Coordinates: 16°34′03″N 80°24′45″E / 16.567513°N 80.412482°E / 16.567513; 80.412482

వైకుంఠపురం (అమరావతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైకుంఠపురం
—  రెవిన్యూ గ్రామం  —
వైకుంఠపురం గ్రామంలో బస్సులు నిలుచు ప్రదేశ చిత్రం
వైకుంఠపురం గ్రామంలో బస్సులు నిలుచు ప్రదేశ చిత్రం
వైకుంఠపురం గ్రామంలో బస్సులు నిలుచు ప్రదేశ చిత్రం
వైకుంఠపురం is located in Andhra Pradesh
వైకుంఠపురం
వైకుంఠపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°34′03″N 80°24′45″E / 16.567513°N 80.412482°E / 16.567513; 80.412482
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం అమరావతి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ తోకల వెంకటేశ్వర్లు
జనాభా (2011)
 - మొత్తం 3,126
 - పురుషుల సంఖ్య 1,578
 - స్త్రీల సంఖ్య 1,548
 - గృహాల సంఖ్య 872
పిన్ కోడ్ 522020
ఎస్.టి.డి కోడ్ 08645

వైకుంఠపురం, పల్నాడు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 872 ఇళ్లతో, 3126 జనాభాతో 1360 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1578, ఆడవారి సంఖ్య 1548. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1598 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 88. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589947.[1]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,169. ఇందులో పురుషుల సంఖ్య 1,612, స్త్రీల సంఖ్య 1,557, గ్రామంలో నివాస గృహాలు 755 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,360 హెక్టారులు.

సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న గ్రామం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి.సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు,కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

సమీప గ్రామాలు[మార్చు]

పెద్ద మద్దూరు 3 కి.మీ, అమరావతి 9 కి.మీ, వడ్డమాను 4 కి.మీ, బోరుపాలెం 4 కి.మీ, దొండపాడు 5 కి.మీ, హరిచంద్రాపురం 3 కి.మీ.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు అమరావతి లోనూ ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల అమరావతిలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ధరణికోటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అమరావతిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వైకుంఠపురంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరుఒక నాటు వైద్యుడు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వైకుంఠపురంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వైకుంఠపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 263 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 119 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 112 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 14 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
  • బంజరు భూమి: 15 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 830 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 762 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 88 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వైకుంఠపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • కాలువలు: 88 హెక్టార్లు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తోకల వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనాడు. [4]ఈనాడు గంటూరు రూరల్; 2014,డిసెంబరు-12; 2వపేజీ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. వైకుంఠపురంలో నూతనంగా నిర్మించిన భవగ్ని మర్మయోగ విద్యాలయం (ఆరామం) ప్రారంభోత్సవ వేడుకలు 2013, జూలై-22, సోమవారం నాడు, నిర్వహించారు. తి.తి.దే. అధ్యక్షులు కనుమూరి బాపిరాజు దంపతులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కనుమూరి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఆరామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. భవగ్నీ గురుదేవులు ప్రసంగించారు. గురువులకు గురువుగా కీర్తినందుకున్న వ్యాసభగవానుడి జన్మదినమైన గురుపౌర్ణమి శుభఘడియలలో ఈ ఆరామాన్ని ప్రారంభించారు.
  2. ఈ గ్రామంలోని స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రాజగోపుర ప్రతిష్ఠోత్సవాలలో భాగంగా 2014,ఫిబ్రవరి-18మంగళవారంనాడు చతుస్థానార్చనలు నిర్వహించారు. మరుసటిరోజు (2014, ఫిబ్రవరి-19న) ఉదయం 11-05 గంటలకు, ఆలయ రాజగోపుర ప్రతిష్ఠోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగింది. తరువాత స్వామివారికి శాంతికళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అన్నసంతర్పణ జరిగింది.
  3. శ్రీ భవఘ్ని ఆశ్రమం:- ఈ ఆశ్రమంలో భగవద్గీత జయంతి ఉత్సవాలను, 2014,డిసెంబరు-3వ తేదీ నండి 11వ తేదీ వరకు భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

కృష్ణానది తీర గ్రామమైన వైకుంఠపురం అందమైన ఊరు.అరటి తోటలు, పసుపు మడులు అధికం. వాటికి తోడు మిరప, కంద తోటలతో, వాటిమధ్య చిన్న కాలువలతో సుందరంగా ఉంటుంది. ఊరి ప్రక్కగా నది వడ్డున చిన్న కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. అమరావతి నుండి విజయవాడకు లాంచీలపై వెళ్ళేటపుడు ఈ ఊరు, వెంకటేశ్వరుని దేవాలయం అందంగా కనిపిస్తాయి.

ఈ గ్రామానికి నడిబొడ్డున ఉన్న నల్లరాతి విగ్రహాన్ని, జైన తీర్ధంకరుడైన శాంతినాధుడి ప్రతిమగా గుర్తించారు. 2014, డిసెంబరు-2వ తేదీన, అమరావతిలోని శ్రీ చింతామణి పార్శ్వనాధ జైన దేవాలయంలో ప్రతిష్ఠోత్సవ ఉత్సవాలు ముగించుకొని వెళుచున్న జైన మతాచార్యులు, ఈ ప్రతిమను గమనించి పరిశీలించడంతో, ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. జైనాచార్యుడు శ్రీమద్ విజయరాజ్ తిలక్ సూరీశ్వర్జీ శిష్యులు మోక్ష తిలక్ విజయ్ జీ, కనకరాజ్, శ్రీ సంఖ్యేశ్వర్ పార్శ్వనాథ్ గిరిరాజ్ ట్రస్ట్ కార్యదర్శి ధరం చంద్ లు, ఈ ప్రతిమను పరిశీలించి నిర్ధారించిన వారిలో ఉన్నారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.

వెలుపలి లంకెలు[మార్చు]