Coordinates: 16°34′08″N 81°05′01″E / 16.568979°N 81.083710°E / 16.568979; 81.083710

లక్ష్మీనరసింహాపురం (నందివాడ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్మీనరసింహాపురం, కృష్ణా జిల్లా నందివాడ మండలానికి చెందిన గ్రామం.

లక్ష్మీనరసింహాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
లక్ష్మీనరసింహాపురం is located in Andhra Pradesh
లక్ష్మీనరసింహాపురం
లక్ష్మీనరసింహాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°34′08″N 81°05′01″E / 16.568979°N 81.083710°E / 16.568979; 81.083710
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందివాడ
ప్రభుత్వం
 - సర్పంచి ఎరికిపాటి రత్నప్రసాదు
పిన్ కోడ్ 521 321
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, పెదపారుపూడి, ఉంగుటూరు, బాపులపాడు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 43 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

విజయవాడలోని పటమటలంకలోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాలలో ఇటీవల జిల్లాస్థాయి సదరన్ ఇండియన్ సైన్స్ డ్రామా ఫెస్టివల్-2015 పోటీలను నిర్వహించారు. ఈ పోటెలలో ఈ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన, "పాపం పంటచేలు" అను నాటిక ప్రథమస్థానం దక్కించుకున్నది. అక్టోబరు మొదటివారంలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు వీరు అర్హత సంపాదించుకున్నారు. [2]

ఈ పాఠశాల ఆవరణలో, 2016,అక్టోబరు-6వతేదీ గురువారంనాడు చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని దాతలు శ్రీ కూన సత్యనారాయణ, శ్రీమతి జయశ్రీ దంపతులు, తవిటయ్య, సరస్వతి దంపతుల ఙాపకార్ధం అందజేసినారు. [3]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం ఇలపర్రు గ్రామానికి శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ పురాతన ఆలయం, చిన్నదిగా ఉండి, శిథిలావస్థకు చేరడంతో, భక్తులే పూనుని, నూతన ఆలయం నిర్మించారు. ఈ నూతన ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ సందర్భంగా 2015,జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. పెద్ద యెత్తున శాంతిహోమం నిర్వహించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, సిద్ధమూర్తి వారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భక్తి భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నది. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ఈ గ్రామంనుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారలను దర్శించుకొని, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-13; 29వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-27; 7వపేజీ.[3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,అక్టోబరు-7; 1వపేజీ.