Coordinates: 16°13′46″N 81°04′00″E / 16.229524°N 81.066552°E / 16.229524; 81.066552

గూడూరు (కృష్ణా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడూరు
—  రెవెన్యూ గ్రామం  —
గూడూరు is located in Andhra Pradesh
గూడూరు
గూడూరు
అక్షాంశరేఖాంశాలు: 16°13′46″N 81°04′00″E / 16.229524°N 81.066552°E / 16.229524; 81.066552
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 7,439
 - పురుషులు 3,662
 - స్త్రీలు 3,777
 - గృహాల సంఖ్య 1,850
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

గూడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా. గూడూరు మండలం లోని గ్రామం, ఇది గూడూరు మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం.ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1888 ఇళ్లతో, 6786 జనాభాతో 1063 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3367, ఆడవారి సంఖ్య 3419. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1194 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 80. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589673.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మచిలీపట్నంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల 64వ వార్షికోత్సవం, 2016,మార్చి-1న ఘనంగా నిర్వహించారు.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

గూడూరులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

గూడూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

గూడూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 193 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 6 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 8 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 3 హెక్టార్లు
  • బంజరు భూమి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 834 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 8 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 834 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

గూడూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 834 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

గూడూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామంలోని వైద్య సౌకర్యాలు[మార్చు]

కోనేరు శకుంతల మెమోరియల్ సాయి నేత్రాలయం[మార్చు]

గూడూరు గ్రామంలో, దత్త కారుణ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో, వరాలసాయి మందిర ఆవరణలో, ఈ ఆసుపత్రి నిర్మించారు. గూడూరుతోపాటు, బందరు, పెడన తదుతర మండలాల ప్రజలకు, అత్యాధునిక కంటిసేవలు అందించుటకై, కోనేరు ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆసుపత్రికి భూరివిరాళం అందించారు. ఉచితంగా శస్త్ర చికిత్సలతోపాటు, వైద్యసేవలు అందించుటకై దాతలు ఒక కోటి రూపాయలు అందించారు. పాలకొల్లుకు చెందిన రాజమల్లి రాధామోహన్ కంటి ఆసుపత్రి వారు, ఈ ఆసుపత్రికి సాంకేతిక సహకారాన్ని అందించారు. ఈ ఆసుపత్రిని 2015,జూన్-11వ తేదీనాడు ప్రారంభించారు.

శుద్ధినీటి కేంద్రం[మార్చు]

గూడూరు గ్రామంలో శ్రీరాం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒక నీటిశుద్ధి కర్మాగారాన్ని (R.O.Plant) 2014,జూన్-2న ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఈశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.2021 లో జరిగిన ఎన్నికలలో వైస్సార్సీపీ మధ్యత ఇచ్చిన మహిళని సర్పంచ్ గా ఎన్నుకున్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

గూడూరు గ్రామంలో అనేక దేవాలయలున్నాయి. గుడులు (దేవాలయలు) ఉన్న ఊరు కనుక ఆగ్రామానికి గూడూరు అన్నపేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. గూడూరు ఉన్న అనేక దేవాలయలలో ముఖ్యమైనవి:-

  • శ్రీ గణపతిస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక గాంధీ బొమ్మ కూడలిలో ఉంది.
  • శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత మాధవస్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు.
  • శ్రీ వేంకటాచలపతి ఆలయము.
  • శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ నృసింహస్వామి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మార్చ్-2వ తేదీ మంగళవారం నాడు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభించారు. ఉదయమే స్వామివారిని పెళ్ళికుమారునిగా అలంకరించి పూజలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 5వ తేదీ, గురువారం, ఫాల్గుణ పౌర్ణమి నాడు, రాత్రి స్వామివారి రథోత్సవం, నరసింహస్వామివారి కోలలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రథం లాగడానికి భక్తులు పోటీలు పడినారు. దీనితో రాత్రిపూట సైతం, గూడూరు గ్రామం కోలాహలంగా మారినది. 6వ తేదీ శుక్రవారం ఉదయం, అవభృదోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణం, మౌనబలి కార్యక్రమాలతో పాటు, పుష్పయాగోత్సవం నిర్వహించారు. ద్వాదశ ప్రదక్షిణల అనంతరం నిర్వహించిన పవళింపుసేవతో ఉత్సవాలు ముగిసినవి.
  • శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ సీతారామాలయం.
  • సద్గురు శ్రీషిర్డీ సాయిబాబా అలయము.
  • శ్రీ వెంకమ్మ, సీతమ్మ పేరంటాళ్ళు, పట్టాభిరామయ్యల అలయం:- ఈ ఆలయంలో వార్షిక జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) రెండు రోజులు వైభవంగా నిర్వహించెదరు.
  • గొంతేనమ్మ:- గూడూరు పంచాయతీ పరిధిలోని నీలం ఎస్.సి.వాడలోని గొంతేనమ్మ సంబరాన్ని 2014, అక్టోబరు-20 సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతోపాటు బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించగా, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
  • శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- గూడూరు గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,మే నెల-12వ తేదీ మంగళవారంనాడు, గ్రామోత్సవం నిర్వహించారు. 13వ తేదీ బుధవారంనాడు, విగ్రహ ప్రతిష్ఠ నిర్వఘించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
  • మస్జిదులు:-
  1. జామియా మస్జిద్
  2. చిన్న మస్జిదు
  3. పఠాన్ పేట మస్దిదు
  4. ఈద్గాహ్

ప్రముఖులు[మార్చు]

వనరులు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]