Coordinates: 16°03′37″N 80°48′56″E / 16.060392°N 80.815451°E / 16.060392; 80.815451

కారుమూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారుమూరు
—  రెవెన్యూ గ్రామం  —
కారుమూరు is located in Andhra Pradesh
కారుమూరు
కారుమూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′37″N 80°48′56″E / 16.060392°N 80.815451°E / 16.060392; 80.815451
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ విచారపు సాంబయ్య
జనాభా (2011)
 - మొత్తం 2,713
 - పురుషుల సంఖ్య 1,329
 - స్త్రీల సంఖ్య 1,384
 - గృహాల సంఖ్య 840
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648

కారుమూరు, బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రేపల్లె నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 840 ఇళ్లతో, 2713 జనాభాతో 361 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1329, ఆడవారి సంఖ్య 1384. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 513 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 115. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590498[1].పిన్ కోడ్: 522265. ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో వేజెళ్ళవారిలంక, పల్లెకోన, రాచూరు, పేటేరు, ఓలేరు, గుత్తావారిపాలెం గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి రేపల్లెలోను, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల పేటేరులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కారుమూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కారుమూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 19 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కారుమూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 79 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 280 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 4 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 277 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కారుమూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 277 హెక్టార్లు

కారుమూరమ్మ చెరువు: 1996 ప్రాంతములో మాన్యం శివమ్మ గారు సర్ప్ంచ్ గాఉన్నప్పుడు రక్షిత మంచినీటి సరఫరా పైపులద్వారా మొదలైంది. 2013 లో శ్రీ కృష్ణమోహన్ గారు మినరల్ వాటర్ ప్లాంట్ ను గ్రామస్తుల కొరకు స్థాపించారు. రజక చెరవు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016, మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్పత్తి[మార్చు]

కారుమూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో విచారపు సాంబయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీదేవీ, భూదేవీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించెదరు. శ్రీ చక్ర సిమెంట్స్ అధినేత శ్రీ నేండ్రగంటి కృష్ణమోహన్, మూడు లక్షల రూపాయల వ్యయంతో, ఈ ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకై, ఒక కళావేదిక విరాళంగా నిర్మించి ఇచ్చారు.

శివాలయం[మార్చు]

ఇక్కడి శివాలయం పూర్వకాలం నుండి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గోపురాలపై పూర్వం బూతు శిల్పాలు ఉండేవి, వీటన్నిటినీ ఇప్పుడు తొలగించారు.

పురాతన శివాలయo[మార్చు]

ఈ గ్రామంలో ఒక పురాతన శివాలయాన్ని గుర్తించారు. గ్రామంలో పేదలకు నివేశనస్థలాలను ఇచ్చేందుకు అధికారులు 2 ఎకరాల భూమిని సేకరించారు. ఆ ప్రాంతంలో మార్గం కోసం పనివారు 2020,జూన్-28,శనివారంనాడు ముళ్ల చెట్లు తొలగించుచుండగా, ఈ దేవాలయం వెలుగు చూసింది. అందులో రెండు శివలింగాలు, నంది, దేవతా విగ్రహాలు ఉన్నాయి.సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేసారు. వారు, దాతల సహకారంతో ఆలయ్యాన్ని పునర్నిర్మించెదమని తెలిపినారు. ఈ ఆలయం 300 సంవత్సరాల నాటిదిగా గ్రామ పెద్దలు భావించుచున్నారు.

గ్రామ దేవత శ్రీ కారుమూరమ్మ ఆలయం[మార్చు]

ఈ దేవత గుడి చుట్టూ కారుమూరమ్మ చెరువు ఉంది. ఈ అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసం (మే నెల) లో మొదటి ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • షేక్ మీరాసాహెబ్ భజన కోలాటాల క్లారినెట్ కళాకారుడు. ఏ.వీ.సుబ్బారావు మొదలు డీ.వీ.సుబ్బారావు మనుమని వరకు రంగస్థలకళాకారులందరికీ క్లారినెట్ వాయించారు. ఈయన తల్లి దండ్రులు షేక్ సుబ్బులు, గోవాడ మస్తాను. తిరుపతి, రవీంద్రభారతి, ఇంకా పలు ప్రాంతాలలో ఈయన కోలాటం చెక్కభజనలలో క్లారినేట్ వాయించి అవార్డులు పొందారు. కోలాటం చెక్కభజన లలో, ఈయన క్లారినేట్ విన్యాసానికి ప్రేక్షకులు మైమరచి నాట్యం చేసేవారు. వీరు 29.11.2008 న పరమపదించారు.
  • నల్లూరు వెంకట నరసింహాచార్యులు స్వాతంత్ర్య సమర యోధులు. కారుమూరు గ్రామం లోనే కాక చుట్టుప్రక్కల గ్రామంలలో కూడా మందుల ఆచార్యులుగా ప్రసిద్ధి పొందారు. గాంధీజీ గారి స్పూర్థితో శాసనోల్లంఘన ఉధ్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. గ్రామసర్పంచ్ గా కూడా పనిచేసి తమ సేవలను అందించి అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి.వీరు 2002 సంవత్సరములో పరమపదించారు.
  • యడం చెన్నయ్య 3 సార్లు రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికైన వ్యక్తి. తరువాత గ్రామసర్పంచ్ గా కూడా పనిచేసి తమ సేవలను అందించారు.
  • ఎన్.కృష్ణమోహన్ శ్రీచక్ర సిమెంట్ అధినేత జననం, బాల్యం కారుమూరు గ్రామం లోనే జరిగాయి. తనకు జన్మనిచ్చిన ఊరు కోసం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను నెలకొల్పారు. పాఠశాలలోని పిల్లలకి ప్రతిరోజు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.
  • కూరెళ్ళ శర్మ కార్తీక మహోత్సవాలలో భాగంగా సహస్రదీపార్చన, సహస్రలింగార్చన, లక్షబిల్వార్చన మొదలుపెట్టి 2014 కు 40 సంవత్సరాలు పూర్తి ఐనవి. దీనిని డా. ఆదిత్య, పన్నాల ప్రసాదు ఇన్ని ఏళ్ళు సమర్దవంతంగా నిర్వహిస్తున్నారు.
  • వావిలాల వాసుదేవశాస్త్రి

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2678. ఇందులో పురుషుల సంఖ్య 1315, స్త్రీల సంఖ్య 1363, గ్రామంలో నివాసగృహాలు 758 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 361 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కారుమూరు&oldid=4127610" నుండి వెలికితీశారు