బలరామ్ జాఖర్

వికీపీడియా నుండి
(బలరామ్ జక్కర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బలరామ్ జాఖర్
బలరామ్ జాఖర్


పదవీ కాలం
22 జనవరి 1980 – 27 నవంబరు 1989
డిప్యూటీ జి.లక్ష్మణన్
ఎం.తంబి దురాయ్
ముందు కె.ఎస్.హెగ్డే
తరువాత రబీ రాయ్

పదవీ కాలం
30 జూన్ 2004 – 29 జూన్ 2009
ముందు లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.సేఠ్ (Acting)
తరువాత రామేశ్వర ఠాకూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1923-08-23)1923 ఆగస్టు 23
పంజ్‌కోసి, అబోహర్, పంజాబ్
మరణం 2016 ఫిబ్రవరి 3(2016-02-03) (వయసు 92)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు

బలరామ్ జాఖర్ (1923 ఆగష్టు 23 – 2016 ఫిబ్రవరి 3) భారతదేశ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ గవర్నర్ గా తన సేవలనందించారు.

బాల్య జీవితం-విద్య[మార్చు]

బలరామ్ జాఖర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో ఆగష్టు 23 1923 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్, చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీకు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ లోని ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.

రాజకీయ జీవితం[మార్చు]

కామన్వెల్త్ సదస్సులో పండిట్ రామ్ కిషోర్ శుక్లా, క్వీన్ ఎలిజబెత్‌తో స్పీకర్ జక్కర్.

ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు.

ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్, సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియాన్ని కూడా స్థాపించారు. ఆయన కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన 2004 జూన్ 30 నుండి 2009 మే 30 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

ఆయన భారత కృషక్ సమాజ్ కు జీవితకాల అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జలియన్‌వాలా మెమోరియల్ ట్రస్టు మేనేజిమెంటు కమిటీకు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన "పీపుల్, పార్లమెంటు, అడ్మినిస్ట్రేషన్" అనే పుస్తకాన్ని రచించారు. ఆయన వ్యవసాయోత్పత్తి పెంచుటకు శాస్త్రీయ విధానాలను పరిచయం చేసారు. భారత రాష్ట్రపతి ఆయనను "ఉద్యాన్ పండిట్" అవార్డును 1975 లో ఆయన హార్టీకల్చర్ కు చేసిన సేవలకు గానూ యిచ్చారు. హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం,హిసార్, గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం, హరిద్వార్ లు ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్, "విద్యా మార్తాండ" అనే గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయి.

లోక్‌సభ
అంతకు ముందువారు
Mohinder Singh Sayanwala
Member of Parliament
for Ferozepur

1980–1984
తరువాత వారు
Gurdial Singh Dhillon
అంతకు ముందువారు
Kumbharam Arya
Member of Parliament
for Sikar

1984–1989
తరువాత వారు
Devi Lal
అంతకు ముందువారు
Devi Lal
Member of Parliament
for Sikar

1991–1996
తరువాత వారు
Dr. Hari Singh
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
K. S. Hegde
Speaker of the Lok Sabha
22 January 1980 – 18 December 1989
తరువాత వారు
Rabi Ray
అంతకు ముందువారు
Kailashpati Mishra
Governor of Gujarat (Acting)
July 2004 – July 2004
తరువాత వారు
Nawal Kishore Sharma
అంతకు ముందువారు
Lt. Gen. K. M. Seth (Acting)
Governor of Madhya Pradesh
30 June 2004 – 29 June 2009
తరువాత వారు
Rameshwar Thakur

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]