రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
== కథ == |
== కథ == |
||
[[నందిగామ]]లోని ఒక పాత రాజమహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజమందిరాన్ని గవర్నమెంట్ మూసేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేసి ఆ రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7మందిని సెలక్ట్ చేస్తారు. |
|||
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.. |
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.. |
19:57, 8 నవంబరు 2019 నాటి కూర్పు
రాజు గారి గది | |
---|---|
దర్శకత్వం | ఓంకార్ |
తారాగణం | అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, పోసాని కృష్ణ మురళి, ధన్రాజ్, రాజీవ్ కనకాల, విద్యుల్లేఖ రామన్ |
ఛాయాగ్రహణం | జ్ఞానం |
కూర్పు | నాగరాజు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థలు | వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 2015 అక్టోబరు 16 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹3 crore (US$3,80,000) |
రాజు గారి గది 2015, అక్టోబరు 16న భయానకమైన తెలుగు హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా రాజు గారి గది 2, రాజు గారి గది 3 సినిమాలు వచ్చాయి.
కథ
నందిగామలోని ఒక పాత రాజమహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజమందిరాన్ని గవర్నమెంట్ మూసేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేసి ఆ రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7మందిని సెలక్ట్ చేస్తారు.
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
నటవర్గం
- అశ్విన్ బాబు (అశ్విన్)
- చేతన్ చీను (డా. నందన్/నందు)
- ధన్య బాలకృష్ణ (బాల త్రిపుర సుందరి/బాల)
- ధన్రాజ్ (శివుడు)
- రాజీవ్ కనకాల (డా. కార్తీక్)
- పోసాని కృష్ణ మురళి (బొమ్మాళి రాజా)
- సప్తగిరి ("రేసుగుర్రం" బాబ్జీ)
- షకలక శంకర్ (ఎం.పై. దానం)
- పూర్ణ (బొమ్మాళి)
- విద్యుల్లేఖ రామన్ (బుజ్జమ్మ)
- ఈశాన్య మహేశ్వరి (బార్జీ)
- రఘుబాబు (చెకోడి)
- ప్రభాస్ శ్రీను (పకోడి)
- జీవా
సాంకేతికవర్గం
- దర్శకత్వం: ఓంకార్
- సంగీతం: సాయి కార్తీక్
- ఛాయాగ్రహణం: జ్ఞానం
- కూర్పు: నాగరాజు
- నిర్మాణ సంస్థ: వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్
పాటలు
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1][2]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "లా లాల లాలల" (వాయిద్యం) | 2:33 | |||||||
2. | "సోనే మోరియా" | 2:58 | |||||||
3. | "చూ మంత్రకాళి" | 3:10 | |||||||
8:41 |
ఇతర వివరాలు
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా[3] వారు దీనికి సీక్వెల్ ను తీసి రాజు గారి గది 2 చిత్రాన్ని తీశారు. ఓంకార్[4] దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సమంత, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్[5] ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలైంది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. రాజు గారి గది 3 అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న విడుదలైంది.
మూలాలు
- ↑ "Raju Gari Gadhi (2015)". Music India Online.
- ↑ "Raju Gari Gadhi (2015) Songs Lyrics In Telugu". ANI LYRICS.
- ↑ "P.V.P. Cinema Signed Two High Budget Movies". Telugu Filmnagar. 1 November 2016.
- ↑ "Omkar to direct Nagarjuna?". Telugu Filmnagar. 10 October 2016.
- ↑ "Seerat Kapoor For Nagarjuna Raju Gari Gadhi 2". Telugu Filmnagar. 28 November 2016.