బొడ్డువారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసంతనూతలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


బొడ్డువారిపాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

బొడ్డువారిపాలెం గ్రామం, సంతనూతలపాడు నుండి మద్దులూరు వెళ్ళుచున్నప్పుడు, చండ్రపాలెం తరువాత గంగవరం నుంచి తూర్పు 1/2 కి.మి. తరువాత వస్తుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి స్కూలు ఉంది.

మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:-ఈ గ్రామంనకు త్రాగు నీటి సమస్య చాల ఎక్కువ. ఎనికపాడు గ్రామం నుండి మంచి నీటి వసతి ఈ మధ్యన ఏర్పాటు చేశారు. ఈ గ్రామం నుండి విదేశాలలో స్థిర పడ్డ ఎవరయినా దాతలు మంచినీటి వసతి కల్పించినట్లయితే ఈ గ్రామానికి చాలా మేలు చేసిన వారు అవుతారు.

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామానికి ఈశాన్యమున ఒక చెరువు ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • గంగవరం గ్రామం కూడా బొడ్డువారిపాలెం గ్రామ పంచాయితి లోనిదే.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మంచికంటి వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

వినాయకుని గుడి[మార్చు]

స్కూలు ప్రక్కన వినాయకుని గుడి ఉంది. ఆ గ్రామంలోని ఒక మహిళ చాల కష్టపడి చందాలు పోగుచేసి గుడి కట్టించింది.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ దేవస్థానంలో పొంగళ్ళ వార్షికోత్సవాలు, 2014, జూన్-1, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లి, నాంచారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, పోతురాజుస్వామి లకు ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. గత ఐదురోజులుగా గ్రామస్థులు పోలేరమ్మ తల్లికి నీటితో అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం ప్రత్యేకంగా పొంగళ్ళు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వేళలో మహిళలు పొంగళ్ళతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్ళి, పోలేరమ్మకు పొంగళ్ళు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రత్యేక అలంకరణలో నిలిచింది.

బొడ్డువారిపాలెం గ్రామంలో బాలినేని వంశస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారు, అయ్యవార్ల కొలుపులను 2017, జూన్-4వతేదీ ఆదివారంనాడు ప్రారంభించెదరు.

ప్రధాన పంటలు[మార్చు]

ఇక్కడి భూమి మెట్ట ప్రాంతము. ఎక్కువగా ప్రత్తి, పొగాకు, మిరప పంటలు పండిస్తారు.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామంలోని వారు ఎక్కువగా పాలు తీసుకుని ఒంగోలు పట్టణములో అమ్ముతారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీరు ఉన్నాడంటే ఆశ్శర్యం లేదు.
  • కమ్మ, రెడ్డి, మాల, యానాది కులాలవారు ఎక్కువ. రెండు కుటుంబాలు విశ్వ బ్రాహ్మణుల వారు కలరు. ఈ కుటుంబంలోని వ్యక్తి 5 సంవత్సరాలు పంచాయితి ప్రెసిడెంటుగా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]