ఆర్.సి. కృష్ణస్వామి రాజు
This article ఆత్మకథ అయి ఉండవచ్చు. లేదా వ్యాసవిషయమైన వ్యక్తి గాని, వారికి సంబంధించిన సంస్థ గానీ చాలా ఎక్కువ దిద్దుబాటు చేసి ఉండవచ్చు.. (ఆగస్టు 2023) |
ఆర్.సి. కృష్ణస్వామి రాజు | |
|---|---|
| జననం | రాచకొండ చెంగల్రాజు కృష్ణస్వామి రాజు 1962 జనవరి 19 ఈశ్వరాపురం గ్రామం, పుత్తూరు తాలుకా చిత్తూరు జిల్లా |
| జాతీయత | ఇండియన్ |
| చదువు | ఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమోలు |
| వృత్తి | రిటైర్డ్ ఎల్.ఐ.సి. డెవలప్మెంట్ ఆఫీసర్ |
| పేరుపడ్డది | కథకుడు |
| Notable work | 18 కథా సంపుటాలు మరియు 2 నవలలు ప్రచురణ చేశారు |
| భాగస్వామి | సూరపరాజు మీనాక్షి |
| పిల్లలు | పూజిత, శేషసాయి |
ఆర్.సి. కృష్ణస్వామి రాజు (R.C. Krishnaswami Raju) తిరుపతికి చెందిన కథా రచయిత. ఇప్పటివరకు ఆయనవి చిన్నాపెద్దా కథలు 600 దాకా వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మాండలికంలో, జనం మాట్లాడుకొనే భాషలో వ్రాయడం ఆయన ప్రత్యేకత.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆర్.సి. కృష్ణస్వామి రాజు (R.C. Krishnaswami Raju) తిరుపతి జిల్లా పుత్తూరు శల్య వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్రాజు నారాయణమ్మల ఎనిమిదవ సంతానం. ఎమ్.ఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్ లలో డిప్లొమాలు పూర్తి చేశారు. తిరుపతి ఎల్ ఐ సి కార్యాలయంలో 35 ఏళ్ళ పాటు డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. 1984-87లలో ఈనాడు పత్రికా విలేఖరిగా పని చేశారు.
రచనలు
[మార్చు]మొదటి కథ ‘ఈ కాలం పిల్లలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1984 లో ప్రచురితమయ్యింది. ఇప్పటి దాకా భిన్న వర్గాలకు చెందిన 18 కథా సంపుటాలు, 2 నవలలు వెలువరించారు.
- మాండలిక కథలు: ముగ్గురాళ్ళ మిట్ట[1], సల్లో సల్ల[2], గాండ్ల మిట్ట[3] , జక్కదొన
- బాల సాహిత్యం: రాజు గారి కథలు[4], రాణి గారి కథలు[4], కార్వేటినగరం కథలు[5] నాన్నారం కథలు
- మినీ కథలు: పకోడీ పొట్లం[అరవై కార్డు కథలు][4], మిక్చర్ పొట్లం[ ముప్పై మినీ కథలు][6]
- హాస్య కథలు: దుశ్శాలువా కప్పంగ[4],మీది తెనాలి-మాది తెనాలి
- ఆధ్యాత్మిక కథలు: గతం గతః[4],యోగక్షేమం వహామ్యహం, యద్భావం తద్భవతి
- నవల : మేకల బండ, మునికిష్టడి మాణిక్యం [బాలల నవల]
- చిత్తూరు జిల్లా యాస కథలు: కిష్టడి కతలు[7],రాజనాల బండ[8], పుత్తూరు పిల గోడు’[9][4]
- ఆల్ ఇండియా రేడియో వారు [ఆదిలాబాద్, తిరుపతి కేంద్రాలు] 'కిష్టడి కతలు, రాజు గారి కథలు, రాణిగారి కథలు, కార్వేటి నగరం కథలు, నాన్నారం కథలు' పుస్తకాలలోని కథలను ప్రసారం చేశారు.
- ఆయన 'గాండ్ల మిట్ట' పుస్తకంపై చెన్నై లోని ప్రెసిడెన్సీ కళాశాలలో నల్లా యామిని [కరీం నగర్] అనే పరిశోధక విద్యార్థి ఎం.ఫిల్ పూర్తి చేశారు.
- 'దుశ్శాలువా కప్పంగ' అనే పుస్తకంపై అదే చెన్నై లోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆర్.శైలజ [చెన్నై] అనే పరిశోధక విద్యార్థి ఎం.ఫిల్ పూర్తి చేశారు.
- కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఆయన రచనలపై పి.హెచ్.డి పరిశోధన జరుగుతోంది.
- రాజుగారి కథలు బాలల పుస్తకం ‘రాజన కథెగళు’ గాను, రాణి గారి కథలు ‘రాణియ కథెగళు' పేరుతోను కన్నడంలోకి అనువదింపబడ్డాయి. అనువాదకురాలు సూర్య వంశీ అనువదించగా, బెంగుళూరు విక్రం పబ్లికేషన్స్ వారు వీటిని ప్రచురించారు.
- 'మునికిష్టడి మాణిక్యం' [బాలల నవల] తానా - మంచి పుస్తకం వారి బహుమతి గెలుచుకుంది.
పురస్కారాలు
[మార్చు]- ‘ముగ్గురాళ్ళ మిట్ట’ సంపుటికి శ్రీ మక్కెన రామ సుబ్బయ్య స్మారక పురస్కారం, హైదరాబాద్ జి వి ఆర్ ఫౌండేషన్ వారి ఉత్తమ కథా సంపుటి బహుమతి లభించాయి.
- ‘సల్లో సల్ల’ కథల సంపుటికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక కథా పురస్కారం లభించింది[10].
- ‘పకోడి పొట్లం’ కార్డు కథల సంపుటికి రావూరి భరద్వాజ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రావూరి వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించారు[11].
- సాహితీ సేవ చేస్తున్నందులకు తిరుపతి విశ్వశ్రీ సాహితీ సమాఖ్య వారి గార్లపాటి పురస్కారం లభించింది. అలాగే చెన్నై తెలుగువెలుగు సంక్షేమ సంఘం వారు తెలుగు వెలుగు పురస్కారం అందించారు.
- చక్కటి హాస్య రచనలు చేస్తున్నందులకు తెలుగు విశ్వ విద్యాలయం వారు 2020 వ సంవత్సరానికి కీర్తి పురస్కారం అందించారు[12][13].
- ఆయన రచించిన ‘రాజు గారి కథలు’ బాలల పుస్తకం పార్వతీపురం నారంశెట్టి బాల సాహిత్య పీఠం వారిచే ఉత్తమ గ్రంథంగా ఎంపికయ్యింది.
- ‘రాణి గారి కథలు’ పుస్తకానికి సిద్దిపేట పెందోట బాల సాహిత్య పీఠం వారి పురస్కారం లభించింది[14].
- 'కార్వేటినగరం కథలు' పుస్తకానికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక బాల కథా పురస్కారం లభించింది.
- BREAD [BASIC RESEARCH EDUCATION & DEVELOPMENT SOCIETY] వారు ‘నాన్నారం కథలు’ పుస్తక కథలను రెండు వేల కాపీలు ప్రచురించి,ఉభయ తెలుగు రాష్ట్రాలలోని బడి గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేశారు.
- 'గాండ్ల మిట్ట’ కథల సంపుటికి సాహితీ కిరణంవారి బాలగంగాధరయ్య సాహితీ పురస్కారం లభించింది[15].
- 'మేకల బండ' నవలకు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు వారు ప్రథమ నవలా పురస్కారం అందించారు.
- 'మేకలబండ' నవలకు గోవిందరాజు సీతాదేవి పురస్కారం లభించింది.
- 'జక్క దొన' కథల సంపుటికి ఖమ్మం హాసిని రామచంద్ర 2025 పురస్కారం లభించింది.
- APPSC GROUP EXAMS/DYEO/APRIL 2025 ప్రశ్నా పత్రంలో 'జక్కదొన పుస్తక రచయిత ఎవరు?' అనే ప్రశ్న రావడం జరిగింది.
ఇతరాలు
[మార్చు]- ఎల్ ఐ సి ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు, పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సి.ఏ., ఎం.బి. ఏ., చదివే విద్యార్థులకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఇప్పటివరకు వందకి పైగా పర్సనాలిటీ డెవలప్ మెంట్ తరగతులు నిర్వహించారు.
- ఎల్ ఐ సి డెవలప్ మెంట్ ఆఫీసర్ల అసోసియేషన్ నెల్లూరు డివిజన్ జాయింట్ సెక్రటరీగా [1997-2007] విధులు నిర్వహించారు.
- పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ సెక్రెటరీగాను, వైస్ చైర్మన్[16] గాను పదవీ బాధ్యతలు నిర్వహించారు. సెక్ర టరీగా [2005-06] బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ చాప్టర్ కు జాతీయ అవార్డు లభించింది.
- తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉద్యోగుల శిక్షణా కేంద్రం 'శ్వేత' లో అతిథి ఉపన్యాసకులుగా పని చేస్తున్నారు.
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "విలక్షణ జానపద శైలి ముగ్గురాళ్ల మిట్ట (కథలు)".[permanent dead link]
- ↑ "సల్లో సల్ల... పుస్తక పరిచయం". Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
- ↑ "మంచి మనుషుల మంచి కథలు - గాండ్లమిట్ట".
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "కథా రచయిత, బాలసాహితీవేత్త శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ".
- ↑ "కార్వేటినగరం కథలు పుస్తక ఆవిష్కరణ".
- ↑ "వైవిధ్య కథల సమాహారం - మిక్చర్ పొట్లం".
- ↑ "ఆకట్టుకునే 'కిష్టడి కతలు'".
- ↑ "'Rajanala Banda' book released in Tirupati, hailed for bringing Telugu local dialect to the fore".
- ↑ "మాతృభాషకు పట్టంగట్టిన పుత్తూరు'పిల'గోడు".
- ↑ "ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి శివేగారి దేవమ్మ పురస్కారం".
- ↑ "ఆర్.సి. కృష్ణస్వామి రాజుకు రావూరి భరద్వాజ ప్రతిభా పురస్కారం - ప్రకటన".
- ↑ "ఘనంగా తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం".
- ↑ "44 మందికి తెలుగు వర్సిటీ 'కీర్తి పురస్కారాలు'".
- ↑ "'రాణి గారి కథలు' పుస్తకానికి పెందోట బాల సాహిత్య పురస్కారం - ప్రెస్ నోట్".
- ↑ "ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి 'సాహితీ కిరణం' పురస్కారం".
- ↑ "Public Relations Society of India new office-bearers take charge".
01. నమస్తే తెలంగాణ (2023-03-29) "22 మందికి కీర్తి పురస్కారాలు"
02. నవతెలంగాణ (30 April 2016) "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం" Archived 2023-04-25 at the Wayback Machine
03. ఆంధ్రజ్యోతి ఆదివారం కథ - అమ్మా .. నీకు దండమే! Archived 2023-04-25 at the Wayback Machine