ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pnb:سبولکشمی |
|||
పంక్తి 259: | పంక్తి 259: | ||
[[వర్గం:1916 జననాలు]] |
[[వర్గం:1916 జననాలు]] |
||
[[వర్గం:2004 మరణాలు]] |
[[వర్గం:2004 మరణాలు]] |
||
[[వర్గం:కర్ణాటక సంగీతం]] |
|||
[[వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు]] |
|||
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]] |
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]] |
||
⚫ | |||
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]] |
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]] |
||
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]] |
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]] |
||
[[వర్గం:రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు]] |
[[వర్గం:రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు]] |
||
⚫ | |||
[[en:M. S. Subbulakshmi]] |
[[en:M. S. Subbulakshmi]] |
12:42, 18 మే 2011 నాటి కూర్పు
ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి | |
---|---|
దస్త్రం:M.S. Subbalakshmi.jpg | |
జననం | మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి సెప్టెంబర్ 16, 1916 మదురై,తమిళనాడు రాష్ట్రం |
మరణం | డిసెంబర్ 11, 2004 చెన్నై, తమిళనాడు రాష్ట్రం |
మరణ కారణం | ఊపిరితిత్తుల న్యుమోనియా, హృదయ సంబంధ సమస్యలతో[1] |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
వృత్తి | కర్నాటక సంగీత గాయకురాలు/నాయకురాలు మరియు నటి |
మతం | హిందూ |
భార్య / భర్త | త్యాగరాజన్ సదాశివన్ |
పిల్లలు | లేరు |
తండ్రి | సుబ్రహ్మణ్య అయ్యర్ |
తల్లి | షణ్ముఖవడివు అమ్మల్ |
ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?
ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?
తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒక వరం.
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది.
ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది.
అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే
మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి
దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న[2] పురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు.ప్రపంచం లో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. నేను 'ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి'కి సమకాలీకుడనని చెబితే యముడు 'నువ్వు సకల స్తోత్రాలూ,మంత్రాలూ,కవచాలూ,సుప్రభాతాలూ..,అన్నీ వినే వుంటావు.ఇక నీకిక్కడ పని ఏమిటి స్వర్గానికి పో అంటాడు.మాతాతయ్య గాంధీని చూసానని చెప్పేవారు.నేను నా మనుమలకు ఎమ్మెస్ ని చూసానని గొప్పగా చెప్పుకొంటాను.పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి 'నాహం కర్తాః-హరిః కర్తాః'అనే పుస్తకం చదివితే,ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది.
బాల్యము
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ , ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఙిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి. కోసం 'ఆల్బమ్ ' అందించింది.
జీవితం
సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నై కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ , స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది.
ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ' వైష్ణవ జనతో....' జె పీర్ పరాయీ జానేరే......' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. అమె కంఠం అత్యంత మధురం. భజనపాడుతూ అందులొనే అమె పరవశురాలవుతారు. ప్రార్ధన సమయములొ ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలొ లీనవడం వేరు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే, సుబ్బలక్ష్మి సంగీతములొని మాదుర్యపు ప్రభావం, సారాంశం ఏమిటో అర్థం చేసికోవచ్చు!
ఐక్య రాజ్య సమితి లో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది.
స్వర సంకలనం
గానం | భాష | సంవత్సరం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి గానం |
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం | తెలుగు |
| |
బ్రహ్మ కడిగిన పాదము... | ||||
వాతాపి గణ పతిం భజే... | కీర్తన వీడియో లింక్ | |||
భజ గోవిందం మూడమతే... | కీర్తన వీడియో లింక్ | |||
రేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 | ఆడ మోడి గలదా...[6] | |||
ఆల్బం : సుబ్బలక్ష్మి ఎం.ఎస్ లైవ్ | అంబా నీ...[6] | |||
అరుల్ పురివై...[6] |
పురస్కారాలు, సన్మానాలు
తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, చేధించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు.అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి.
పురస్కారం పేరు | బహూకరించింది | సంవత్సరం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
పద్మభూషణ్[2] | భారత ప్రభుత్వం | 1954 | ||
బిరుదు | సంగీతకళానిధి | ది మ్యూజిక్ అకాడమి చెన్నై,తమిళనాడు |
1969 | మొట్టమొదటి సారిగా అందుకున్న స్త్రీ గాయకురాలు |
డాక్టరేట్ | శ్రీ వెంకటేస్వర విశ్వవిద్యాలయం అంధ్రప్రదేశ్ |
1971 | ||
డాక్టరేట్ | ఢిల్లీ యూనివర్సిటి ఢిల్లీ |
1973 | ||
రామన్ మెగసెసే పురస్కారం[7] | ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం | 1974 | ||
పద్మవిభూషణ్[2] | భారత ప్రభుత్వం | 1975 | ||
డాక్టరేట్ | బెనారస్ యూనివర్సిటి ఉత్తరప్రదేశ్ |
1980 | ||
డాక్టరేట్ | యూనివర్సిటి ఆఫ్ మద్రాస్ తమిళనాడు |
1987 | ||
కాళీదాస్ సన్మాన్[1] | మధ్యప్రదేశ్ ప్రభుత్వం | 1988 | ||
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు | భారత ప్రభుత్వం | 1990 | ||
భారతరత్న[2] | భారత ప్రభుత్వం | 1998 | సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకుని చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలు | |
జీవిత సాఫల్య పురస్కారం[8] ( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు ) |
డిల్లీ ప్రభుత్వం | 2004 | ఎం.ఎస్.సుబ్బలక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదు ని స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరేంద్ర సరస్వతీ స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు. |
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గురించి ప్రచురణలు
పుస్తకం పేరు | భాష | సంవత్సరం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర సంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జి[9] |
ఇంగ్లీష్ | 2004 |
పుస్తకం ఆన్ లైన్ ద్వారా కొనుటకు: | |
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది.
ఇవికూడా చూడండి
- ఇంగ్లీష్ వికీపీడియా :ఎం.ఎస్.సుబ్బలక్ష్మి :లింక్
వెలుపలి లింకులు
- ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గురించి రామన్ మెగసెసె అవార్డ్ వారి అధీక్రుత వెబ్సైట్ లొ సంగ్రహ జీవిత చరిత్ర
- ఎం.ఎస్.సుబ్బలక్ష్మి-20వ శతాబ్దంలొ 100 మంది ప్రముఖ తమిళులు.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పేజీ
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 హిందూ పత్రిక వెబ్సైట్ నుండి M.S. subbulakshmi passes away, aged 88.జూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ 2.0 2.1 2.2 2.3 భారతరత్న పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10, 2008న సేకరించబడినది. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "india.gov.in" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ యూట్యూబ్ వీడియో పరిచయంజూన్ 13,2008న సేకరించబడినది.
- ↑ స్మాష్ హిట్స్ వెబ్సైట్ నుండి జూన్ 13,2008న సేకరించబడినది.
- ↑ యూట్యూబ్ వీడియోజూన్ 13,2008న సేకరించబడినది.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ వెబ్సైట్ నుండి...ఎం.ఎస్. సుబ్బలక్ష్మిజూన్ 13,2008న సేకరించబడినది.
- ↑ రామన్ మెగసెసె పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ హిందూ పత్రిక వెబ్సైట్ నుండి Lifetime Achievement Award for M.S. Subbulakshmi జూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ హిందూ పత్రిక వెబ్ సైట్ నుండిఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రజూన్ 13,2008న సేకరించబడినది.