Coordinates: 16°38′11″N 80°57′58″E / 16.636389°N 80.966111°E / 16.636389; 80.966111

బాపులపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాపులపాడు
—  రెవిన్యూ గ్రామం  —
బాపులపాడు is located in Andhra Pradesh
బాపులపాడు
బాపులపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°38′11″N 80°57′58″E / 16.636389°N 80.966111°E / 16.636389; 80.966111
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కాకాని అరుణ
జనాభా (2011)
 - మొత్తం 84,922
 - పురుషులు 42,406
 - స్త్రీలు 42,516
 - గృహాల సంఖ్య 24,036
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656

బాపులపాడు, కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం. ఇది సమీప పట్టణం ఏలూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4359 ఇళ్లతో, 15223 జనాభాతో 504 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7510, ఆడవారి సంఖ్య 7713. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2263 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 124. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589079[1].పిన్ కోడ్: 521105, ఎస్.టి.డి.కోడ్ = 08656. సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

పల్లెర్లమూడి 3 కి.మీ, ఎం.ఎన్. పాలెం 5 కి.మీ, మర్రిబందం 6 కి.మీ, వేలేరు 7 కి.మీ, కానుమోలు 7 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

బాపులపాడులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. హనుమాన్ జంక్షన్, ఏలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కీ.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల వట్లూరులో ఉంది. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, పాలీటెక్నిక్‌ వట్లూరులోను, మేనేజిమెంటు కళాశాల బొమ్ములూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వట్లూరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఏలూరులోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  • ఈ పాఠశాలలో 2014, అక్టోబరు-30న, ఎన్.టి.ఆర్. ట్రస్ట్ తరపున ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధియంత్రాలను ప్రారంభించారు. ఈ యంత్రాల ఖర్చును, "శ్రవంతీ" సంస్థ అధినేతలు శ్రీ వీరమాచనేని సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులు విరాళంగా అందజేసినారు.
  • ఈ పాఠశాల వార్షికోత్సవం 2016,ఫిబ్రవరి-27న నిర్వహించారు.
  • ఈ పాఠశాల ప్రస్తుతం 3-12 హైస్కూల్ ప్లస్ వరకూ అప్గ్రేడ్ చేయబడినది.ప్రస్తుత పాఠశాల రోలు 525

2022-23 నుంచి పాఠశాల యందు ఇంటర్మీడియట్ ప్రారంభించబడింది..ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు టివి నాగేశ్వరరావు.

ప్రస్తుత టీచర్ల బదిలీలలో భాగంగా ఈ పాఠశాలకు 5 గురు PGT లు ఇంటర్మీడియట్ బోధించుటకు వచ్చి యున్నారు..

మొత్తం సిబ్బంది 22 మంది. బోధనేతర సిబ్బంది ముగ్గురు.

SBI regional office వారి సహకారంతో ఒక అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, మూడు ప్రొజెక్టర్ లు కలవు..


మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల, మహాత్మాగాంధీ నగర్.=[మార్చు]

ఈ పాఠశాల మండల తహశీల్దారు కార్యాలయానికి ఎదురుగా, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ పాఠశాలకు పక్కనే ఉంటుంది..

ఈ పాఠశాలలో ప్రస్తుతం 39 మంది పిల్లలు 1, 2 తరగతుల యందు చదువుచున్నారు.ఈ పాఠశాలయందు డిజిటల్ క్లాస్ రూమ్, విద్యా బోధన నిమిత్తం ఒక టీవీ కూడా కలదు..ఇంటర్నెట్ సదుపాయం కలదు. ఈ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయిని . డి.ఎస్.ఎన్ పద్మజ. అన్ని రకాల సదుపాయాలు కలవు.నాడు నేడు మొదటి విడతయందు ఈ పాఠశాలను అభివృద్ధి పరచినారు.

ఐ.సి.ఎం.ప్రాధమిక పాఠశాల[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

బాపులపాడులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఐదుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.

వైద్య సౌకర్యాలు[మార్చు]

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- గ్రామంలోని ఈ కేంద్రం, 1985వ సంవత్సరంలో ప్రారంభించారు. రోజుకు 50 మంది రోగులకు వైద్యసేవలందించుచున్న ఈ కేంద్రం, 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోనే ఉత్తమ ఆరోగ్యకేంద్రంగా ఎంపికైనది. ఈ మేరకు, 2014, జూలై-14వ తేదీనాడు, ఈ కేంద్రం వైద్యాధికారి శ్రీ బి.శ్రీనివాస్ కు మచిలీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేసినారు.
  • పశువైద్య కేంద్రం.

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

బాపులపాడు పైలట్ ప్రాజెక్టు:- ఈ ప్రాజెక్టును 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

నీటి శుద్ధి పథకం[మార్చు]

  • ఈ గ్రామంలో దాతల తోడ్పాటుతో, స్థానిక ప్రాథమిక సహకార సంఘం సమీపంలో, సుమారు 4.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటిశుద్ధి పథకం పూర్తి అయినది. దీని ద్వారా గ్రామస్థులకు, 20 లీటర్ల శుద్ధి నీటిని రెండు రూపాయలకే అందించెదరు. ఈ పథకాన్ని, హనుమజ్జయంతి సందర్భంగా, 2015,మే నెల-13వ తేదీనాడు, ప్రారంభించారు.
  • బాపులపాడు గ్రామంలోని ప్రభుత్వ, మండల కార్యాలయాలకు సమీపంలో ఉన్న మహాత్మా గాంధీనగర్ వద్ద, కొత్త నీటిశుద్ధి పథకం ఏర్పాటుచేయుటకై అవసరమైన 4 లక్షల రూపాయల విరాళాన్ని, కాకాని అరుణ, వెంకటేశ్వరరావు దంపతులు, అరేపల్లి అప్పారావు దంపతులు సంయుక్తంగా అందజేయుచున్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2021 లో సిరిపల్లి కమలాబాయి పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది ఉపసర్పంచిగా దుత్తా శివ నారాయణ గారు ఎన్నికయ్యాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • షిర్డీ సాయిబాబామందిరం
  • గ్రామ కూడలినందు కల హనుమాన్ గుడి అత్యంత ప్రసిద్ధ దేవాలయం.
  • నూజివీడు రోడ్ నందుకల వెంకటేశ్వర స్వామి దేవస్థానం.
  • పెరికీడు గ్రామం నందలి పురాతన శివాలయం
  • గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కానుమోలు గ్రామంలో ఒక పురాతన ఆలయం కూడా కలదు.
  • వేలేరు గ్రామ సమీపంలో ఒక రామాలయం కలదు..

గ్రామ విశేషాలు[మార్చు]

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా, బాపులపాడు మండల గృహనిర్మాణశాఖ అసిస్టెంటు ఇంజనీరుగా పనిచేయుచున్న మండవ సురేశ్, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసాపత్రాన్ని పొందినారు. 15-8-2014న మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కలెక్టరు రఘునందనరావు గారల చేతులమీదుగా వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. జిల్లా వ్యాప్తంగా గృహనిర్మాణశాఖలో ఈ ప్రశంసాపత్రాన్ని అందుకున్న అధికారి శ్రీ సురేశ్ ఒక్కరే కావడం గమనార్హం. [5]బాపులపాడు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అబివృద్ధిచేయడానికై, ఆ గ్రామాన్ని గన్నవరం శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్ దత్తత తీసుకున్నారు.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

బాపులపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 163 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 19 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 26 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 99 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 32 హెక్టార్లు
  • బంజరు భూమి: 29 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 129 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 83 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 108 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బాపులపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 96 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

బాపులపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, కాయగూరలు, చెరుకు, పప్పు దినుసులు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]