Coordinates: 16°04′04″N 80°51′23″E / 16.067906°N 80.856431°E / 16.067906; 80.856431

ఓలేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓలేరు
—  రెవిన్యూ గ్రామం  —
ఓలేరు is located in Andhra Pradesh
ఓలేరు
ఓలేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′04″N 80°51′23″E / 16.067906°N 80.856431°E / 16.067906; 80.856431
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,267
 - పురుషుల సంఖ్య 1,635
 - స్త్రీల సంఖ్య 1,632
 - గృహాల సంఖ్య 1,108
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648


ఓలేరు, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భట్టిప్రోలు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1108 ఇళ్లతో, 3267 జనాభాతో 1378 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1635, ఆడవారి సంఖ్య 1632. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1226 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 45. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590435[1].పిన్ కోడ్: 522 265. ఎస్.టి.కోడ్. 08648.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పెసర్లంక, కారుమూరు, గుత్తావారిపాలెం, పేటేరు, పెదపులివర్రు గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • తూర్పుపాలెం (భట్టిప్రోలు), ఓలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప బాల బడి భట్టిప్రోలులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ తెనాలిలోను, మేనేజిమెంటు కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగు నీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగు నీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగు నీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఓలేరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టి రోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఓలేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 404 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 973 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 14 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 959 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఓలేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 916 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 42 హెక్టార్లు

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో, ఓలేరు" గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు ఉంది. వాణిజ్య పంటలు, పచ్చదనంతో గ్రామం కళకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాశస్త శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. కాశీలో శివుడిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఓలేరులోని కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నా అంతే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. సుమారు 400 సంవత్సరాలక్రితం, గ్రామంలో శివలింగం వెలసినదని ప్రతీతి. కృష్ణానదికి పరీవాహక ప్రాంతంగా ఉండటంతో, స్నానాలకు వచ్చే మునులు, భక్తులు ఎక్కువమంది, శివలింగానికి ప్రత్యేకపూజలు చేసే వారని ప్రతీతి. అప్పటి నుండి కాశీవిశ్వేశ్వరునికి కోర్కెలు తీర్చే స్వామిగా పేరు వచ్చింది.

గ్రామదేవత శ్రీ ఓలేటమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఓలేరు గ్రామమనగానే ప్రతి ఒక్కరికీ తలపుకు వచ్చేది, గ్రామదేవత ఓలేటమ్మ తల్లి. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమినాడు (మే నెలలో) అమ్మవారి తిరుణాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పూజా కార్యక్రమాలకు ఓలేరు గ్రామం నుండియేగాక, భక్తులు పరిసర ప్రాంతాల నుండి, లంక గ్రామాల నుండి గూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. పొంగళ్ళు వండి అమ్మవారికి సమర్పించెదరు. ఈ తిరునాళ్ళలో విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తవి. ఓలేరు గ్రామం అమ్మవారికి నామం ప్రకారం, ఓలేరమ్మ తల్లిగా పేరుగాంచింది. నిత్యం గ్రామప్రజలతోపాటు, తమ పాడిపంటలను అమ్మవారు కాపాడుతుందని భక్తుల విశ్వాసం.

శ్రీ గోపీనాధస్వామి దేవాలయం[మార్చు]

పచ్చని పంటపొలాల పల్లకీలో పరిఢవిల్లుతున్నట్లుగాసువిశాలమైన ప్రాంగణంతో సుందరమైన తూర్పు చాళక్యుల నిర్మాణశైలితో అలరారే దేవాలయం ఓలేరు శ్రీగోపీనాథస్వామి ఆలయం..కృష్ణాపరీవాహక ప్రాతంలోని ఋషులు తమ తపోశక్తిచేత స్వామిని ధ్యానించి ప్రతిష్ఠించినట్లు, పిదప రాజాధిరాజులచేత ఆరాధింపబడినట్లు చారిత్రాత్మకంగా తెలుస్తూవున్నా ఏ కాలంనాటి ఆలయమో ఖచ్చితంగా నిర్థారణ చేయడం కష్టం..శ్రీవైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిత్యపూజలందుకునే ఈ స్వామి రుక్మిణీ సత్యభామా సమేతంగా ఏకశిలా విగ్రహంలో ఉత్తరాభిముఖంగా ఉండటం విశేషం.పక్క సన్నిధిలో లక్ష్మీఅమ్మవారు,బయట శ్రీప్రసన్నాంజనేయ స్వామి తూర్పుముఖంగా దర్శనమిస్తారు..ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ఆస్థాన మండపం, ముఖమండపం ఇలా వివిధ విభాగాలతో చక్కని వాస్తుశాస్త్ర నిర్మాణశైలికి అద్దం పడుతుంది.ఇక ఆలయపరిసరాలు ముగ్ధమనోహరంగా ఆకట్టుకుంటాయి.వసంతఋతువులో ఇక్కడి ప్రకృతిశోభ వర్ణించనలవికాని రమణీయత్వంతో ఉట్టిపడుతూఉంటుంది.ఈ ఆలయానికి 32 ఎకరాల మాన్యం భూమి ఉండగా, దీనిలో 8 ఎకరాలను ప్రభుత్వం నివేశన స్థలాలకోసం కొనుగోలుచేసింది. మిగిలిన దానిలో 10 ఎకరాలు అర్చకులకు నైవేద్యం నిమిత్తం కేటాయించారు.ప్రతి సంవత్సరం చైత్రశుధ్ధ ఏకాదశి నుండి త్రయాహ్నిక దీక్షగా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుపుతారు.ప్రస్తుతం స్వామి వారి వంశపారంపర్య అర్చకులుగా నల్లూరి కిషోర్ ఆచార్యుల కైంకర్యం నిర్వహిస్తున్నారు. మొత్తం ఈప్రాంతానికే మకుటాయమానంగా విరాజిల్లే ఈ ఆలయం మంచి గుర్తుగా మనసులో నిలిచిపోతుంది. తప్పకుండా సందర్శించాల్సినది..

శ్రీరామమందిరం[మార్చు]

పురాతనమైన ఈ ఆలయాన్ని, గ్రామస్థుల, భక్తుల ఆర్థిక సహకారంతో పునర్నిర్మించారు. విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, వేద మంత్రాలతో, వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.

శ్రీ గురుదత్త మందిరం[మార్చు]

శ్రీ లలిత త్రిపురసుందరి, దత్తాత్రేయస్వామి, మహా గణపతి, గురుదేవులు సుబ్రహ్మణ్యస్వాముల వారల నూతన శిలాబింబ, స్థిరబింబ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు.

ప్రధాన పంటలు[మార్చు]

వరితో పాటు, వాణిజ్యపంటలైన పసుపు, కంద, కూరగాయలు ఈ గ్రామంలో సాగవును.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

కృష్ణానదీ పరీవాహక గ్రామాలలో "ఓలేరు" గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు ఉంది. వాణిజ్య పంటలు, పచ్చదనంతో గ్రామం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది.

గ్రామంలో జరిగిన దుర్ఘటన[మార్చు]

2009వ సంవత్సరంలో కృష్ణానదికి వచ్చిన వరదలలో, ఈ గ్రామంలో కృష్ణానది కాలువకు కట్టిన కర కట్ట తెగిపోయి, గ్రామాన్ని వరద నీటితో ముంచెత్తినది. వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి గ్రామస్తులకు తీరని నష్టం జరిగింది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3243. ఇందులో పురుషుల సంఖ్య 1616, స్త్రీల సంఖ్య 1627,గ్రామంలో నివాసగృహాలు 977 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1378 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=ఓలేరు&oldid=3865627" నుండి వెలికితీశారు