ఈస్టర్ దీవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rapa Nui
ఈస్టర్ దీవి
Isla de Pascua
Flag of ఈస్టర్ దీవి
ఈస్టర్ దీవి యొక్క స్థానం
ఈస్టర్ దీవి యొక్క స్థానం
Easter Island map showing Terevaka, Poike, Rano Kau, Motu Nui, Orongo, and Mataveri; major ahus are marked with moai
రాజధానిHanga Roa
27°9′S 109°25.5′W / 27.150°S 109.4250°W / -27.150; -109.4250
అధికార భాషలు Spanish, Rapa Nui[ఆధారం చూపాలి]
జాతులు (2002) Rapanui 60%, European or castizo 39%, Amerindian 1%
ప్రజానామము Rapa Nui or Pascuense
ప్రభుత్వం Special territory of Chile[1]
 -  President of Chile Michelle Bachelet
 -  Regional Intendant Iván de la Maza
 -  Provincial Governor Melania Carolina Hotu Hey
 -  Mayor Pedro Pablo Edmunds Paoa
Annexation to Chile 
 -  Treaty signed September 9, 1888 
జనాభా
 -  2002 జన గణన 3,791 
కరెన్సీ Peso (CLP)
కాలాంశం Central Time Zone (UTC-6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cl
కాలింగ్ కోడ్ +56 32
ఈస్టర్ ద్వీపం, సాలా వై గోమెజ్, దక్షిణ అమెరికా
ఈస్టర్ ఐల్యాండ్‌ను కేంద్రీకృతం చేసివున్న లేఖన ప్రదర్శన

ఈస్టర్ దీవి (Easter Island), పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేసియన్ దీవి. ఈ దీవి 1888 సంవత్సరంలో చిలీ దేశంతో అనుసంధించబడింది. ఈస్టర్ దీవి ప్రాచీనమైన విగ్రహాలకు ప్రసిద్ధిచెందినది. వీటిని రపనూయీ (Rapanui) ప్రజలు నిర్మించారు. ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం (world heritage site) ప్రస్తుతం రప నూయీ జాతీయ వనం (Rapa Nui National Park) గా రక్షించబడింది.

ఈస్టర్ ఐల్యాండ్ (ఈస్టర్ ద్వీపం) (మూస:Lang-rap, స్పానిష్: [Isla de Pascua] Error: {{Lang}}: text has italic markup (help)) అనేది పసిఫిక్ మహాసముద్ర ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఒక పాలినేషియా (ఓషియానియా తూర్పు ప్రాంతం) ద్వీపం, ఇది పాలినేషియా ట్రయాంగిల్‌కు ఆగ్నేయపు అంచున ఉంది. 1888లో ఈస్టర్ ద్వీపాన్ని చిలీ స్వాధీనం చేసుకుంది, ప్రస్తుతం చిలీలో ప్రత్యేక భూభాగమైన ఈ ద్వీపం మోవుయి లుగా (pronounced /ˈmoʊ.aɪ/) పిలిచే 887 సజీవ స్మారక విగ్రహాల ద్వారా ప్రసిద్ధి చెందింది, ఈ విగ్రహాలను రాపానుయ్ పౌరులు సృష్టించారు. ఈ ద్వీపంలో ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం (UNESCO చేత గుర్తింపు పొందింది) ఉంది, రాపా నుయ్ జాతీయ పార్కు పరిధిలో ద్వీపం యొక్క ఎక్కువ ప్రాంతం పరిరక్షించబడుతుంది. ఇటీవలి కాలంలో మితిమీరిన వినియోగం వలన వచ్చే సాంస్కృతిక, పర్యావరణ నష్టాలకు ఒక ముందస్తు హెచ్చరిక కథగా ఈ ద్వీపం ఉదహరించబడుతుంది. ఐరోపా వలసరాజ్య స్థాపకుల ద్వారా సంక్రమించిన వ్యాధులు, 1800వ దశకంలో జనాభాను నాశనం చేసిన "బానిసల కోసం జరిగిన దాడుల"[2] ఫలితంగా ఇక్కడ పర్యావరణ ప్రభావం కంటే సామాజిక ప్రభావాల ద్వారా అధిక స్థాయిలో నష్టం జరిగిందని ప్రస్తుతం మానవ సామాజిక శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.

భౌగోళికం[మార్చు]

ఈస్టర్ దీవి ప్రపంచంలోని జనావాసమున్న అత్యంత ఒంటరి ద్వీపాలు. ఇది చిలీ దేశానికి తూర్పు దిక్కున 3,510 కి.మీ. దూరంలో ఉంది.ఈ ద్వీపంపై అడుగుపెట్టిన మొట్టమొదటి ఐరోపా సందర్శకుడిగా పరగణించబడుతున్న డచ్ అన్వేషకుడు జాకబ్ రోగెవీన్ దీనికి "ఈస్టర్ ఐల్యాండ్" అని పేరు పెట్టారు, ఆయన ఈ ద్వీపాన్ని 1722 ఈస్టర్ ఆదివారం రోజు గుర్తించారు, డేవిస్ లేదా డేవిడ్స్ ద్వీపం అన్వేషణకు వెళుతూ ఆయన దీనిని గుర్తించడం జరిగింది, ఆయన తన భాషలో దీనికి పెట్టిన పేరు పాష్-ఐల్యాండ్ (18వ శతాబ్దపు డచ్ భాషలో ఈ పేరుకు "ఈస్టర్ ద్వీపం" అనే అర్థం వస్తుంది).[3] ఈ ద్వీపం యొక్క అధికారిక స్పానిష్ పేరు ఐస్లా డి పాస్కువా, దీనికి కూడా "ఈస్టర్ ద్వీపం" అనే అర్థం వస్తుంది.

పేరు[మార్చు]

ఈ ద్వీపానికి ప్రస్తుత పాలినేషియన్ పేరు "రాపా నుయ్" లేదా "బిగ్ రాపా", ఈ పేరు 1860వ దశకంలో బానిసల కోసం జరిగిన దాడుల సందర్భంగా వాడుకలోకి వచ్చింది, ఈస్టర్ ద్వీపం యొక్క భౌగోళిక స్వరూపం ఆస్ట్రాల్ ద్వీప సమూహాంలోని బాస్ ద్వీపాల్లో ఉన్న రాపా అనే ద్వీపం యొక్క భౌగోళిక స్వరూపాన్ని పోలివుంటుంది, అందువలన దీనికి రాపా నుయ్ అనే పేరు పెట్టారు.[4] ఇదిలా ఉంటే, థోర్ హెయెర్దాహల్ ఈ ద్వీపం పేరునే రాపా ద్వీపానికి పెట్టారని వాదించారు, ఈస్టర్ ద్వీపం అసలు పేరు రాపా అని, దీనికి రాపా ఐతి అనే పేరును దాని యొక్క శరణార్థులు పెట్టారని పేర్కొన్నారు.[5]

ఈస్టర్ ద్వీపానికి అసలు పాలినేషియన్ పేరు విషయంలో అనేక పరికల్పనలు ఉన్నాయి, "ది నావెల్ ఆఫ్ ది ల్యాండ్" లేదా "ది ఎండ్స్ ఆఫ్ ది ల్యాండ్" అనే అర్థం వచ్చే టె పిటో ఓ టె హెనువా పేరు కూడా వీటిలో ఒకటి. పిటో అనే పదానికి నాభి, బొడ్డుతాడు అనే అర్థాలు ఉన్నాయి, మహాసముద్రం యొక్క తూర్పు చివరి భాగంలోని లోతుల్లో ఉండటంతో ఇది ప్రాణాలు ఉన్న ప్రపంచం (కైంగా), ఆధ్యాత్మిక ప్రపంచం పో మధ్య బంధంగా పరిగణించబడుతుంది. తూర్పు భాగంలో చిట్టచివరి పాలినేషియా ద్వీపంగా ఉన్న ఈస్టర్ ఐల్యాండ్ ఉండటంతో దీనిని ప్రాణి ప్రపంచం ముగిసే ప్రాంతంగా కూడా సూచిస్తున్నారు; అయితే ఆల్ఫోన్స్ పినార్ట్ రాసిన వాయేజ్ ఎ ఎల్'ఐల్ డి పాక్వెస్‌‌లో ఈ ద్వీపం పేరు "ది నావెల్ ఆఫ్ ది వరల్డ్" (ప్రపంచం యొక్క నాభి)గా అనువదించబడింది, ఈ రెండో అర్థం ఇప్పుడు వాడుకలో లేదు. కొన్ని మౌఖిక సంప్రదాయాల ప్రకారం, ద్వీపానికి మొదట టె పిటో ఓ టె కైంగా ఎ హావు మేకా లేదా "హావు మేకా యొక్క చిన్న భూభాగం" అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.[6] దీనికి ఉన్న మరో పేరు మేట-కి-టె-రంగీ, దీనికి "ఆకాశాన్ని చూసే కళ్లు" అనే అర్థం వస్తుంది.

ప్రదేశం, భౌతిక భూగోళశాస్త్రం[మార్చు]

ప్రపంచంలో అత్యంత వియుక్త జన సంకీర్ణ ద్వీపాల్లో ఈస్టర్ ఐల్యాండ్ కూడా ఒకటి. దీనికి అతి సమీపంలోని జనావాసాలు గల పొరుగు ద్వీపం పిట్‌కైర్న్ ఐల్యాండ్, పశ్చిమంగా 2075 కీ.మీ. దూరంలో ఉన్న ఈ ద్వీపంలో వంద మంది కంటే తక్కువ సంఖ్యలో పౌరులు నివసిస్తున్నారు. చిలీలోని కాల్డెరా యొక్క అక్షాంశానికి ఇది దగ్గరగా ఉంటుంది; చిలీ ఖండ ప్రాంతానికి పశ్చిమంగా 3510 కీ.మీ. దూరంలో ఇది ఉంది, ఈ రెండు ప్రాంతాల మధ్య అతి కనిష్ఠ దూరం ఉన్న ప్రదేశం లోటా, లెబు మధ్య ఉంది. (తూర్పున 415 కీ.మీ దూరంలో ఐస్లా సాలెస్ వై గోమెజ్ ద్వీపం ఉంది, ఈస్టర్ ఐల్యాండ్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ, ఇది నిర్మానుష్యంగా ఉంది).

ఈ ద్వీపం పొడవు సుమారుగా 24.6 కీ.మీ., అత్యధిక వెడల్పు 12.3 కీ.మీ - దీని యొక్క మొత్త ఆకారం త్రిభుజం మాదిరిగా ఉంటుంది. దీని విస్తీర్ణం 163.6 చదరపు కీ.మీ (63 చదరపు మైళ్లు), గరిష్ఠ ఎత్తు 507 మీటర్లు. తెరెవాకా శిఖరాగ్రానికి సమీపంలో రానో కావు, రానో రారాకు, రానో అరోయి వద్ద మూడు రానో (తాజానీటి అగ్నిపర్వత బిల సరస్సులు) ఉన్నాయి, ఇదిలా ఉంటే ద్వీపంలో ఎటువంటి శాశ్వత ప్రవాహాలు లేదా నదులు లేవు.

శీతోష్ణస్థితి, వాతావరణం[మార్చు]

ఈస్టర్ ద్వీపంలో ఉపఉష్ణమండల సాగర శీతోష్ణస్థితి ఉంటుంది. ద్వీపంలో అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలు జూలై, ఆగస్టు (18 °C or 64 °F) మధ్యకాలంలో నమోదవతాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి (గరిష్ఠ ఉష్ణోగ్రత 28 °C or 82 °F[7])లో నమోదవతాయి, ఈ సమయంలో దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది. శీతాకాలాలు బాగా మందంగా ఉంటాయి. బాగా ఎక్కువగా వర్షాలు పడే మాసం ఏప్రిల్‌కాగా, ఈ ద్వీపంలో ఏడాది పొడవునా వర్షాలు కురుస్తుంటాయి.[8] ఒక వియుక్త ద్వీపంగా ఉన్న ఈస్టర్ ఐల్యాండ్‌లో ఎప్పుడూ పవనాలు వీస్తుంటాయి, ఇక్కడ ఉష్ణోగ్రత బాగా చల్లగా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అవపాతనం ఏడాదికి సగటున 1,118 millimetres or 44 inches నమోదవుతుంది. అప్పుడప్పుడు, ద్వీపంలో భారీ వర్షపాతం నమోదవడంతోపాటు, తుపానులు తాకుతుంటాయి. ఇవి ఎక్కువగా శీతాకాల నెలల్లో (జూన్-ఆగస్టు) సంభవిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్ హైకు దగ్గరగా ఉండటం, ITCZ పరిధికి వెలుపల ఉండటం వలన తుపానులు, పెద్ద గాలివానలు ఈస్టర్ ద్వీపం చుట్టూ ఏర్పడవు.[9]

భూగర్భ శాస్త్రం[మార్చు]

ఈ ద్వీపం యొక్క భూగర్భ శాస్త్రం చల్లారిన అగ్నిపర్వతాలతో ముడిపడివుంది. ఈస్టర్ ఐల్యాండ్ అగ్నిపర్వతాలతో ఏర్పడిన ఎత్తైన ద్వీపం, దీనిలో ప్రధానంగా మూడు చల్లబడిన ఏకీకృత అగ్నిపర్వతాలు ఉన్నాయి: తెరెవాకా (507 మీటర్ల ఎత్తు) అగ్నిపర్వత విస్ఫోటనాలు ఫలితంగా ద్వీపంలో ఎక్కువ ప్రాంతం ఏర్పడింది. మరో రెండు అగ్ని పర్వతాలు పోయికె, రానో కావు విస్ఫోటనాల ద్వారా తూర్పు, దక్షిణ ముఖభూభాగాలు ఏర్పడ్డాయి, వీటి ఫలితంగానే ద్వీపానికి త్రిభుజాకారం వచ్చింది. ఈ ద్వీపంలో వీటితోపాటు అనేక చిన్న అగ్నిపర్వత బిలాలు, ఇతర అగ్నిపర్వత రూపాలు ఉన్నాయి, రానో రారాకు అగ్నిపర్వత బిలం, సిండర్ కోన్ పునా పావు, లావా ట్యూబ్‌లతోపాటు అనేక అగ్నిపర్వత గుహలు ఇక్కడ చూడవచ్చు.[10] తెరెవాకా నుంచి అగ్నిపర్వత పదార్థం ఈస్టర్ ద్వీపంతో పోయికెను కలిపే వరకు అది ఒక ద్వీపంగా ఉండేది. ద్వీపంలో ఎక్కువగా హావైట్, బసాల్ట్ ప్రవాహాలు ఉన్నాయి, వీటిలో ఇనుప ఖనిజం పుష్కలంగా ఉంటుంది, గాలాపోగోస్ ద్వీపాల్లో దొరికే అగ్ని శిలలకు ఇవి సారూప్యంగా ఉంటాయి.[11]

ఈస్టర్ ద్వీపం, పొరుగునున్న మోతు నుయి, మోతు ఐతి వంటి ద్వీపాలు సముద్ర భూతలం నుంచి రెండు వేల అడుగులకుపైగా ఎత్తున్న భారీ అగ్ని పర్వతం శిఖరాగ్రంపై ఉన్నాయి. సాలా వై గోమెజ్ రిడ్జ్‌లో ఇది భాగంగా ఉంది, డజన్లకొద్ది సముద్రపర్వతాలు ఉన్న ఈ పర్వత శ్రేణి పుకావో నుంచి ప్రారంభమై, తరువాత మావోయి, ఈస్టర్ ద్వీపానికి పశ్చిమంగా రెండు సముద్రపర్వతాల మీదగా, నజ్కా రిడ్జ్‌వైపుకు తూర్పుగా 2,700 km (1,700 mi) మేర విస్తరించివుంది.[12]

పుకావో, మావోయి, ఈస్టర్ ద్వీపం గత 750,000 సంవత్సరాల్లో ఏర్పడ్డాయి, చివరిసారి అగ్నిపర్వత విస్ఫోటనం లక్ష సంవత్సరాల క్రితం జరిగింది. ఈస్టర్ హాట్స్‌పాట్ పై ఉన్న నజ్కా ఫలకం ద్వారా ఏర్పడిన సాలా వై గోమెజ్ రిడ్జ్‌లో ఇవి తక్కువ వయస్సున్న పర్వతాలు.[13] ఈస్టర్ విభంగ మండలం యొక్క కార్యకలాపాన్ని దీనికి ప్రత్యామ్నాయ వివరణగా చెప్పవచ్చు. ఈస్టర్ ద్వీపం, దాని యొక్క పరిసర ద్వీపాలు, సాలా వై గోమెజ్ వద్ద మాత్రమే సాలా వై గోమెజ్ రిడ్జ్ పొడి నేలను ఏర్పాటు చేసింది.

వేడి ప్రదేశంపై నజ్కా, గతంలో ఫారాలోన్ ఫలకం చలనం కారణంగా పొడవైన సముద్రగర్భ మిట్ట ఏర్పడింది, దీనిని నజ్కా రిట్జ్ (మిట్ట)గా గుర్తిస్తున్నారు, దీని యొక్క తూర్పు చివర పెరూ కింద ఫలకంలోకి చొచ్చుకుపోయింది.

20వ శతాబ్దం ప్రథమార్ధ భాగంలో, రానో కావు అగ్నిపర్వత బిలం గోడ నుంచి ఆవిరి బయటకు వచ్చింది. దీనిని ద్వీప మేనేజర్ ఎడ్ముండ్స్ ఛాయాచిత్రాలు తీశారు.[2]. భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకారం, ద్వీపంపై చివరి అగ్నిపర్వత కార్యకలాపం 10,000 సంవత్సరాల క్రితం జరిగింది.

చరిత్ర[మార్చు]

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Rapa Nui National Park
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
Moai at Rano Raraku, Easter Island
రకంCultural
ఎంపిక ప్రమాణంi, iii, v
మూలం715
యునెస్కో ప్రాంతంOceanic Continent
శిలాశాసన చరిత్ర
శాసనాలు1995 (19th సమావేశం)

ఈస్టర్ ద్వీపం యొక్క చరిత్ర సుసంపన్నంగా, వివాదాస్పదంగా ఉంది. ఈ ద్వీపవాసులు కరువులు, మహమ్మారి రోగాలు, పౌర యుద్ధం, బానిసల కోసం జరిగిన దాడులు, వలసరాజ్య స్థాపన, అటవీ నిర్మూలనలను చవిచూశారు; వారి జనాభా అనేకసార్లు తీవ్రస్థాయిలో క్షీణించింది. అయితే ఈ ద్వీపవాసులు విడిచిపెట్టిన సాంస్కృతిక వారసత్వం వారి జనాభాకు అసమానమైన గుర్తింపు తీసుకొచ్చింది.

రానో రారాకు సమీపంలోని అహు టోంగారికీ, 15 మోవుయిలు ఉన్న ఈ అహును 1990వ దశకంలో పునరుద్ధరించారు

ఈస్టర్ ద్వీపంలో మొదటి స్థిరనివాసం సుమారుగా 300–400 CE కాలంలో ఏర్పడినట్లు తెలుస్తోంది, హవాయ్‌లో మొదటి స్థిరనివాసాలు ఏర్పడిన సమయం కూడా దాదాపుగాగా ఇదే కాలం కావడం గమనార్హం. అయితే, పాలినేషియాలో ప్రారంభ స్థిరనివాసాలకు సంబంధించిన కాలాలు అన్నీ రేడియోకార్బన్ రసాయన విశ్లేషణతో సవరించబడ్డాయి, ప్రస్తుతం రాపా నుయి ప్రాంతం ఒక్కదానిలోనే సుమారుగా 700-1100 CE మధ్యకాలంలో స్థిరనివాసాలు ఏర్పాటయినట్లు గుర్తిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు టెర్రీ హంట్, కార్ల్ లిపో చేత నిర్వహించబడుతున్న ఒక అధ్యయనం ఇంకా తరువాతి కాలంలో ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పడినట్లు సూచిస్తుంది. వారి వాదన ప్రకారం: ఈస్టర్ ద్వీపంలోని అనకెనా వద్ద ప్రారంభ స్థరశాస్త్రసంబంధ పొరలకు రేడియోకార్బన్ రసాయన విశ్లేషణ, గతంలో నిర్వహించిన రేడియోకార్బన్ రసాయన విశ్లేషణల ప్రకారం ఈ ద్వీపంలో సుమారుగా 1200CE కాలంలోనే వలస రాజ్యం ఏర్పడిందని తెలుస్తోంది. గణనీయమైన పర్యావరణ సంబంధ ప్రభావాలు, స్మారక శిల్పకళపై ప్రధాన సాంస్కృతిక పెట్టుబడులు, విగ్రహాల ప్రతిష్ఠ ప్రారంభ స్థిరనివాసాలు ఏర్పడిన తరువాత కొద్దికాలానికే ప్రారంభమయ్యాయి.[14]

మౌఖిక సంప్రదాయం ప్రకారం మొదటి స్థిరనివాసం అనకెనాలో ఏర్పాటయింది. లోకాలెటా అనకెనా మొదటి నివాస ప్రాంతంగా సాధారణ ఎత్తైన ప్రదేశాల నుంచి ఉత్తమ నివాసాన్ని అందించింది, దోనె పడవలు నిలిపేందుకు, లంగరు వేసేందుకు ఒక ఇసుక తీరంగా ఉపయోగపడింది, అందువలన ఇది ప్రారంభ నివాసాలకు అత్యంత అనుకూలమైన ప్రదేశంగా జారెద్ డైమండ్ రాసిన కొలాప్స్‌ పుస్తకంలో సూచించారు. అయితే, ఈ పరికల్పన రేడియోకార్బన్ రసాయన విశ్లేషణతో విభేదిస్తుంది, రేడియోకార్బన్ విశ్లేషణ ప్రకారం అకనకెనా కంటే అనేక సంవత్సరాల పూర్వమే ఇతర ప్రదేశాల్లో స్థిరనివాసాలు ఏర్పాడ్డాయని తెలుస్తోంది, ముఖ్యంగా తాహాయ్, ఈ ప్రాంతంలో అనకెనా కంటే కొన్ని శతాబ్దాల పూర్వమే స్థిరనివాసాలు ఏర్పడినట్లు రేడియోకార్బన్ విశ్లేషణ సూచిస్తుంది.

3,200 km (2,000 mi) దూరంలో ఉన్న మార్క్యూసాస్ ద్వీపాలు, 2,600 km (1,600 mi) దూరంలో ఉన్న గాంబియర్ ద్వీపాల నుంచి దోనె పడవలు లేదా కాంటామేరాన్‌ల్లో (తెప్పలు) వచ్చిన పాలినేషియన్ జాతీయులతో ఈ ద్వీపంలో జనాభా వృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కెప్టెన్ కుక్ ఈ ద్వీపాన్ని సందర్శించారు, ఆయన సిబ్బందిలో ఒకరు, బోరా బోరా నుంచి వచ్చిన ఒక పాలినేషియన్ కావడం గమనార్హం, అతనికి రాపా నుయ్‌తో మాట్లాడటం వచ్చు. రాపా నుయ్ మాదిరిగానే ఉండే భాష మాంగరెవాన్, ఈ రెండు భాషల్లో పదాలు 80% సారూప్యంగా ఉంటాయి. 1999లో, పునర్నిర్మించిన పాలినేషియన్ పడవలతో సముద్రయానం చేశారు, 19 రోజుల్లో మాంగరెవా నుంచి ఈస్టర్ ద్వీపానికి చేరుకున్నారు.[15]

1860వ దశకంలో మిషనరీలు నమోదు చేసిన మౌఖిక సంప్రదాయాలు ప్రకారం ఈ ద్వీపం మొదట ఒక స్పష్టమైన తరగతి వ్యవస్థను కలిగివుండేది, ఒక అరికీ, అంటే ప్రధాన అధికారి తొమ్మిది ఇతర వర్గాలు, వాటి అధిపతులపై తిరుగులేని అధికారం కలిగివుండేవాడు. ద్వీపం యొక్క అన్వేషకుడు హోటు మాటువా యొక్క వంశంలో పెద్ద వ్యక్తి ఉన్నతాధికారి బాధ్యతల్లో ఉండేవాడు. మోవుయిగా పిలిచే భారీ విగ్రహాల సృష్టి ఈ ద్వీప సంస్కృతిలో ప్రధానంగా కనిపించే అంశంగా ఉంది, చనిపోయిన పూర్వికులకు ఈ విగ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ద్వీపంలో బతికున్నవారికి మరణించినవారితో సహజీవన సంబంధం కలిగివుంటారనే భావన ఉండేది, మరణించినవారు బతికున్నవారికి అవసరమైనవన్నీ సమకూరుస్తారని (ఆరోగ్యం, సారవంతమైన భూమి, జంతువులు, సంపద, తదితరాలు), అలాగే బతికున్నవారు మరణించినవారికి పూజలు చేయడం ద్వారా వారికి ఆత్మల ప్రపంచంలో మెరుగైన స్థానం కల్పిస్తారనే విశ్వాసాలు ఉండేవి. ఎక్కువ స్థిరనివాసాలు తీరం వద్ద ఉండేవి, మోవుయిలు కూడా తీరప్రాంతం వెంబడి ఏర్పాటు చేయబడ్డాయి, ఈ విగ్రహాలను వాటి ముందు శరీర భాగం వారి వారసుల స్థిరనివాసాలను చూస్తున్నట్లుగా, వెనుకభాగం సముద్రంలోని ఆత్మల ప్రపంచంవైపుకు ఉంచి ఏర్పాటు చేసేవారు.

ద్వీపంలో జనాభా ఎక్కువగా పెరిగేకొద్ది, అక్కడ వనరులు నాశనమయ్యాయి, మేటాటోవాగా తెలిసిన పోరాటయోధులు అధిక శక్తిని పొందారు, పురాతన పాలనా విధానానికి తెరపడింది, బర్డ్ మ్యాన్ సమూహం అధికారంలోకి వచ్చింది. ఈ సమూహం కూడా పూర్వికులకు వారి వారసుల ద్వారా గుర్తింపు ఇచ్చినప్పటికీ, బతికున్నవారు మరణించినవారిని కొలిచేందుకు విగ్రహాల ఉపయోగానికి తెరపడింది, ఒక పోటీ ద్వారా మానవులనే ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టారు. మానవులను సృష్టించిన దేవుడిగా భావించే మేక్‌మేక్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర కలిగి ఉన్నాడు. 1919నాటి తన అన్వేషక యాత్రలో ద్వీపం యొక్క సంప్రదాయాలను సేకరించిన కేథరీన్ రౌత్‌లెడ్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం బర్డ్ మ్యాన్ (రాపానుయ్: తంగాట మాను ) కోసం పోటీలు 1760లో మొదలయ్యాయి, ఐరోపావాసులు ఇక్కడికి అప్పటికే చేరుకున్నారు, ఈ సంప్రదాయానికి 1878లో తెరపడింది, 1864లో రోమన్ క్యాథలిక్ మిషనరీలు అధికారికంగా ఇక్కడ మొదటి చర్చిని నిర్మించాయి. ఈస్టర్ ద్వీపంలో బర్డ్ మ్యాన్‌లకు ప్రాతినిధ్యం వహించే రాతిచిత్రాలు కూడా హవాయిలోని రాతిచిత్రాలకు ఉన్న వయస్సునే కలిగివున్నాయి, మొదటి స్థిరనివాసుల ద్వారా ఈ సంప్రదాయం ఇక్కడకు తీసుకురాబడిందనే భావన ఉంది, అయితే పోటీ ఒక్కటే ఈస్టర్ ద్వీపం విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

1722 నుంచి 1770 వరకు ఐరోపావాసులు రాసిన పుస్తకాలు నిలబడివున్న విగ్రహాల గుర్తించి ప్రస్తావిస్తున్నాయి, అయితే 1774లో ఈ ద్వీపానికి చేరుకున్న కుక్ మాత్రం అనేక మోవుయిల తలభాగాలు నేలకొరిగి ఉన్నాయని, యుద్ధంలో ఇవి ధ్వంసం చేయబడినట్లు కనిపించాయని పేర్కొన్నారు.

మోటు నుయ్ ద్వీపం, బర్డ్‌మ్యాన్ సమూహం వేడుకలో ఇది కూడా ఒక భాగం

డైమండ్, హెయెర్‌దాహల్ ద్వీపం చరిత్ర గురించి రాసిన హురి మోవుయి - "విగ్రహాల కూల్చివేత" 1830వ దశకంలో కూడా కొనసాగిందని సూచిస్తుంది, తీవ్రమైన అంతర్గత యుద్ధాల్లో ఇవి కూల్చివేయబడ్డాయని ఈ పుస్తకం తెలియజేస్తుంది. 1838నాటికి చెక్కుచెదరకుండా ఉన్న మోవుయిలు (విగ్రహాలు) ఓరంగోలోని హోవు హాకానానాయి వద్ద ఉన్న రానో రారాకు వాలు ప్రాంతాల్లో, అహు టె పిటో కురాలోని అరికి పారో వద్ద ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలు ఐరోపా-పూర్వ సామాజిక పతనానికి అతికొద్ది స్థాయిలో ఆధారాలను మాత్రమే అందిస్తున్నాయి. వాస్తవానికి, ఆ కాలానికి చెందిన ఈ ద్వీపవాసుల నుంచి సేకరించిన ఎముక లక్షణ శాస్త్రం, ఓస్టెయోమెట్రిక్ సమాచారం హింసాకాండ కారణంగా కొన్ని మరణాలు సంభవించాయని స్పష్టంగా తెలుస్తోంది (ఓవాస్లే, ఇతరులు, 1994).

ద్వీపంతో మొదటి నమోదిత ఐరోపా సంబంధం ఏప్రిల్ 5 (ఈస్టర్ సండే), 1722 నుంచి ఉంది, ఈ రోజు డచ్ నావికుడు జాకబ్ రోగెవీన్ వారం రోజులపాటు ఈ ద్వీపాన్ని సందర్శించారు, ద్వీపంలో 2000 నుంచి 3000 మంది వరకు పౌరులు నివసిస్తున్నట్లు అంచనా వేశారు. సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు, ఒక అపార్థం ఫలితంగా రోగెవీన్ సిబ్బంది స్థానికులపై కాల్పులు జరపడంతో కొందరు పౌరులు వారికి కనిపించకుండా వెళ్లిపోయారు, రోగెవీన్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో 12 మంది ఈ ద్వీపవాసులు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. తరువాతి విదేశీ సందర్శకులైన (1770 నవంబరు 15న) ఇద్దరు స్పెయిన్ నావికులు శాన్ లోరెంజో, శాంటా రోసాలియా రెండు నౌకల్లో ఇక్కడకు చేరుకున్నారు. ఈ ద్వీపంలో ఎక్కువ భాగం సాగు చేయబడటం లేదని, సముద్రతీరం వరుసగా విగ్రహాలతో ఉందని వారు పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత, 1774లో, బ్రిటీష్ అన్వేషకుడు జేమ్స్ కుక్ కూడా ఈస్టర్ ద్వీపాన్ని సందర్శించారు, విగ్రహాలు అశ్రద్ధ చేయబడి ఉన్నాయని, వీటిలో ఎక్కువ విగ్రహాలు నేలకూలిపోయాయని ఆయన తెలిపారు. 1825లో, బ్రిటీష్ నౌక HMS బ్లోజమ్ ఈ ద్వీపానికి చేరుకుంది, తాము సందర్శించిన ప్రదేశాల్లో అన్ని విగ్రహాలు నేలకూలాయని ఈ నౌక సిబ్బంది తెలియజేశారు. 19వ శతాబ్దంలో కూడా అనేకసార్లు ఈస్టర్ ద్వీపాన్ని నావికులు సందర్శించారు, అయితే ఆ తరువాత నుంచి ఈ ద్వీపవాసులు నావికులు ఇక్కడ నౌకలకు లంగరు వేయడాన్ని వ్యతిరేకించారు, అందువలన 1860వ దశకం వరకు దీనికి సంబంధించి అతికొద్ది సమాచారం మాత్రమే ప్రపంచానికి తెలిసింది.

1860వ దశకంలో జరిగిన వరుస ఆక్రమణ దాడుల్లో ఈస్టర్ ద్వీపంలోని జనాభా మొత్తం హత్యలకు గురికావడం లేదా ఖాళీ కావడం జరిగింది. 1862 డిసెంబరులో, బానిసలను పట్టుకునేందుకు పెరూ సైనికులు ఈస్టర్ ద్వీపంపై దండయాత్ర చేశారు. అనేక నెలలపాటు హింసాత్మక అపహరణలు జరిగాయి, చివరకు ద్వీపం యొక్క సగం జనాభా అయిన 1500 మంది పురుషులు, మహిళలను వారు బలవంతంగా తీసుకెళ్లారు.[16] వీరు నిర్బంధించిన పలువురు ప్రధాన వ్యక్తుల్లో ద్వీపం యొక్క పారామౌంట్ చీఫ్, ఆయన వారసుడు, ఈస్టర్ ద్వీపం యొక్క రోంగోరోంగో లిపిని చదవడం, రాయడం తెలిసిన వ్యక్తులు ఉన్నారు, పాలినేషియా లిపికి సంబంధించి ఈ రోజుకు మిగిలివున్న ఆధారం ఇదొక్కటే కావడం గమనార్హం. బానిసలకోసం దాడులు చేసే సైనికులు అనేక పాలినేషియా ద్వీపాల్లో బంధించిన పౌరులను మాతృదేశానికి పంపేవారు, వారు మశూచితో బాధపడుతున్న రోగులను అతి కొద్దిమంది పౌరులతో కలిపి ప్రతి ద్వీపం నుంచి తీసుకెళ్లారు, దీంతో ఈస్టర్ ద్వీపం నుంచి మార్క్యూసాస్ ద్వీపాల వరకు తీవ్రమైన మహమ్మారులు వ్యాపించాయి. ఈస్టర్ ద్వీపం యొక్క జనాభా చనిపోయినవారిని పూడ్చిపెట్టలేని స్థితికి క్షీణించింది. 1800వ శతాబ్దం మధ్యకాలంలో తిమింగళాలు వేటాడే మత్స్యకారులతో వ్యాపించిన ట్యూబర్‌కులోసిస్ (టీబీ) కారణంగా అనేక మంది ద్వీపవాసులు మరణించారు, మొదటి క్రైస్తవ మతప్రచారకుడు యుగెన్ ఐరౌడ్ ఈ వ్యాధి కారణంగా 1867లో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు ద్వీపం యొక్క నాలుగోవంతు జనాభా ఈ వ్యాధి బారినపడింది. తరువాతి సంవత్సరాల్లో, గొర్రెల పెంపక కేంద్రాల నిర్వాహకులు, మిషనరీలు మరణించినవారి భూములను కొనుగోలు చేయడం ప్రారంభించారు, దీంతో ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర పోరాటాలు జరిగాయి.

"క్వీన్ మదర్" తన కూతుళ్లు కారోలిన్, హారియెట్‌లతో కోరెటో, 1877నాటి చిత్రం

హాంగా రోవా పరిసర ప్రాంతాన్ని మిషనరీల నుంచి జీన్-బాప్టిస్ట్ డుట్‌రౌ-బోర్నీర్ కొనుగోలు చేశారు, ఇక్కడ ఉన్న సుమారుగా రెండు వందల మందిని రూపానుయ్‌లను తాహితీలో పనిచేసేందుకు తరలించారు. 1871లో మిషనరీలు అన్నీ పతనమయ్యాయి, డుట్రౌ బోర్నీర్ 171 మందిని మినహా మిగిలినవారందరినీ ఖాళీ చేయించి గాంబీర్ ద్వీపాలకు తరలించారు.[17] ఇక్కడ మిగిలివున్న పౌరుల్లో ఎక్కువ మంది వృద్ధులు కావడం గమనార్హం. ఆరు సంవత్సరాల తరువాత, ఈస్టర్ ద్వీపంలో 111 మంది పౌరులు మాత్రమే మిగిలివున్నారు, వీరిలో 36 మందికి మాత్రమే వారసులు ఉన్నారు.[18] ఈ స్థితి నుంచి ప్రస్తుత రోజు వరకు, ద్వీపంలో జనాభా కొద్దికొద్దిగా పుంజుకుంది. అయితే 97% జనాభా మరణించడం లేదా దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే ద్వీపాన్ని విడిచివెళ్లడం జరిగింది, దీంతో ద్వీపం యొక్క సాంస్కృతిక పరిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది.

"ద్వీప విలీనీకరణ ఒప్పందం" (Tratado de Anexión de la isla)తో పొలికార్పో టోరో చేత 1888 సెప్టెంబరు 9న ఈస్టర్ ద్వీపాన్ని చిలీలో కలపబడింది. టోరో తరువాత నుంచి చిలీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ అటాము టెకెనాతో ఒప్పందంపై సంతకం చేశారు, ఆయనకు చిలీ ప్రభుత్వం పారామౌంట్ అధిపతి, ఆయన వారసుడు మరణించిన తరువాత ఈస్టర్ ద్వీపం రాజు హౌదా ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క చెల్లుబాటును ఈరోజు కొందరు రాపానుయ్‌లు వ్యతిరేకిస్తున్నారు.

1960వ దశకం వరకు, జీవించివున్న రాపానుయ్‌లు హాంగా రోవా ప్రాంతానికి పరిమితమై ఉన్నారు, 1953 వరకు గొర్రెల పెంపక కేంద్రం కోసం మిగిలిన ద్వీప భాగమంతా విలియమ్సన్-బాల్‌ఫోర్ కంపెనీకి అద్దెకు ఇవ్వబడింది.[19] ఈ ద్వీపాన్ని తరువాత 1966 వరకు చిలీ నావికా దళం నిర్వహించింది, ఈ సమయంలోనే ద్వీపం పూర్తిస్థాయిలో తిరిగి తెరవబడింది. 1966లో, రాపానుయ్ పౌరులు చిలీ పౌరసత్వం పొందారు.[20]

జులై 30, 2007న, రాజ్యాంగ సంస్కరణ ఈస్టర్ ద్వీపం, జువాన్ ఫెర్నాండెజ్ ద్వీపాలకు (దీనిని రాబిన్సన్ క్రూజ్ ద్వీపంగా కూడా దీనిని గుర్తిస్తారు) చిలీ ప్రత్యేక భూభాగాల హౌదా పొందాయి. ప్రత్యేక ప్రాంతంగా శాసనం చేయబడినప్పటికీ, ఈ ద్వీపం వాల్‌పారైసో యొక్క ఐదో ప్రాంతంలో ఒక ప్రావీన్స్‌గా పాలించబడటం కొనసాగుతుంది.[21]

జులై 11, 2010న 18:15:15 సమయంలో ఈస్టర్ ద్వీపంలో గత 1300 సంవత్సరాల్లో తొలిసారి ఒక సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించింది.[22]

ఆవరణశాస్త్రం[మార్చు]

అంతరిక్షం నుంచి ఈస్టర్ ద్వీపం దృశ్యం, 2001.కుడివైపు పోయికే ద్వీపకల్పం.

ఈస్టర్ ద్వీపాన్ని, దీనికి అతిసమీపంలో తూర్పువైపున 415 kilometres (258 mi) దూరంలో ఉన్న ఐస్లా సాలా వై గోమెజ్ యొక్క అతి చిన్న ద్వీపాన్ని కలిపి ఆవరణ శాస్త్రవేత్తలు ఒక విలక్షణ ఆవరణ ప్రాంతం గుర్తిస్తున్నారు, ఈ ఆవరణ ప్రాంతాన్ని రాపా నుయ్ ఉపఉష్ణమండల వెడల్పు ఆకుల అడవులుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఉన్న అసలు ఉపఉష్ణమండల తేమతోకూడిన వెడల్పు ఆకుల అడవులు ఇప్పుడు అదృశ్యమయ్యాయి, అయితే శిలాజాలు, పుప్పొడి, లావా ప్రవాహాల ద్వారా సూచించబడుతున్న చెట్టు నమూనాలపై జరిపిన పాలెయోబోటానికల్ అధ్యయనాలు ఈ ద్వీపంలో గతంలో అడవులు ఉన్నట్లు, చెట్లు, పొదలు, మొక్కలు, గడ్డి జాతులు ఇక్కడ ఉండేవని సూచిస్తున్నాయి. ఇప్పుడు అంతరించిపోయిన తాటిచెట్టు, చిలీకి చెందిన వైన్ తాటి చెట్టు (జుబీయా చిలెన్సిస్)తో అనుబంధం ఉన్న పాస్చాలోకోకోస్ డిస్పెర్టా ఇక్కడ ప్రధానంగా ఉన్న మొక్కలని శిలాజాలు తెలియజేస్తున్నాయి, దీని యొక్క చిలీ అనుబంధ చెట్టు మాదిరిగానే ఇది కూడా కౌమర ఎత్తుకు చేరుకునేందుకు సుమారుగా 100 ఏళ్లు పట్టేది. టోనీ హంట్, ఇతరులు నిర్వహించిన పరిశోధనల్లో పాలినేషియన్ ఎలుకలను ప్రారంభ వాసులు తమతోపాటు ఇక్కడకు తీసుకొచ్చారు, ఈ ఎలుకలు రాపానుయ్ తాటి చెట్టు అంతరించిపోవడానికి ప్రధాన కారణమైందని పరిశోధకులు చెబుతున్నారు. గుహల్లో లేదా వివిధ ప్రదేశాల్లో త్రవ్వితీసిన 99% గింజలపై ఎలుక దంతాల గుర్తులు కనిపిస్తాయి, దీనితో పాలినేషియన్ ఎలుక పామ్ చెట్ల పునరుత్పత్తికి భంగం కలిగించినట్లు ఆధారాలు లభించాయి. ఇదిలా ఉంటే స్థిరనివాసాలు ఏర్పాటు చేసేందుకు స్థానికులు తాటిచెట్లను నరికివేయడం కూడా అవి అంతరించిపోవడానికి ఒక కారణం, ఈ కారణాలతో సుమారుగా ఇప్పటికి 350 సంవత్సరాలకు పూర్వం ఇవి పూర్తిగా అంతరించిపోయాయి.[23] టోరోమిరో చెట్టు (సోఫోరా టోరోమిరా) చరిత్రపూర్వకాలంలో ఈస్టర్ ద్వీపంలో ఉండేది, ఇప్పుడు అడవుల్లో అది అంతరించిపోయింది. ఇదిలా ఉంటే రాయల్ బోటానిక్ గార్డెన్స్, కెవ్, గోటెబోర్గ్ బోటానికల్ గార్డెన్ సంయుక్తంగా ఈస్టర్ ద్వీపంలో టోరోమిరోను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన శాస్త్రీయ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నాయి. తాటి, టోరోమిరో చెట్లు పూర్తిగా నశించిపోవడంతో, తక్కువ సంక్షేపణం కారణంగా ఇక్కడ గణనీయమైన స్థాయిలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. సుమారుగా శతాబ్దానికిపైగా ద్వీపాన్ని వేలాది గొర్రెలను పెంచేందుకు ఉపయోగించిన తరువాత, 1900వ శతాబ్దం మధ్యకాలానికి ఇక్కడ ఎక్కువ ప్రాంతం ప్రధానంగా గడ్డిభూములతో నిండివుంది, రానో రారాకు, రానో కావు వద్ద ఉన్న అగ్నిపర్వత బిల సరస్సుల్లో నగాటు లేదా బుల్‌రష్ (షోయ్నోప్లెక్టస్ కాలిఫోర్నికస్ టాటోరా ) కనిపిస్తాయి. ఆండిస్‌లో టోటోరా అని పిలిచే ఈ రెల్లు గడ్డి ఉండటం విగ్రహాలు నిర్మించినవారికి దక్షిణ అమెరికా మూలాలు ఉన్నాయనే వాదనకు మద్దతుగా ఉంది, అయితే సరస్సు మడ్డిలో సేకరించిన పుప్పొడిపై జరిపిన విశ్లేషణలో ఈ రెల్లు గడ్డి ఈస్టర్ ద్వీపంలో 30,000 సంవత్సరాలుగా పెరుగుతున్నట్లు నిర్ధారించారు.[ఆధారం చూపాలి] మానవులు అడుగుపెట్టక ముందు, ఈస్టర్ ద్వీపంలో అనేక సముద్రపక్షుల సమూహాలు ఉండేవి, ఇక్కడ బహుశా 30 నివాస జాతులు ఉన్నట్లు భావిస్తున్నారు, ప్రపంచంలోనే అత్యంత సమృద్ధ ప్రాంతంగా దీనిని గుర్తించారు.[24] ఇప్పుడు ప్రధాన భూభాగంలో ఇటువంటి సమూహాలు కనిపించవు. ఐదు జాతుల భూమి పక్షులు (రెండు రైల్స్, రెండు చిలుకలు, ఒక కొంగ జాతులు) కూడా గతంలో ఇక్కడ ఉండేవని శిలాజ ఆధారాలు తెలియజేస్తున్నాయి, అయితే ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోయాయి.[25]

శరీరం యొక్క సాధారణ రోగనిరోధక శక్తిని తగ్గించే మందు సిరోలిమస్‌ను ఈస్టర్ ద్వీపంలో సేకరించిన ఒక మట్టి నమూనాలో స్ట్రెప్టోమైసెస్ హైగ్రోస్కోపికస్ అనే బ్యాక్టీరియాలో మొట్టమొదట గుర్తించారు. ఈ మందును రాపామైసిన్ అని కూడా పిలుస్తారు, రాపా నుయ్ పేరు మీదగా దానికి ఆ పేరు వచ్చింది.[26] చిట్టెలుకల్లో దీర్ఘాయుర్దాయాన్ని పొడిగించేందుకు ఇది ఉపయోగపడుతుందనే భావనపై పరిశోధనలు జరుగుతున్నాయి.[27]

Panorama of Anakena beach, Easter Island. The moai pictured here was the first to be raised back into place upon its ahu in 1955 by islanders using the ancient method.
Panorama of Anakena beach, Easter Island. The moai pictured here was the first to be raised back into place upon its ahu in 1955 by islanders using the ancient method.

ఆధునిక ఈస్టర్ ద్వీపంలో చెట్లు అక్కడక్కడ కనిపిస్తాయి, ప్రకృతిసిద్ధమైన పొదలు చాలా అరుదుగా పెరుగుతాయి, స్థానిక ఈస్టర్ ద్వీపవాసులు తమ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు,[28] జనాభామితిమీరి పెరగడంతో నిలదొక్కుకోవడం కోసం ఇక్కడ అడవులను పూర్తిగా నిర్మించారని వాదనలు ఉన్నాయి.[ఆధారం చూపాలి] కొన్ని విగ్రహాలను "Y" ఆకారంలో చెక్కిన కలప దిమ్మెలపై ఉంచి తీసుకెళ్లేవారు, వీటిని మిరో మంగా ఎరువాగా పిలిచేవారు, తరువాత ఈ దిమ్మెలపై విగ్రహాలను వాటిని ప్రతిష్ఠించే ప్రదేశాలకు రవాణా చేసేవారని ఎక్స్‌పెరిమెంటల్ ఆర్కియాలజీ సూచించింది.[28] "నిచ్చెనలు" ఉపయోగించి (సమాంతర చెక్క పట్టాలు) విగ్రహాలను లాగుతూ తీసుకెళ్లారని ఇతర సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి.[29] రాపానుయ్ సంప్రదాయాలు రూపాలంకారికంగా ఆధ్యాత్మిక శక్తి (మనా)ను సూచిస్తున్నాయి, మోవుయిలను గనుల నుంచి తీసురావడాన్ని ఇది వివరిస్తుంది.

ద్వీపం యొక్క దక్షిణ అక్షాంశం వద్ద కొద్ది స్థాయిలో మంచు యుగాన్ని తలపించే వాతావరణ ప్రభావాలు (1650 నుంచి 1850 వరకు) అటవీ నిర్మూలనకు కారణమైనట్లు భావనలు ఉన్నాయి, అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటికీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.[28] అనేక మంది పరిశోధకులు [ఫిన్నే (1994), హంటర్ ఆండర్సన్ (1998); పి.డి. నున్ (1999, 2003); ఓర్లియాక్, ఓర్లియాక్ (1998)] కొద్దిస్థాయిలో మంచు యుగ పరిస్థితులకు కారణమైన వాతావరణ తిరోగమనం వనరులు ఒత్తిడి సమస్యకు ఒక కారణమని సూచిస్తున్నారు, ద్వీపంలో తాటి చెట్లు కనుమరుగవడానికి ఇది కూడా కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే నిపుణులు ద్వీపంలో తాటి చెట్లు ఎప్పుడు పూర్తిగా అదృశ్యమయ్యాయనే దానిపై ఏకాభిప్రాయం కలిగిలేరు.

జారెద్ డైమండ్ ద్వీపంలో అటవీ నిర్మూలనకు వాతావరణ మార్పు ప్రధాన కారణమనే వాదనను తోసిపుచ్చారు, ఆయన తన పుస్తకం కొలాప్స్‌లో పురాతన ఈస్టర్ ద్వీపవాసుల పతనంపై తన వివరణను ఇచ్చారు. థోర్ హెయెర్దాహల్ యొక్క ఈస్టర్ ద్వీప చరిత్ర యొక్క శృంగార వివరణ ప్రభావంతో (కొలాప్స్ రెండో అధ్యాయంలో ఇది కనిపిస్తుంది), ద్వీపంలో చెట్లు అంతరించిపోవడం, ఆ ద్వీపంలో 17, 18వ శతాబ్దాల్లో నాగరికత పతనం సమయంలో జరిగివుండవచ్చని డైమండ్ పేర్కొన్నారు. ఈ సమయంలో వారు విగ్రహాలు పెట్టడం నిలివేయడంతోపాటు, అహును నాశనం చేయడం ప్రారంభించారని వాస్తవంతో దీనికి సంబంధం ఏర్పరిచారు. బర్డ్ మ్యాన్ సమూహం అన్వేషకులు, తిమింగలాలు వేటాడేవారు, గంధపు చెట్ల వ్యాపారాలు, బానిసల కోసం దాడులు చేసినవారి చేత బాగా లాభపడటం, వారు చేసిన దాడుల నుంచి మనుగడ సాధించడం కొనసాగించడంతో ఈ వాదన బలహీనపడింది.

వేటాడే పడవలు నిర్మించే సామర్థ్యాన్ని ఈ ద్వీపవాసులు కోల్పోవడం, పక్షులు అవి గూళ్లు కట్టుకునే చెట్లు లేకపోవడంతోపాటు, చేపలు, పక్షుల సంఖ్య కూడా ఆకస్మికంగా తగ్గిపోయిందని మిడెన్ వాదించారు. చెట్లు లేకపోవడం వలన కొన్ని ప్రదేశాల్లో భూమి కోత స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక చెట్లలో సగ భాగం అంతరించిపోయిందని, ద్వీపంపై వృక్షజాలం నాటకీయంగా మారిపోయిందని అవక్షేప నమూనాలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాలినేషియన్‌లు ప్రధానంగా రైతులుగా స్థిరపడ్డారు, వారు మత్య్సకారులు కాదు,, వారి ఆహారంలో ప్రధానంగా పండించిన పదార్థాలు, అంటే టారో దుంపలు, తియ్యటి బంగాళాదుంపలు, చిలగడదుంపలు, కర్రపెండలం, అరటి పండ్లు ఉండేవి, ప్రోటీన్ ఆహారంగా చేపల కంటే వారు కోళ్లపై ఎక్కువగా ఆధారపడ్డారు. సమృద్ధి, కరువు రెండు రకాల సమయాల్లో పాలినేషియన్ ద్వీపవాసుల అందరిలో నరమాంస భక్షణ కూడా అలవాటయింది, అందువలన ఇది ఈస్టర్ ద్వీపంలో కూడా జరిగివుండే అవకాశం ఉంది (వంట ప్రదేశాల్లో, ముఖ్యంగా గుహల్లో దొరికిన మానవ అవశేషాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి), అయితే ఇక్కడ నాగరికత పతనం కావడానికి ఇది మంచి ఆధారం కాదు.[ఆధారం చూపాలి]

ద్వీపం లోపలివైపుకు కనిపించే దృశ్యం

బెన్నీ పీసెర్ తన యొక్క "ఫ్రమ్ జెనోసైడ్ టు ఎకోసైడ్: ది రేప్ ఆఫ్ రాపా నుయ్" అనే కథనంలో ఐరోపావాసులు మొదట ఈ ద్వీపానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వీయ-సమృద్ధి ఉందని ఆధారాన్ని సూచించారు. ఈ ద్వీపంలో ఇప్పటికీ చిన్న చెట్లు ఉన్నాయి, అవి ప్రధానంగా టోరోమిరో, ఇవి 20వ శతాబ్దంలో అంతరించిపోవడం మొదలైంది, ద్వీపం యొక్క పర్యావరణ వ్యవస్థలో మార్పులు, బాగా నెమ్మదైన పెరుగుదల కారణంగా ఈ పరిణామం ఏర్పడింది. జాకబ్ రోగెవీన్ యొక్క కెప్టెన్ కార్నెలిస్ బౌమాన్ తన యొక్క లాగ్ బుక్..లో చిలగడదుంపలు, అరటిపండ్లు, చిన్న కొబ్బరి చెట్లు తాము కొద్ది స్థాయిలో చూసినట్లు పేర్కొన్నారు, ఇతర చెట్లు లేదా పంటలు అక్కడ తమకు కనిపించలేదన్నారు. రోగెవీన్ అధికారి కార్ల్ ఫ్రైడ్‌రిచ్ బెహ్రెన్స్ శాంతి కానుకలుగా స్థానికులు తమకు తాటిచెట్టు కొమ్మలు అందించారని పేర్కొన్నారు. మానవజాతి శాస్త్ర నిపుణుడు ఆల్ఫ్రెడ్ మెట్రౌక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ కనిపించే అత్యంత సాధారణ రకం గృహాన్ని "హారె పెగ్నా" అని పిలుస్తారు, ప్రస్తుతం వీటిని "బోట్ హౌస్"గా గుర్తిస్తున్నారు, ఎందుకంటే వీటి పైకప్పు బోర్లవేసిన పడవ మాదిరిగా ఉంటుంది. ఇళ్లకు పునాదులగా పూడ్చిపెట్టిన బసాల్ట్ దిమ్మెలు ఉండేవి, ఈ దిమ్మెలకు చెక్క గుంజలు నిలబెట్టేందుకు రంధ్రాలు ఉంటాయి, ఇంటి యొక్క వెడల్పు మొత్తం ఈ గుంజలను ఒకదానితో ఒకటి కలుపుతారు. వీటిని తరువాత టోటోరా (ఒకరకమైన గడ్డి) రెల్లుతో కప్పేవారు, ఆపై చెరకు ఆకులతో ఒక పొరను, చివరగా అల్లిన గడ్డి పొరను పైనకప్పుతారు. పెద్ద తాడిచెట్ల అడుగుమానులను కూడా తాము చూసినట్లు ఐరోపా సందర్శకులు పేర్కొన్నారు.[ఆధారం చూపాలి] ఆ సమయంలో కూడా గణనీయమైన స్థాయిలో పెద్ద చెట్లు ఉండేవని ఈ నివేదికలు సూచిస్తున్నట్లు పీసెర్ పరిగణించారు, పైన బౌమాన్ వెల్లడించిన విషయాలకు ఇది విరుద్ధంగా ఉంది. ద్వీపం లోపల, కొండపాదాల వద్ద, లావా ప్రదేశాల లోపల, బలమైన ఉప్పు గాలుల నుంచి రక్షించబడే ఇతర ప్రదేశాల్లో మొక్కలు పెంచేవారని భావనలు ఉన్నాయి, ఎందుకంటే తీరానికి సమీప ప్రాంతాలు ఉప్పు జల్లుతో ప్రభావితమయ్యేవి. అనేక మంది ఐరోపావాసులు ద్వీపం లోపలి ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నించలేదు, ముఖ్యంగా విగ్రహాలు తయారు చేసేందుకు రాళ్ల సేకరణకు ఉపయోగించిన గని వద్దకు కూడా వెళ్లలేదు, ఈ గని తీరం నుంచి ఒక కిలోమీటరు దూరంలోనే ఉండటం గమనార్హం, అంతేకాకుండా 100 m (328.08 ft) ఎత్తు ఉన్న ఒక ఆకర్షణీయమైన పర్వత శిఖరాన్ని 1800వ దశకం వరకు ఐరోపావాసులు గుర్తించలేదు.

ఈస్టర్ ద్వీపం ఇటీవల సంవత్సరాల్లో భారీస్థాయి భూమి కోతను ఎదుర్కొంది, బహుశా వ్యవసాయం, తీవ్రమైన అటవీ నిర్మూలన ఫలితంగా ఈ కోత ఏర్పడింది. ఈ ప్రక్రియ క్రమక్రమంగా జరిగినట్లు తెలుస్తోంది, అయితే 20వ శతాబ్దంలో ఎక్కువ కాలం ఇక్కడ విలియమ్సన్-బాల్‌ఫోర్ కంపెనీ యొక్క విస్తృతస్థాయి గొర్రెల పెంపకం ద్వారా భూమి కోత వేగవంతమయింది. జాకబ్ రోగెవీన్ ఈస్టర్ ద్వీపం బాగా సారవంతమైన ప్రదేశమని పేర్కొన్నారు. అక్కడివాసులకు కోళ్లు మాత్రమే పెంపుడు జంతువులుగా ఉన్నాయని తెలియజేశారు. వారు అరటి, చక్కెర, తియ్యటి బంగాళాదుంపలు పండించేవారు. 1786లో జీన్-ఫ్రాంకోయిస్ డి లా పెరౌస్ ఈ ద్వీపాన్ని సందర్శించారు, ఆయన సంరక్షకుడు జనాభా ఇక్కడ నివసించడానికి ఏడాదికి మూడు రోజుల పని సరిపోతుందని ప్రకటించారు.

1786లో పెరౌస్ అన్వేషక యాత్రలో ఒక మేజర్‌గా ఉన్న రోలిన్ ఈ విధంగా రాశారు, కరువుతో తీవ్రంగా ప్రభావితమైన వ్యక్తులను తాను ఇక్కడ కలుసుకున్నప్పటికీ... గణనీయమైన జనాభాను ఈ ద్వీపంలో చూశాను, తరువాత నేను చూసిన మిగిలిన అన్ని ద్వీపాల కంటే ఇక్కడ మరింత అందం, సోయగాన్ని ఇక్కడ చూశానని పేర్కొన్నారు; భూమి, తక్కువ కూలీల అవసరం, అద్భుతమైన వనరులు, పౌరులకు అవసరమైనదాని కంటే సమృద్ధి కనిపించాయని చెప్పారు.[30]

డైమండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుత ద్వీపవాసుల మౌఖిక సంప్రదాయాల్లో (రౌత్‌లెడ్జ్, లావాచెరీ, మెట్రౌక్స్, పీసెర్, ఇతరులు వీనిలో నిజానిజాలను ప్రశ్నించారు) నరమాంస భక్షణ యావ కనిపిస్తుంది, ఆయన దీనిని వేగంగా సమాజం పతనం అవడానికి ఆధారంగా సూచించారు. ఉదాహరణకు, ఇక్కడి పౌరులు శత్రువును తీవ్రంగా అవమానపరిచేందుకు "నీ తల్లి కాలి కండరాన్ని తింటానని అనేవారని" ఆయన పేర్కొన్నారు (డైమండ్, 1995). అంటే చివరకు పౌరులకు ఆహార సరఫరా నిలిచిపోయిందని డైమండ్ వాదించారు;[31] అయితే నరమాంస భక్షణ పాలినేషియా సంస్కృతుల్లో బాగా విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆయన నిర్ధారణను పరికల్పనగానే భావిస్తున్నారు.[32] మట్టి పాత్రల్లో మానవుల ఎముకలు కనిపించలేదు, మతపరమైన వాటిలో మాత్రమే కనిపించాయి, అందువలన నరమాంస భక్షణ అనేది ఈస్టర్ ద్వీపంలో ఒక కర్మసంబంధ ఆచారంగా మాత్రమే ఉండేదని తెలుస్తోంది. సమకాలీన మానవజాతి పరిశోధనలో ఎక్కడా నరమాంస భక్షణ ఆచారం యొక్క గణనీయమైన లేదా విశ్వసించదగిన ఆధారం దాదాపుగా ఏదీ కనిపించలేదని నిర్ధారించబడింది, ఎటువంటి సమయంలోనూ ఇటువంటి ఆచారానికి నమ్మదగిన ఆధారం లేదని సూచించారు (ఫ్లెన్లే, బాహన్, 2003). ఈస్టర్ ద్వీపం యొక్క మొదటి శాస్త్రీయ అన్వేషణలో (1914) స్థానిక జనాభా తమ పూర్వీకులు నరమాంస భక్షకులనే ఆరోపణలను బలంగా తిరస్కరించినట్లు నమోదు చేయబడింది (రౌట్‌లెడ్జ్ 1919).

సంస్కృతి[మార్చు]

దస్త్రం:Easter Island cave.jpg
బర్డ్‌మెన్ (తంగాటా మను) చిత్రలేఖనాలు, ఈ గుహను కేవ్ ఆఫ్ ది మెన్ ఈట్రెస్సెస్ అని కూడా పిలుస్తారు

పురాణాలు[మార్చు]

ఈ ద్వీపానికి చెందిన అత్యంత ప్రధాన పురాణాలు:

  • తంగాట మను, 1860 వరకు ఆచరించబడిన బర్డ్‌మ్యాన్ సంప్రదాయం.
  • మేక్‌మేక్, ఒక ముఖ్యమైన దేవుడు.
  • అకు-అకు, పవిత్ర కుటుంబ గుహల యొక్క సంరక్షకులు.
  • మోవుయి-కావా-కావా, హానౌ ఎపి యొక్క ఒక దెయ్యపు మనిషి (ఇతనికి పొడవైన చెవులు ఉంటాయి).
  • హెకై ఐతే ఉము పారే హావోంగా టాకాపు హానౌ ఎపి కై నోరుయెగో, ఒక కుటుంబం గుహలోకి ప్రవేశించే ముందు అకు-అకును ప్రసన్నం చేసుకునేందుకు పలికే ఒక పవిత్ర మంత్రం.

రాతి పని[మార్చు]

రాపా నుయ్ పౌరులకు రాతి యుగపు నాగరికత ఉంది, స్థానిక రాళ్లను వివిధ రకాలుగా వారు ఉపయోగించారు:

  • బసాల్ట్, ఇది ఒక దృఢమైన, దట్టమైన రాయి, దీనిని టోకీకి, కనీసం ఒక మోవుయి కోసం ఉపయోగించారు.
  • అబ్సిడియాన్, పదునైన అంచులతో ఉండే అగ్నిపర్వత లావాతో ఏర్పడిన గాజు పెంకు, దీనిని మేటా వంటి పదునైన సాధనాలు తయారు చేసేందుకు ఉపయోగించారు, వీటిని మోవుయి యొక్క కళ్లలో కంటిపాప చుట్టూ ఉండే నల్లటి పొర కోసం కూడా ఉపయోగించారు.
  • పునా పావుకు చెందిన రెడ్ స్కోరియా, ఇది బాగా తేలికైన ఒక ఎరుపు రాయి, కొన్ని మోవుయి, పుకావో కోసం ఉపయోగించారు.
  • రానో రారాకు వద్ద దొరికే టుఫ్, బసాల్ట్ కంటే సులభంగా పనిచేయగల రాయి, మోవుయిల్లో అనేకవాటికి ఈ రాయినే ఉపయోగించారు.

మోవుయి (విగ్రహాలు)[మార్చు]

పెద్ద రాతి విగ్రహాలు లేదా మోవుయి కారణంగా ఈస్టర్ ద్వీపం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది, వీటిని 1100-1680 CEలో చెక్కారు (రేడియో-కార్బన్ పరీక్షల ద్వారా నిర్ధారించడం జరిగింది). ఇప్పటివరకు ద్వీపంపై, మ్యూజియం సేకరణల్లో మొత్తం 887 ఏకశిలా విగ్రహాలను గుర్తించారు.[33] "ఈస్టర్ ఐల్యాండ్ హెడ్స్"గా కూడా వీటిని తరచుగా గుర్తిస్తున్నప్పటికీ, ఈ విగ్రహాలు వాస్తవానికి పూర్తిగా తల, మొండం వరకు మాత్రమే ఉన్న శిల్పాలు, కాళ్లపై కూర్చొని ఉన్నట్లు ఉండే ఈ విగ్రహాల చేతులు ఉదరభాగంపై ఉంటాయి. కొన్ని నిలబడే ఉండే మోవుయిలు అస్థిరమైన భూముల చేత మెడల వరకు కూరుకుపోయాయి.

దాదాపుగా అన్ని (95%) మోవుయిలను ప్రత్యేకంగా, సంక్షిప్తంగా, ఘనీభవించిన అగ్నిపర్వత బూడిద, టఫ్పై సులభమైన పనితనంతో రూపొందించారు, చల్లారిన అగ్నిపర్వతం రానో రారాకు లోపల ఒకే ప్రదేశం నుంచి ఈ విగ్రహాలన్నింటికీ శిలలను సేకరించడం జరిగింది. స్థానిక ద్వీపవాసులు ఈ విగ్రహాలను రాతి పనిముట్లతో, ముఖ్యంగా బసాల్ట్ టోకీ తో చెక్కారు, ఈ గనిలో ఇప్పటికీ ఆ పనిముట్లు కనిపిస్తాయి. రాతి ఉలులకు పదును తగ్గిన తరువాత వాటికి తిరిగి పదును పెట్టేవారు. మోవుయిని మలిచే అగ్నిపర్వత రాయిని సేకరించే ముందు మొదట దానిని తడిపి మెత్తబరిచేవారు, చెక్కడం ప్రారంభమైన తరువాత కూడా అవసరమైనప్పుడు శిలను మెత్తబరిచేందుకు తడుపుతూ ఉండేవారు. ఒకే సమయంలో వివిధ విగ్రహాలపై అనేక బృందాలు పనిచేసేవి, ఒక మోవుయిని చెక్కేందుకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యుల బృందం అవసరమవుతుంది, వీరు ఏడాదిపాటు పనిచేసి దీనిని రూపొందించేవారు. ప్రతి విగ్రహం వంశక్రమంలో మరణించిన వ్యక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

తుకుతురి, ఒక అసాధారణ కాళ్లపై కూర్చొని ఉన్న మోవుయి
హోంగా రోవా వద్ద రెండు అహులు. అహు కో టె రికు ముందు ప్రదేశం (దాని తలపై పుకోవో ఉంటుంది).మధ్యలో చూస్తే ఒక అహు పక్కగా ఐదు మోవుయిలతో ఉన్న గోడ, వేదిక,, బాటను చూడవచ్చు.
అహు అకీవీ, భూభాగంలో ఉన్న అతికొద్ది అహుల్లో ఇది కూడా ఒకటి, సముద్రాన్ని చూసే మోవుయి దీనిపై ఉంది

కేవలం నాలుగోవంతు విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించబడ్డాయి, సగం విగ్రహాలు ఇప్పటికీ రానో రారాకు వద్ద గనిలో ఉన్నాయి, మిగిలినవి ద్వీపంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపిస్తాయి, బహుశా వాటిని తుది స్థాపన ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఉండవచ్చు. ఈ ద్వీపంపై సృష్టించబడిన అతిపెద్ద మోవుయి "పారో", ఇది 82 టన్నుల బరువు, 9.8 m (32.15 ft) పొడవు ఉంటుంది.[34] దీనికి సమానమైన బరువు గల అనేక ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి, వీటిని ఉత్తర, దక్షిణ తీరాల్లోని అహుకు తరలించారు. విగ్రహాలను వారు ఏ విధంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లారనేది ఇప్పటికీ తెలియరాలేదు, అయితే కొందరు మిరో మంగా ఎరువా అనే "అడ్డ భాగాలు గల Y ఆకారపు మొద్దు"పై విగ్రహాన్ని ఉంచి హావు-హావు చెట్ల నుంచి సేకరించే బెరడుతో తయారు చేసిన తాళ్లతో లాగుతూ తీసుకెళ్లేవారని సూచిస్తున్నారు.[35] ఈ విగ్రహాన్ని లాగేందుకు సుమారుగా 180 నుంచి 250 మంది పురుషులు అవసరమయ్యేవారు, మోవుయి పరిమాణాన్ని బట్టి కావాల్సిన వారి సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఆధునిక రోజుల్లో ఇప్పుడు నిలబడి ఉన్నవాటిలో 50 విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేశారు. తిరిగి ప్రతిష్ఠించిన మొదటి మోవుయి అహు అతురే హుకే, దీనిని 1958లో అనకెనా బీచ్‌లో ప్రతిష్ఠించారు. తోర్ హెయెర్దాహల్ ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు, దీనిని సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి ప్రతిష్ఠించారు.

అహు[మార్చు]

అహు టోంగారికీ వద్ద ఉన్న పదిహోను మోవుయిల్లో ఆరు మోవుయిలు

అహు అనేవి రాతి వేదికలు, వీటిని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భారీ పరిమాణంలో రూపొందించేవారు. హురి మోవుయి లేదా విగ్రహాల-కూల్చివేత సందర్భంగా, ఆ తరువాత అనేక విగ్రహాలపై తిరిగి పనిచేశారు; అనేక విగ్రహాలు సముద్రం పాలయ్యాయి: తిరిగి ఒడ్డుకు కొట్టుకొచ్చిన విగ్రహం అహు టోన్గారికీ, ఇది ఒక సునామీ ఫలితంగా భూమిపైకి కొట్టుకొచ్చింది. 313 గుర్తించిన అహుల్లో, 125 మోవుయి కలిసివున్న వేదికలు- సాధారణంగా ఇవి పూర్తిగా ఏకశిలా విగ్రహాలు, మోవుయి కాలం యొక్క కురచదనం, వాటిని రవాణా చేయడంలో ఇబ్బందులు ఫలితంగా వీటిని ఇలా తయారు చేశారు. అహు టోంగారికీ రానో రారాకు నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది, ఈ వేదికపై అత్యధిక సంఖ్యలో, అతిపెద్ద మోవుయి ఉంది, మొత్తంమీద దీనిపై 15 మోవుయిలు ఉన్నాయి. ఇతర ప్రసిద్ధ శిలా వేదికలు (అహు) అహు అకివీ, ఇది 1960లో విలియమ్ ముల్లోయ్ చేత పునఃస్థాపించబడింది, అనకెనా వద్ద ఉన్న నావు నావు, తాహాయ్. కొన్ని విగ్రహాలను కలపతో కూడా చేశారు, ఇవి కాలగమనంలో కలిసిపోయాయి.

అహు రూపకల్పనలో ఉన్నతమైన అంశాలు:

  • వెనుక గోడ కొన్ని అడుగుల ఎత్తులో ఉంటాయి, సాధారణంగా సముద్రంవైపు చూస్తూ ఉంటాయి.
  • ముందు గోడను దీర్ఘచతురస్రాకార పాయెంగా అని పిలిచే బసాల్ట్ దిమ్మెలతో రూపొందిస్తారు.
  • ముందు గోడపై ఎరుపు స్కోరియాతో తయారు చేసే ముఖభాగం ఉంటుంది (1300 తరువాత నిర్మించిన శిలా మండపాలపై).
  • వేదిక యొక్క లోపలి భాగంలోకి వాలుగా ఉంటుంది, ఇది బయటవైపుకు రెక్కలు మాదిరిగా విస్తరించి ఉంటుంది.
  • ఒక రాళ్లుపరిచిన చపటా కూడా ఉంటుంది, దీనిని గుండ్రటి నీటిలో సేకరించిన రాళ్లతో నిర్మించేవారు, ఈ రాళ్లు పరిచిన భాగాన్ని పోరో అని పిలుస్తారు.
  • తొంగలి ముందు రాళ్ల అమరిక ఉంటుంది.
  • అహు ముందు ఒక పరిచిన ప్లాజా ఉంటుంది. దీనిని మారీ అని పిలుస్తారు.
  • అహు లోపలి భాగాన్ని గులుకతో నింపుతారు.

అనేక అహుల పైభాగంలో:

  • చతురస్ర "పీఠం"పై ఉండే మోవుయి భూభాగంవైపు చూస్తుంటుంది, వాటి ముందు పోరోతో తొంగలి ఉంటుంది.
  • మోవుయి తలభాగాలపై పుకావో లేదా హావు హితీ రావు (1300 తరువాత నిర్మించిన వేదికలు).
  • ఒక వేడుక జరిగినప్పుడు, విగ్రహాలపై "కళ్లు" పెడతారు. కళ్ల యొక్క తెల్లగుడ్డులను పగడాలతో చేస్తారు, నల్లగుడ్డును అబ్సిడియాన్ లేదా ఎర్ర స్కోరియాతో తయారు చేసేవారు.

సంప్రదాయ పాలినేషియన్ మారీ నుంచి అహు పుట్టింది, దీనిలో అహు అనేది ఒక చిన్న నిర్మాణం, కొన్నిసార్లు పవిత్రమైన వస్తువులు, విగ్రహాలతోసహా, ఉంచే ఒక పైకప్పు ఉన్న నిర్మాణంగా ఇది ఉంటుంది. సాధారణంగా అహులు మారీ లేదా ప్రధాన మధ్య ప్రాంగణం పక్కన ఉంటాయి, ఈ ప్రాంగణంలోనే వేడుకలు జరుగుతాయి, ఈస్టర్ ద్వీపంలో అహు, మోవుయి భారీ పరిమాణాల్లో ఉండటం వలన, మారీ అనేది అహు ముందు ఉండే ఒక రాళ్లు పరచని ప్రాంగణంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అతిపెద్ద అహు ఒకవైపు నుంచి మరోవైపుకు 220 మీటర్ల పొడవు ఉంటుంది, దీనిపై 15 విగ్రహాలు ఉన్నాయి, వీటిలో కొన్ని విగ్రహాలు 9 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అహు పూరకాన్ని స్థానికంగానే సేకరించేవారు (అంటే విరిగిన, పాత మోవుయిలు, రాతి ముక్కలను పూరకంగా ఉపయోగించేవారు).[36] మోవుయి కంటే చాలా చిన్నవైన విడి రాళ్లు కూడా ఇందుకు ఉపయోగించేవారు, ముడి పదార్థాలను రవాణా చేసేందుకు తక్కువ శ్రమతో కూడుకొని ఉండటం కోసం వీటిని ఉపయోగించారు, అయితే ప్లాజా కోసం కృత్రిమంగా ప్రదేశాన్ని చదును చేయడం, అహును పూరిచండం చాలా శ్రమతో కూడుకున్న పని.

అహులు ఎక్కువగా తీరంపై కనిపిస్తాయి, టెరెవాకా పర్వత పశ్చిమ వాలు ప్రాంతాలు, రానో కావు, పోయికే[37] ముఖభూములపై మినహా మిగిలినచోట్ల సమానంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతంగా పరిగణించబడుతున్న ఈ మూడు ప్రాంతాలు కావడం గమనార్హం, పోయికే, రానో రారాకు మారుమూల ప్రాంతాలు వీటి కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. పలు మోవుయిలతో ఉన్న ఒక అహును రానో కావు వద్ద శిఖరాలపై 1880వ దశకంలో గుర్తించారు, అయితే 1914లో రౌట్‌లెడ్జ్ యాత్ర సమయానికి తీర ప్రాంతంలో పడిపోయాయి.

ప్రపంచపు నాభి (నావెల్ ఆఫ్ ది వరల్డ్)[మార్చు]

ఒక లేజర్ స్కాన్ నుంచి నావెల్ ఆఫ్ ది వరల్డ్ ఛాయాచిత్రం

అనకెనాకు సమీపంలో అహు టె పిటో కురా హద్దుల్లో ఒక అసాధారణ "నావెల్ ఆఫ్ ది వరల్డ్"గా పరిగణించబడుతున్న రాతి ప్రదేశం ఉంది, న్యూజీలాండ్‌లో కనిపించేటువంటి మాదిరిగానే ఇక్కడ కూడా రాతి రూపం ఉంది. రాపానుయ్ ప్రస్తుతం మధ్యలో ఉన్న గుండ్రటి రాయిని హోటు మాటువా తాను పుట్టిన ప్రదేశం నుంచి తీసుకొచ్చారని చెబుతున్నారు, అయితే భూగర్భశాస్త్రవేత్తలు ఈ రాయి స్థానికంగానే దొరికిందని, ఇది ప్రారంభ మౌఖిక సంప్రదాయాలను సూచిస్తుందని తెలియజేస్తున్నారు, వినాపును ఆక్రమించిన సమూహం ఈ రాయిని ఏ విధంగా గుర్తించిందో వివరించే కథను ఇది చెబుతుందని, ఈ ప్రదేశాన్ని మానవ సమూహాల ఉత్తర కూటమికి చెందిన మీరు సమూహం దీనిని ఒక యుద్ధ బహుమతిగా టె పిటో కురాకు తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఈ రాయి భారీగా ఉండటం, సహజంగా గుండ్రటి ఆకారంలో ఉండటం ఇది "మనా"తో ఉంటుందనే భావన ఉంది, దీనిని ఒక రకమైన పెద్ద టాలిస్‌మ్యాన్‌గా ఉపయోగించి ఉండవచ్చు. వినాపు తీరంలో దొరికిన అనేక ఇతర రాళ్ల మాదిరిగానే దీనిలో ఇనుము ఉంది, కొన్ని భాగాల్లో దీని యొక్క అయస్కాంత ధ్రువణత మారుతుంది.

రాతి గోడలు[మార్చు]

ఈస్టర్ ద్వీపం యొక్క రాతి కట్టడాలకు ఉన్నతమైన ఉదాహరణల్లో ఒకటి వినాపు వద్ద అహు యొక్క వెనుక గోడ. సున్నం లేకుండా దీనిని నిర్మించారు, ఏడు టన్నుల బరువున్న దృఢమైన బసాల్ట్ రాతిని కూడా ఒకదానితో ఒకటి పోలివుండేలా మలచడం ద్వారా దీని నిర్మాణం జరిగింది, దక్షిణ అమెరికాలోని కొన్ని ఇంకా రాతి గోడలతో ఇది సారూప్యత కలిగివుంది.[38]

రాతి గృహాలు[మార్చు]

హారే మోవా, ఒక లేజర్ స్కాన్ నుంచి తీసిన ఒక కోడి గృహం ఛాయాచిత్రం

ఈ ద్వీప చరిత్రలో రెండు రకాల గృహాలు ఉన్నాయి: హారే పాయెంగా , దీర్ఘవృత్తాకార పునాదితో ఉన్న ఒక ఇళ్లు, వీటిని బసాల్ట్ స్లాబ్‌లతో నిర్మించేవారు, పడవను బోర్లించిన ఆకారంతో పైకప్పును ఏర్పాటు చేసేవారు, హారే ఓకా , ఈ రెండో రకం ఇళ్లు గుండ్రటి రాతి నిర్మాణాలు. టుపా అని పిలిచే రాతి నిర్మాణాలు కూడా ఈ ద్వీపంలో ఉన్నాయి, హారే ఓకా లతో ఇవి సారూప్యత కలిగివుంటాయి, టుపా గృహాల్లో ఖగోళశాస్త్ర-గురువులు నివసించేవారు, ఇవి తీరానికి సమీపంలో ఉండేవి, ఇక్కడ నక్షత్రాల కదలికలను సులభంగా గుర్తించే వీలుండటంతో, వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకునేవారు. నివాసాల్లో హారే మోవా ("కోడి ఇళ్లు")లు కూడా ఉండేవి, రాత్రిపూట కోళ్లను ఉంచేందుకు ఈ రాతి నిర్మాణాలను ఉపయోగించేవారు. వేడుక గ్రామం ఓరంగో వద్ద ఉండే ఇళ్లు విలక్షణంగా ఉంటాయి, ఇవి హారే పాయెంగా ఆకారంలో ఉన్నాయి, అయితే వీటిని పూర్తిగా రానో కావో అగ్నిపర్వత బిలం లోపల కనిపించే చదునైన బసాల్ట్ స్లాబ్‌లతో నిర్మించారు. ఈ గృహాలన్నింటి ప్రవేశ ద్వారాలు బాగా తక్కువ ఎత్తులో ఉంటాయి, ఇంటిలోకి కాళ్లపై పాకుతూ ప్రవేశించాల్సి ఉంటుంది.

రాపా నుయ్ యొక్క ప్రారంభ పౌరులు మరణించినవారిని చిన్న పడవల్లో ఉంచి సముద్రంలోకి పంపేవారు, ఇతర ద్వీపాల్లోని మరికొందరు పాలినేషియా పౌరులు కూడా ఈ సంప్రదాయాన్ని ఆచరించేవారు. తరువాత వారు మరణించినవారిని రహస్య గుహల్లో పూడ్చిపెట్టడం ప్రారంభించారు, శత్రువులు అపవిత్రం చేయకుండా ఎముకలను రక్షించేందుకు ఈ పద్ధతిని పాటించేవారు. 18వ శతాబ్దంలో సంక్షోభాలు నెలకొన్న సమయంలో, ద్వీపవాసులు మరణించినవారిని పడిపోయిన మోవుయి ఉదరం, నిర్మాణం మధ్య గోడ నడుమ ఉన్న ప్రదేశంలో పూడ్చిపెట్టడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మహమ్మారులు వ్యాపించిన సమయంలో, వారు పాక్షిక-పిరమిడ్ రాతి నిర్మాణాలైన సామూహిక సమాధులను సృష్టించారు.

రాతిరాతలు[మార్చు]

రాతిరాతలు రాయిపై చిత్రాల మాదిరిగా చెక్కబడేవి, ఈస్టర్ ద్వీపంలో పాలినేషియా ద్వీపాలన్నింటి కంటే దీనికి సంబంధించి ఎక్కువ ఆధారాలు దొరికాయి. సుమారుగా 1000 ప్రదేశాల్లో 4,000 పైగా రాతిరాతలను గుర్తించారు. రాతిపై నమూనాలు, చిత్రాలను గీయడానికి వివిధ కారణాలు ఉన్నాయి: టోటెమ్‌లు సృష్టించడానికి, భూభాగాన్ని గుర్తించడానికి లేదా ఒక వ్యక్తి లేదా సంఘటనకు స్మారక చిహ్నాలుగా వీటిని చెక్కేవారు. ఓరంగో వద్ద బర్డ్‌మెన్ యొక్క ఉనికి ఎక్కువగా ఉండటంతో రాతిరాతల్లో నిర్దిష్ట ఇతివృత్తాల పరంగా ఈ ద్వీపంలో ప్రత్యేక వైవిధ్యాలు ఉన్నాయి. సముద్రపు తాబేళ్లు, కోమారీ (వాల్వాస్), టంగాటా మను లేదా బర్డ్‌మ్యాన్ సమూహం యొక్క ప్రధాన దేవుడు మేక్‌మేక్ వంటి చిత్రాలను కూడా ఈ రాతల్లో గుర్తించవచ్చు. (లీ 1992)

రాతిరాతలు మార్క్వెసాస్ ద్వీపాల్లో కూడా సాధారణంగా కనిపిస్తాయి.

గుహలు[మార్చు]

ఈ ద్వీపం, పొరుగునున్న మోటు నుయ్ ద్వీపంలో గుహులు ఉన్నాయి, వీటిలో అనేక గుహల్లో మానవులు వాటిని ఉపయోగించారనేందుకు ఆధారాలు లభించాయి, మొక్కలు పెంపకం, కోటలనిర్మాణం, రహస్య ప్రదేశాలతో సన్నని ప్రవేశద్వారాలు, చిక్కిరిబిక్కిరి రాతలతో ఖాళీలు వంటి ఆధారాలు ఈ గుహల్లో కనిపించాయి. అనేక గుహల్లో పురాణాలు, రాపా నుయ్ యొక్క పురాణ పురుషుల చిత్రాలు ఉన్నాయి.

రోంగోరోంగో ఉదాహరణ

రోంగోరోంగో[మార్చు]

అవగతం చేసుకోలేని ఈస్టర్ ద్వీపం లిపి రోంగోరోంగో బయటి ప్రభావం ఎక్స్ నిహిలో లేదా ఐరోపావాసులతో సంబంధం ఏర్పడిన తరువాత సృష్టించబడిందా, దీనికి పూర్వమే సృష్టించారా అనేది అస్పష్టంగా ఉంది. ఇదిలా ఉంటే, 1770వ దశకంలో స్పానిష్‌వారు ఇక్కడ అడుగుపెట్టిన సందర్భంగా ద్వీపవాసులు వారి నుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చని, పాలక వర్గం మతపరమైన సాధనంగా రోంగోరోంగోను ఏర్పాటు చేసిందనే భావనలు ఉన్నాయి.[39] రోంగోరోంగో లిపికి రాతిరాతలతో సారూప్యత ఉంటుంది;[40] వేలాది రాతిరాతలు, ఇతర రాతిపనులు జరిగినప్పటికీ, ఈ ద్వీపంలోని రాళ్లపై ఎక్కడా రోంగోరోంగోలో రాసిన ఒక వాక్యం కూడా కనిపించదు.

ఒక ఫ్రెంచ్ మిషనరీ యుగెన్ ఐరౌడ్ ఇక్కడ ఉన్న రోంగోరోంగో లిపి గురించి మొదటిసారి 1864లో తెలుసుకుంది. ఇదే సమయంలో, అనేక మంది ద్వీపవాసులు తాము రాతను అర్థం చేసుకోగలమని, అయితే తాము వీటిని చదివేందుకు చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. సంప్రదాయం ప్రకారం, జనాభాలో అతికొద్ది మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు, రోంగోరోంగో లిపిని కేవలం పాలక కుటుంబాలు, మతపెద్దలకు మాత్రమే నేర్చుకునే హక్కు ఉంటుంది. 1860లో రోంగోరోంగోను ఏ విధంగా చదవాలనే దానికి సంబంధించిన పరిజ్ఞానం పూర్తిగా నష్టపోవడానికి ఇది కారణమైంది, ద్వీపం యొక్క ఉన్నత వర్గం బానిస దాడులు, వ్యాధి కారణంగా పూర్తిగా నాశనం చేయబడింది.

వందల సంఖ్యలో వస్తువులపై (ప్రధానంగా చెక్క పలకలతోపాటు, రాళ్లు, కర్రలు, రొమ్ముకవచాలు, శిల్పాలు కూడా) రోంగోరోంగో లిపిలో చెక్కిన రాతలు ఉన్నాయని అనుమానిస్తున్నారు, వీటిలో కేవలం 28 మాత్రమే ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి, ఈస్టర్ ద్వీపంలో ఇవి అతికొద్ది సంఖ్యలోనే ఉండగా, మిగిలినవాటిని ప్రపంచవ్యాప్తంగా వస్తు సంగ్రహాలయాలకు తరలించారు. వాటిపై రాతిరాతలు చెక్కేందుకు జరగిన అనేక ప్రయత్నాలు విఫల్యమయ్యాయి, విద్యా వర్గం వీటిపై చిత్రాలు గీసేందుకు ఎవరికీ అనుమతి ఇచ్చేది కాదు. ఇది చూసేందుకు రాతిరాతలుగా ఉన్నప్పటికీ, దీనిని అర్థం చేసుకునేందుకు విలోమ బౌస్ట్రోఫెడోన్ శైలిలో చదవాల్సి ఉంటుంది.

చెక్క బొమ్మలు[మార్చు]

Skeletal statuette
Atypical tubby statuette

18, 19వ శతాబ్దాల్లో ఈస్టర్ ద్వీపంలో కలప దొరకడం చాలా కష్టమైంది, అయితే ప్రపంచ మ్యూజియాల్లో అనేక ఉన్నతమైన, ప్రత్యేకమైన చెక్క బొమ్మలు ఇక్కడ సృష్టించబడ్డాయి. కొన్ని ప్రత్యేక రకాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:[41]

  • రీమిరో, అంటే గోర్జెట్ లేదా రొమ్ము ఆభరణం, ఇది చంద్రవంక ఆకారంలో ఉంటుంది, ఒకటి లేదా రెండు మొనలపై ఒక తల ఉంటుంది.[42] ఇదే నమూనా రాపా నుయ్ పతాకంపై కూడా కనిపిస్తుంది. బ్రిటీష్ మ్యూజియంలోని రెండు రీ మిరులపై రోంగోరోంగో లిపి కనిపిస్తుంది.
  • మోకో మిరో, బల్లి తలతో ఉన్న ఒక పురుషుడు.
  • మోవుయి కావాకావా, టోరోమిరో పైన్ చెట్ల కలప నుంచి మలిచిన వింతైన, బాగా నగిషీలు చెక్కిన బొమ్మలు ఇవి, మరణించిన పూర్వీకులకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రారంభ బొమ్మలు అరుదుగా లభ్యమయ్యాయి, సాధారణంగా ఇవి పురుషుడి బొమ్మలు, శుష్కించిన శరీరంతో మేక గడ్డంతో ఉంటాయి. ఈ బొమ్మల పక్క ఎముకలు, వెన్నుపూసలు బయటకు కనిపిస్తుంటాయి, అనేక ఉదాహరణల్లో శరీరంపై వివిధ భాగాలపై మూలాకారాలు చెక్కబడి ఉంటాయి, సాధారణంగా తలపై ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. మహిళల బొమ్మలు పురుషులవాటి కంటే చాలా అరుదుగా కనిపిస్తాయి, వీటి శరీర భాగం చదరంగా ఉంటుంది, తరచుగా స్త్రీ చేయి శరీరంపై ఉంటుంది. కొన్ని బాగా పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ బొమ్మల మెడల్లో ఆభరణాలు చెక్కబడి ఉన్నాయి, ముఖ్యంగా పురుషుల బొమ్మలకు ఈ ఆభరణాలు కనిపిస్తాయి. ప్రకాశవంతమైన ఉపరితలం ఉన్న బొమ్మలు కూడా ఉన్నాయి, ఈ మెరుగు తరచుగా ఉపయోగించడం, మానవ చర్మం తగలడంతో వచ్చింది.[ఆధారం చూపాలి]
  • ఏవో, ఒక పెద్ద నృత్యపు తెడ్డు.

సమకాలీన సంస్కృతి[మార్చు]

ఒక పర్యాటక కార్యక్రమంలో ఈకల దుస్తులతో పాలినేషియా నృత్యప్రదర్శన

రాపానుయ్‌లో ఒక వార్షిక వేడుక జరుగుతుంది, దీని పేరు తేపాటి, 1975 నుంచి దీనిని నిర్వహిస్తున్నారు, రాపానుయ్ సంస్కృతికి సంబంధించిన ఈ వేడుక ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ద్వీపవాసులు ఒక జాతీయ ఫుట్‌బాల్ జట్టును కూడా నిర్వహిస్తున్నారు, హోంగా రోవా పట్టణంలో మూడు డిస్కోలు ఉన్నాయి. ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో ఒక సంగీత సంప్రదాయం కూడా ఉంది, దీనిపై దక్షిణ అమెరికా, పాలినేషియా ప్రభావాలు కనిపిస్తాయి, ఇది ఒక ప్రతిస్పందన శిల్ప సంప్రదాయం.

జనాభా[మార్చు]

2002 జనాభా లెక్కలు[మార్చు]

2002 జనాభా లెక్కలు ప్రకారం ఈ ద్వీపంలో 3,791 మంది నివసిస్తున్నారు.[43] 60% మంది పౌరులు రాపానుయ్ సంతతివారుకాగా, ఐరోపా సంతతికి చెందిన చిలీయన్లు లేదా కాస్టిజో సంతతివారు 39% మంది ఉన్నారు, మిగిలిన 1% మంది చిలీ ప్రధాన భూభాగం నుంచి స్థానిక అమెరికన్‌లు.[ఆధారం చూపాలి] కాస్టిజో పౌరుల్లో ఐరోపా, రాపానుయ్ లేదా ఐరోపా, స్థానిక అమెరికన్,, రాపానుయ్ వారసత్వం గల వారు కూడా ఉంటారు. రాపానుయ్ పౌరులు ఈ ద్వీపం నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వలస వెళ్లారు. ఈస్టర్ ద్వీపంలో జనసాంద్రత ప్రతి km² (చదరపు కిలోమీటర్‌కు) 23 మంది వద్ద ఉంది (అంటే ప్రతి చదరపు మైలుకు 60 మంది పౌరులు నివసిస్తున్నారు).రాపానుయ్ ప్రస్తుతం చిలీ ప్రధాన భూభాగం నుంచి జరుగుతున్న వలసలను నిరోధించేందుకు ప్రయత్నిస్తుంది, దీనికి చిలీ రాజ్యాంగంలో ఒక సవరణ చేయాల్సి ఉంది.

ఈస్టర్ ఐల్యాండ్‌లో చేపలు పట్టే పడవలు

జనాభా చరిత్ర[మార్చు]

1982 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా సంఖ్య 1,936 వద్ద ఉంది. చివరి జనాభా లెక్కల్లో ఈ సంఖ్య పెరగడానికి ఐరోపా లేదా కాస్టిజో సంతతివారు చిలీ ప్రధాన భూభాగం నుంచి ఇక్కడకు వలస రావడం ప్రధాన కారణమైంది. అయితే, ఈ వలసదారుల్లో ఎక్కువ మంది రాపానూయ్ భాగస్వామిని వివాహం చేసుకున్నారు. 1982 జనాభా లెక్కల్లో సుమారుగా 70% జనాభా రాపానుయ్ సంతతివారు (అంటే స్థానిక పాలినేషియా నివాసులు). పురాతన కాలంలో ఈస్టర్ ద్వీపం యొక్క గరిష్ఠ జనాభా సంఖ్యను గణించడం దాదాపుగా అసాధ్యమైన విషయం. కొన్ని మూలాలు ఇక్కడ జనాభా 7000 మాత్రమే ఉండేదని తెలియజేస్తుండగా, ఇతర మూలాలు 17,000 మంది వరకు ఇక్కడ పౌరులు నివసించేవారని సూచిస్తున్నాయి. ముందుగా చెప్పినట్లుగా, ఈస్టర్ ద్వీపం యొక్క అతి కనిష్ఠ జన సంఖ్య 111, 1877లో ఈ కనిష్ఠ జన సంఖ్య నమోదయింది. ఈ 111 రాపానుయ్ పౌరుల్లో కేవలం 36 మందికి మాత్రమే వారసులు ఉన్నారు, అయితే ఈ రోజు రాపానుయ్ పౌరులందరూ ఈ 36 మంది వారసులమని చెప్పుకుంటున్నారు.

పరిపాలన, న్యాయ హోదా[మార్చు]

హోంగా రోవా టౌన్ హాల్

జూవాన్ ఫెర్నాండెజ్ ద్వీపాలతో ఈస్టర్ ద్వీపం సుయ్ జెనెరిస్ రాజ్యాంగ హోదాను పంచుకుంటుంది, 2007లో దీనికి చిలీ ప్రత్యేక భూభాగంగా ఈ హోదా లభించింది. ఈ ద్వీపానికి ఒక ప్రత్యేక భూభాగ హోదాను ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు: అందువలన ఇది వాల్‌పారైసో ప్రాంతం యొక్క ఒక ప్రావీన్స్‌గా కొనసాగుతుంది, ఇది ఒకే సహజీవనవ్యవస్థను కలిగివుంది.[ఆధారం చూపాలి] ప్రావీన్స్, సహజీవనవ్యవస్థ రెండింటినీ ఐస్లా డి పాస్కువా అని పిలుస్తారు, దీని పరిధిలో మొత్తం ద్వీపం, దాని పరిసర ద్వీపాలు, కొండలు, తూర్పున 380 km (236 mi) దూరంలో ఉన్న ఐస్లా సాలాస్ వై గోమెజ్ ఉన్నాయి.

అధికారిక యంత్రాంగాలు[మార్చు]

చిలీ నియోజక విభాగాల్లో ఐస్లా డి పాస్కువా ప్రాంతం 13వ నియోజక జిల్లా, 6వ సెనెట్ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జువాన్ ఫెర్నాండెజ్ సహజీవనవ్యవస్థతో కలిపి, ఇక్కడి పౌరులకు జోవాక్విన్ గోడోయ్ (RN), ఆల్డో కోర్నెజో (PDC)లు ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాహువాన్ చాహువాన్ (RN), రికార్డో లాగోస్ వెబెర్ (PPD) అనే ఇద్దరు సెనెటర్‌లు కూడా ఇక్కడి ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • ప్రావీన్స్ గవర్నర్: పెడ్రో పాబ్లో ఎడ్ముండ్స్ పావోయా (2010-). రిపబ్లిక్ అధ్యక్షుడు చేత నియమితులయ్యారు.
  • అల్కాల్డే: లజ్ జాసో పావోయా (PDC), నాలుగేళ్ల పదవీ కాలానికి ప్రత్యక్షంగా ఎన్నికయ్యారు (2008–2012). హాంగా రోవాలోని మున్సిపాలిటీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
  • పురపాలక మండలి, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటుంది (2008–2012):
    • మార్టా రాక్వెల్ హోటస్ తుకీ (PDC)
    • జిమెనా ట్రెగోవ్ వాల్లెజోస్ (PDC)
    • జూలియా అరాకీ తెపానో (UDI)
    • ఎలియానా అమెలియా ఓలీవారెస్ శాన్ జువాన్ (UDI)
    • అల్బెర్టో హోటస్ చావెజ్ (PPD)
    • మార్సెలో పోంట్ హిల్ (PPD)

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • హోటు మాటువా - ద్వీపాన్ని కనిపెట్టిన వ్యక్తి
  • పారామౌంట్ చీఫ్ నగారా - చివరి గొప్ప ‘అరికీల్లో ఒకరు
  • సెబాస్టియన్ ఇంగ్లెర్ట్,, OFM కెప్టెన్ - మిషనరీ, మావనజాతి శాస్త్రవేత్త
  • విలియమ్ ముల్లోయ్ - పురావస్తు శాస్త్రవేత్త
  • సెర్గియో రాపు హావోయా - మాజీ గవర్నర్
  • పెడ్రో పాబ్లో ఎడ్ముండ్స్ పావోయా - ప్రస్తుత గవర్నర్
  • మెలానియా కారోలినా హోటు హెయ్ - మాజీ గవర్నర్
  • జువాన్ ఎడ్ముండ్స్ రాపాహోంగో - మాజీ మేయర్

వీటిని కూడా చూడండి[మార్చు]

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

  • రాపా నుయ్ భాష
  • రాపా నుయ్ పురాణాలు
  • ఓంఫాలోస్
  • మేటావెరీ అంతర్జాతీయ విమానాశ్రయం
  • భారీ శిలా ప్రదేశాల జాబితా
  • పాడెస్టా (ద్వీపం)

సూచికలు[మార్చు]

  1. Pending the enactment of a special charter, the island will continue to be governed as a province of the Valparaíso Region.
  2. బి. పీసెర్ (2005) ఫ్రమ్ జెనోసైడ్ టు ఎకోసైడ్: ది రేప్ ఆఫ్ రాపా నుయ్ ఎనర్జీ & ఎన్విరాన్‌మెంట్ వాల్యూమ్ 16 నెం. 3&4 2005
  3. ఎన్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది ఒరిజినాలిటీ డచ్ జర్నల్ బై జాకబ్ రోగెవీన్, విత్ అడిషనల్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది లాగ్ బై కోర్నెలీస్ బౌమాన్, వాజ్ పబ్లిష్డ్ ఇన్: ఆండ్ర్యూ షార్ప్ (ఎడిటెడ్), ది జర్నల్ ఆఫ్ జాకబ్ రోగెవీన్ (ఆక్స్‌ఫోర్డ్ 1970).
  4. ఇన్వెన్షన్ ఆఫ్ ది నేమ్ "రాపా నుయ్"
  5. హెయెర్డాహల్స్ వ్యూ వాజ్ దట్ ది టూ ఐల్యాండ్స్ వుడ్ బి ఎబౌట్ ది సేమ్ సైజ్, మీనింగ్ దట్ "బిగ్" అండ్ "స్మాల్" వుడ్ నాట్ బి ఫిజికల్, బట్ హిస్టారికల్ ఆంట్రిబ్యూట్స్, "బిగ్" ఇండికేటింగ్ ది ఒరిజినల్. ఇన్ రియాలిటీ, హౌఎవర్, ఈస్టర్ ఐల్యాండ్ ఈజ్ మోర్ దాన్ రాపా ఐతి. హెయెర్దాహల్ ఆల్సో స్టేటెడ్ దట్ దేర్ ఈజ్ ఎన్ ఐల్యాండ్ కాల్డ్ "రాపా" ఇన్ లేక్ టిటికాకా ఇన్ సౌత్ అమెరికా, బట్ సో ఫార్ దేర్ ఈజ్ నో మ్యాప్ ఎవైలబుల్ షోయింగ్ ఎన్ ఐల్యాండ్ ఆఫ్ దట్ నేమ్ ఇన్ ది లేక్.
  6. థామస్ ఎస్. బార్తాల్: ది ఎయిత్ ల్యాండ్: ది పాలినేషియన్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్ (హోనోలులు: యూనివర్శిటీ ఆఫ్ హవాయ్ 1978; ఒరిజినల్లీ పబ్లిష్డ్ ఇన్ జర్మన్ ఇన్ 1974)
  7. "ఎంజాయ్ చిలీ - క్లైమాట్". Archived from the original on 2009-09-29. Retrieved 2013-08-19.
  8. ఈస్టర్ ఐల్యాండ్ ఆర్టికల్ Archived 2017-06-03 at the Wayback Machine ఇన్ Letsgochile.com
  9. వెదర్ Archived 2009-10-02 at the Wayback Machine ఈస్టర్ ఐల్యాండ్ ఫౌండేషన్
  10. మూస:Cite gvp
  11. http://www.springerlink.com/content/q752224584lr8qk1/fulltext.pdf Archived 2011-02-21 at Archive-It పెట్రోలజీ అండ్ జియోకెమిస్ట్రీ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్, కాంట్రిబ్యూషన్స్ టు మినరాలజీ అండ్ పెట్రోలజీ, వాల్యూమ్ 44, నంబర్ 2, పేజెస్ 85-100, జూన్ 1974, DOI 10.1007/BF00385783
  12. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలజీ వాల్యూమ్ 38 హాస్, స్టోఫెర్స్ & గార్బే-షోనెబెర్గ్
  13. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలజీ వాల్యూమ్ 38 ది పెట్రోజెనెటిక్ ఎవాల్యూషన్ ఆఫ్ లావాస్ ఫ్రమ్ ఈస్టర్ ఐల్యాండ్ అండ్ నైబరింగ్ సీమౌంట్స్, నియర్-రిడ్జ్ హాట్‌స్పాట్ వోల్కనోస్ ఇన్ ది SE పసిఫిక్ - హాసీ, స్టోఫెర్స్ & గార్బే - షోనెబెర్గ్
  14. హంట్, టి. ఎల్., లిపో, సి. పి., 2006. సైన్స్, 1121879. URL “లేట్ కాలనైజేషన్ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్”
  15. "The Voyage to Rapa Nui 1999-2000". Polynesian Voyaging Society. Archived from the original on 2004-10-13. Retrieved 2009-09-06.
  16. డైమండ్, జారెద్ (2005), కొలాప్స్: హో సొసైటీస్ చూజ్ టు ఫెయిల్ ఆర్ సర్వైవ్ , ఫోలియా ఎస్సాయ్, పేజి 171.
  17. కేథరీన్ రౌట్‌లెడ్జ్ ది మిస్టరీ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్ పేజ్ 208
  18. కొలాప్స్ ఆఫ్ ఐల్యాండ్స్ డెమొగ్రఫిక్స్ ఇన్ ది 1860s అండ్ 1870s
  19. "ANNEXATION BY CHILE". Archived from the original on 2008-11-04. Retrieved 2008-12-22.
  20. డైమండ్, జారెద్ (2005), కొలాప్స్: హౌ సొసైటీస్ చ్యూజ్ టు ఫెయిల్ ఆర్ సర్వైవ్ , పేజ్ 112.
  21. చిలియన్ లా 20,193 Archived 2011-02-21 at Archive-It, నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ చిలీ
  22. "Eclipse fever focuses on remote Easter Island". www.msnbc.msn.com. Retrieved 2010-07-16.
  23. [112] ^ C. మైఖేల్ హోగాన్. 2008. చిలియన్ వైన్ పామ్: జుబెకా చిలియన్సిస్ , GlobalTwitcher.com, ed. Archived 2012-10-17 at the Wayback Machineఎన్.స్ట్రోమ్‌బెర్గ్ Archived 2012-10-17 at the Wayback Machine
  24. స్టీడ్‌మాన్ (2006) పేజి 251, పేజి 395
  25. స్టీడ్‌మాన్ (2006) పేజీలు 248-252
  26. "Rapamycin — Introduction". Retrieved 2009-07-10.
  27. "Rapamycin Extends Longevity in Mice".
  28. 28.0 28.1 28.2 David T. Jones (2007). ""Easter Island, What to learn from the puzzles?"". American Diplomacy.[permanent dead link]
  29. డైమండ్, జారెద్, కొలాప్స్. హౌ సొసైటిస్ చూజ్ టు ఫెయిల్ ఆర్ సక్సీడ్, వైకింగ్, 2005, పేజి 107 ISBN 978-0-670-03337-9
  30. (హెయెర్దాహల్ & పెర్డోన్, 1961:57).
  31. డైమండ్ 2005:109
  32. "పసిఫిక్ ఐల్యాండ్స్ ఆర్కియాలజీ". Archived from the original on 2008-12-06. Retrieved 2013-08-19.
  33. "Easter Island Statue Project". Retrieved 2009-03-30.
  34. http://www.pbs.org/wgbh/nova/easter/explore/paro.html
  35. ఫ్లెన్లే జూనియర్. & కింగ్ ఎస్ఎం 1984. లేట్ క్వాటెర్నరీ పొల్లెన్ రికార్డ్స్ ఫ్రమ్ ఈస్టర్ ఐల్యాండ్. నేచర్ 307: 47-50
  36. సీ హెయెర్దాహల్, విత్ పిక్చర్స్.
  37. హెవీ ఎరోషన్ అండ్ ల్యాండ్‌స్లైడ్స్ మే హావ్ బరీడ్ దెమ్ ఇన్ సాయిల్.
  38. సీ హెయెర్దాహల్, విత్ పిక్చర్స్.(హౌవెవర్ ఆల్ఫ్రెడ్ మెట్రౌక్స్ పాయింటెడ్ అవుట్ దట్ ది రూబుల్ ఫిల్డ్ రాపానుయ్ వాల్స్ వర్ ఎ ఫండమెంటల్లీ డిఫెరెంట్ డిజైన్ టు దోజ్ ఆఫ్ ది ఇంకా, యాజ్ దీజ్ ఆర్ ట్రాపెజోయిడల్ ఇన్ షేప్ యాజ్ ఆపోజ్డ్ టు ది పర్‌ఫెక్ట్లీ ఫిట్టెడ్ రెక్టాంగ్యులర్ స్టోన్స్ ఆఫ్ ది ఇంకా. ఇది కూడా చూడండి http://islandheritage.org/faq.html#ancient_Peru Archived 2007-09-27 at the Wayback Machine)
  39. ఫిషెర్, పేజ్ 63 చూడండి.
  40. ఫిషెర్, పేజీలు 31 , 63 చూడండి.
  41. ది మిస్టరీ ఆఫ్ ఈస్టర్ ఐల్యాండ్, రౌట్‌లెడ్జ్ పేజి 268
  42. వుడెన్ గోర్జెట్ (రీ మిరో). బ్రిటీష్ మ్యూజియం.
  43. [1][permanent dead link]

గ్రంథ వివరాల సూచిక[మార్చు]

  • Altman, Ann M. (2004). Early Visitors to Easter Island 1864-1877 (translations of the accounts of Eugène Eyraud, Hippolyte Roussel, Pierre Loti and Alphonse Pinart; with an Introduction by Georgia Lee). Los Osos: Easter Island Foundation.
  • Barthel, Thomas (1958). Grundlagen zur Entzifferung der Osterinselschrift. Hamburg: Cram, de Gruyter.
  • Butinov, Nikolai A.; Knorozov, Yuri V. (1957). "Preliminary Report on the Study of the Written Language of Easter Island". Journal of the Polynesian Society. 66 (1).
  • Diamond, Jared (2005). Collapse. How Societies Choose to Fail or Succeed. New York: Viking. ISBN 0-14-303655-6.
  • Englert, Sebastian F. (1970). Island at the Center of the World. New York: Charles Scribner's Sons.
  • Fedorova, Irina K. (1965). "Versions of Myths and Legends in Manuscripts from Easter Island". In Heyerdahl; et al. (eds.). Miscellaneous Papers: Reports of the Norwegian Archaeological Expedition to Easter Island and East Pacific 2. Stockholm: Forum. pp. 395–401.
  • Fischer, Steven Roger (1995). "Preliminary Evidence for Cosmogonic Texts in Rapanui's Rongorongo Inscriptions". Journal of the Polynesian Society (104): 303–21.
  • Fischer, Steven Roger (1997). Glyph-breaker: A Decipherer's Story. New York: Copernicus/Springer-Verlag.
  • Fischer, Steven Roger (1997). RongoRongo, the Easter Island Script: History, Traditions, Texts. Oxford and New York: Oxford University Press.
  • Guy, Jacques B.M. (1985). "On a fragment of the "Tahua" Tablet". Journal of the Polynesian Society. 94: 367–87.
  • Guy, Jacques B.M. (1988). "Rjabchikov's Decipherments Examined". Journal of the Polynesian Society. 97: 321–3.
  • Guy, Jacques B.M. (1990). "On the Lunar Calendar of Tablet Mamari". Journal de la Société des Océanistes. 91:2: 135–49.
  • Heyerdal, Thor (1961–65). Thor Heyerdahl & Edwin N. Ferdon Jr. (ed.). The Concept of Rongorongo Among the Historic Population of Easter Island. Stockholm: Forum.{{cite book}}: CS1 maint: date format (link)
  • హెయెర్డాల్, థోర్ అకు-అకు; ది 1958 ఎక్స్‌పెడిషన్ టు ఈస్టర్ ఐల్యాండ్.
  • Hunt, Terry L. (September–October 2006). "Rethinking the Fall of Easter Island". American Scientist (94): 412.{{cite journal}}: CS1 maint: date format (link)
  • Hunter-Anderson, R. (1998). "Human vs climatic impacts at Rapa Nui: did the people really cut down all those trees?". In Stevenson, C.M.; Lee, G. & Morin, F.J. (ed.). Easter Island in Pacific Context. South Seas Symposium: Proceedings of the Fourth International Conference on Easter Island and East Polynesia. Easter Island Foundation. pp. 85–99.{{cite book}}: CS1 maint: multiple names: editors list (link)
  • Lee, Georgia (1992). The Rock Art of Easter Island. Symbols of Power, Prayers to the Gods. Los Angeles: The Institute of Archaeology Publications.
  • Mellén Blanco, Francisco (1986). Manuscritos y documentos españoles para la historia de la isla de Pascua. Madrid: CEHOPU.
  • Metraux, Alfred (1940). "Ethnology of Easter Island". Bernice P. Bishop Museum Bulletin. Honolulu: Bernice P. Bishop Museum Press (160).
  • Pazdniakov, Konstantin (1996). "Les Bases du Déchiffrement de l'Écriture de l'Ile de Pâques". Journal de la Societé des Océanistes. 103:2: 289–303.
  • Routledge, Katherine (1919). The Mystery of Easter Island. The story of an expedition. London.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  • Shepardson, B. (2006). "On the Shoulders of Giants". British Archaeology January/February: 14–17.
  • Steadman, David (2006). Extinction and Biogeography in Tropical Pacific Birds. University of Chicago Press. ISBN 978-0-226-77142-7.
  • Thomson, William J. (1891). "Te Pito te Henua, or Easter Island. Report of the United States National Museum for the Year Ending June 30, 1889". Annual Reports of the Smithsonian Institution for 1889. Washington: Smithsonian Institution: 447–552.ఇన్ గూగుల్ బుక్స్
  • van Tilburg, Jo Anne (1994). Easter Island: Archaeology, Ecology and Culture. Washington D.C.: Smithsonian Institution Press.
  • Vargas, Patricia; Claudio, Cristino; Izaurieta, Roberto (2006). "1000 años en Rapa Nui". Arqueologia del Asentamiento. Santiago: Editorial Universitaria. 956-11-1879-3.

బాహ్య లింకులు[మార్చు]

  • ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో ఈస్టర్ దీవి
  • రాపా నుయ్ డిజిటల్ ఆర్కైవ్ (క్రియేటివ్ కామన్స్-లైసెన్సెడ్ ఫోటోస్, లేజర్ స్కాన్స్, పనారమాస్), ఫోకస్డ్ ఇన్ ది ఏరియా ఎరౌండ్ రానో రారాకు అండ్ అహు టె పిటో కురా విత్ డేటా ఫ్రమ్ ఎ ఆటోడెస్క్/CyArk రీసెర్చ్ పార్ట్‌నర్‌షిప్