు2011
విలీనంభారత జాతీయ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ,
సిద్ధాంతంసామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన
వెబ్ సిటు
http://www.prajarajyam.org
ప్రజారాజ్యం పార్టీ‎ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ‎ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి

తెలుగు సినిమా నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.[1]. ప్రజా రాజ్యం లో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యింది[2]

స్థాపన[మార్చు]

2008 ఆగస్టు 26 తేదిన తిరుపతిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలో చిరంజీవి పార్టీని అధికారికంగా ప్రారంభించాడు. సుమారు పది లక్షల మంది హాజరైన ఈ సభలో చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించాడు. పార్టీ పతాకంలో సుమారు మూడు వంతులు తెల్లని భాగం, దాని కింద ఒక భాగం పచ్చరంగు, మధ్యలో ఎర్రటి రంగులో సూర్యుడు, గుండ్రని భాగం చుట్టూ పసుపు బోర్డరు ఉన్నాయి.

విలీనం[మార్చు]

2011 ఫిబ్రవరి 6 వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి రక్షణ శాఖా మంత్రి ఎ. కె. ఆంటోనీ ఈ విలీన ప్రతిపాదన తెచ్చాడు.[3]

ప్రజారాజ్యంలో పని చేసిన నాయకులూ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chiranjeevi launches 'Praja Rajyam'". Press Trust of India. Chennai, India: The Hindu. 2008-08-26. Archived from the original on 2011-06-29. Retrieved 2008-08-26.
  2. "Praja Rajyam Party merges with Congress". Chennai, India: The Hindu. 2011-02-06. Retrieved 2011-02-26.
  3. "Praja Rajyam merges with Congress". The Hindu. Chennai, India. 2011-02-07. Archived from the original on 2013-01-25. Retrieved 2020-12-28.

బయటి లింకులు[మార్చు]