మోత్కూర్ గ్రంథాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోత్కూర్ గ్రంథాలయం
మోత్కూర్ గ్రంథాలయ భవనం
దేశముభారతదేశం
తరహాశాఖా గ్రంథాలయం
స్థాపితము1986
ప్రదేశముమోత్కూర్, యాదాద్రి భువనగిరి జిల్లా
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు, చేవ్రాతలు
గ్రంధాల సంఖ్య~ 25,000 పుస్తకాలు/పత్రికలు
చట్టపరమైన జమఔను
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుఎవరైనా రావచ్చును

మోత్కూర్ గ్రంథాలయం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ పట్టణకేంద్రంలోని గ్రంథాలయం.[1] గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు, సాహితీవేత్తల, జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ, పుస్తకాల సేకరణలో భాగంగా ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి వేల పుస్తకాలు సేకరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రంథాలయం గుర్తింపు పొందింది.[2]

చరిత్ర[మార్చు]

గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకం

మోత్కూరు గ్రంథాలయం 1986లో ప్రారంభమైంది. 1988 మే 1న అప్పటి రాష్ట్ర హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఈ గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎంపీ డా. బద్దం నరసింహారెడ్డి, రామన్నపేట ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నీలం సహానీ, సర్పంచ్ డా. జి. లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ గ్రంథాలయంలో ఆదనపు గది నిర్మాణానికి రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ నుంచి 10 లక్షల రూపాయలు మంజూరుకాగా 2023 మే 14న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ శంకుస్థాపన చేశాడు.[3][4]

ఇందులో చైతన్య స్ఫూర్తిని రగిలించే అనేక పుస్తకాలు ఉన్నాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

గ్రంథాలయ కమిటీ[మార్చు]

2014, నవంబరు 14న గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేయబడి, ప్రస్తుతం ఇదే కమిటీ కొనసాగుతోంది.

  • చైర్మన్: కోమటి మత్స్యగిరి
  • వైస్ చైర్మన్: పోల్నేని స్వామి రాయుడు
  • ప్రధాన కార్యదర్శి: కప్పే యాకేశ్
  • కోశాధికారి: అన్నందాసు రామలింగం
  • ప్రచార కార్యదర్శి: కూరేళ్ళ రవి
  • డైరెక్టర్స్: నిలిగొండ కృష్ణ, బొల్లెపల్లి వీరేశ్, అవిశెట్టి సోమయ్య, దేవరపల్లి నర్సిరెడ్డి, దొంతోజు శ్రీనివాస్, గూడ అంజయ్య, బోడ సంధ్య

పుస్తకాల సేకరణ[మార్చు]

2020, సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ నారాయణరావు జయంతి) సందర్భంగా 10,000 పుస్తకాల సేకరణ లక్ష్యంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాల సేకరణ కార్యక్రమం మొదలయింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో అనేకమంది దాతలు ముందుకు వచ్చి మోత్కూర్ గ్రంథాలయానికి పుస్తకాలు, ర్యాక్స్, కుర్చీలు, కంప్యూటర్ బహుకరించడం జరిగింది.[5]

ఇంటికో పుస్తకం - గ్రంథాలయ భాగస్వామ్యం[మార్చు]

ప్రతి ఒక్కరికీ పుస్తకంతో, గ్రంథాలయంతో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో 2020, ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని దళితవాడ నుంచి ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి వేల పుస్తకాలు సేకరించి, గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతున్నారు.[6]

కార్యక్రమాలు[మార్చు]

  1. ప్రతి ఏటా నవంబరు 1న వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి సందర్భంగా గ్రంథాలయం ఆధ్వర్యంలో మోత్కూర్ పాత బస్టాండ్ గాంధీ విగ్రహం నుండి గ్రంథాలయం వరకు పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. హైదరాబాద్‌, భువనగిరి, ఆలేరు, రామన్నపేట, నల్లగొండ ప్రాంతాల కవులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతారు.
  2. జాతీయ రాష్ట్రస్థాయి సాహితీవేత్తలు, ఉద్యమ నేతల జయంతులను, వర్ధంతులు జరుపబడుతున్నాయి.
  3. తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ భాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా భాషా పరిరక్షణకు సంబంధించి అవగాహన సదస్సులు కూడా నిర్వహించబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "మోత్కూరు గ్రంథాలయానికి 50 పుస్తకాల అందజేత". ETV Bharat News. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (18 November 2020). "గ్రంథాలయ వారోత్సవాలకు కొవిడ్‌". andhrajyothy. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  3. ABN (2023-05-15). "గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు : ఎమ్మెల్యే కిషోర్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-14. Retrieved 2023-05-15.
  4. "గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు". Sakshi. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
  5. "మోత్కూరు గ్రంథాలయానికి 260 పుస్తకాల బహూకరణ!". ETV Bharat News. Archived from the original on 7 November 2021. Retrieved 7 November 2021.
  6. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (16 October 2021). "ఉండమ్మా పుస్తకమిస్తా!". Namasthe Telangana. Archived from the original on 17 October 2021. Retrieved 7 November 2021.