Coordinates: 16°02′20″N 80°50′25″E / 16.038889°N 80.840278°E / 16.038889; 80.840278

పేటేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేటేరు
—  రెవెన్యూ గ్రామం  —
పేటేరు is located in Andhra Pradesh
పేటేరు
పేటేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°02′20″N 80°50′25″E / 16.038889°N 80.840278°E / 16.038889; 80.840278
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కనపర్తి వసుమతి గారు , వైఎస్సార్సీపీ ఇంఛార్జి శ్రీ కనపర్తి రవికిరణ్ గారు
జనాభా (2011)
 - మొత్తం 8,547
 - పురుషుల సంఖ్య 4,201
 - స్త్రీల సంఖ్య 4,346
 - గృహాల సంఖ్య 2,571
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్ 08648

పేటేరు, బాపట్ల జిల్లా, రేపల్లె మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రేపల్లె నుండి 3 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2571 ఇళ్లతో, 8547 జనాభాతో 859 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4201, ఆడవారి సంఖ్య 4346. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1500 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 89. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590500[1].పిన్ కోడ్: 522265. ఎస్టీడీ కోడ్ = 08648.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో వేజెళ్ళవారిలంక, కారుమూరు, ఓలేరు, గొరిగపూడి, పల్లెకోన, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి రేపల్లెలో ఉంది సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ రేపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పేటేరులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పేటేరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 19 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పేటేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 149 హెక్టార్లు
  • బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 705 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 15 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 694 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పేటేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 686 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 7 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పేటేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

చేనేత

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.
  2. పేటేరు గ్రామంలో 2014, సెప్టెంబరు-26 న చైతన్య గోదావరి బ్యాంకు శాఖను ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2021 ఫిబ్రవరిలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వైఎస్సార్సీపీ అభ్యర్థి కనపర్తి వసుమతి అత్యదిక మెజారిటీతో గెలుపొందింది, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా గుద్దంటి సత్యవతి గారు ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

  1. ఈ గ్రామంలోని శివాలయంలో కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు జరిపించెదరు.
  2. 2016, ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 11 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

2016, ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది.

గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి గుండెపాటమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పొంగళ్ళు చేసి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించెదరు. భక్తులు విద్యుద్దీపాలతో ప్రత్యేక ప్రభలను తయారుచేసుకొని వచ్చి, తమ భక్తిని చాటుకుంటారు.

ఈ ఆలయంలో పున@ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016, ఫిబ్రవరి-29వ తేదీ సోమవారం నుండి ప్రారంభమయినవి. మార్చి-3వ తెదీ గురువారం ఉదయం 7-22 కి, శిఖర, ధ్వజస్తంభ, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు.

శ్రీ భద్రావతీ సమేత భావనా ఋషి దేవస్థానం[మార్చు]

ఈ ఆలయంలో 2014.ఫిబ్రవరి-5న స్వామివారి కళ్యాణం జరిగింది. [

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం, 2016, ఫిబ్రవరి-9వతేదీ, మాఘ శుద్ధ పాడ్యమి మంగళవారం నుండి 14వతేదీ ఆదివారం వరకు నిర్వహించారు. మంగళవారంనాడు విఘ్నేశ్వరపూజ, స్వామివారినీ, అమ్మవారినీ వధూవరులుగా అలంకరణ, రాత్రికి ధ్వజారోహణం, బుధవారంనాడు బలిహరణ, గురువారంనాడు స్వామివారిని నందివాహనంపై గ్రామోత్సవం, శుక్రవారంనాడు జగజ్యోతి, ఎదురుకోల మహోత్సవం రాత్రికి కల్యాణ మహోత్సవం, శనివారంనాడు రథోత్సవం, ఆదివారంనాడు వసంతోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2017, మార్చి-18వతేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

2016, ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది.

స్వరాజ్య ఆశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమం గ్రామ శివారులో ఉంది. ఈ ఆశ్రమ 14వ వార్షికోత్సవాలను, 2016, నవంబరు-13 నుండి 15 వరకు నిర్వహించారు.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

చావలి నాగేశ్వరరావు[మార్చు]

వీరు జాతీయ నేతల చిత్రకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, అసాధారణ చిత్రకారులుగా గుర్తింపు పొందిన మహనీయులు. వీరు ఈ గ్రామంలో 1891, ఆగస్టు-14న జన్మించారు. వీరు ప్రపంచ ప్రసిద్ధిపొందిన చిత్రకారులైన రాజా రవివర్మ మేనల్లుని వద్ద చిత్రకళలో శిక్షణ పొందినారు. అనంతరం జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 4 సంవత్సరాలు శిక్షణ పొందినారు. వీరు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల, జాతీయ నాయకుల చిత్రాలను గీసినారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో అలంకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాలకు వీరు పేటెంట్ హక్కును గూడా పొందినారు. వీరు 1970లో కాలధర్మం చెందినారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన, ఇంటరు చదువుచున్న, పన్నాల మహేష్ సాయి చైతన్య, క్రికెట్ లో ప్రతిభ కనబరచుచూ, జిల్లా మరియూ రాష్ట్ర స్థాయిలో రాణించుచున్నాడు. 2010 లో పొన్నూరులో అండర్-19 జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తరువాత 2010లోనే అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి, మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి జట్టులో పాల్గొనాడు. 2012లో రాష్ట్రంతరఫున సౌత్ ఈగల్ జట్టు సభ్యునిగా అహమ్మదాబాదులో జరిగిన జాతీయ పోటీలలో పాల్గొన్నాడు. 2013 అక్టోబరు 28 లో హైదరాబాదులో జరగబోవు సన్ రైజర్స్ కప్ లో ఆడటానికి ఎంపిక చేయబడ్డాడు.ఇతని తండ్రి స్థానిక శివాలయంలో అర్చకుడు. తల్లి గృహిణి. ఈతడు పౌరోహిత్యం గూడా నేర్చుకున్నాడు. ఖాళీ సమయాలలో శివాలయంలో అర్సకత్వం గూడా నిర్వహించుచున్నాడు.
  • పేటేరు గ్రామంలోని శ్రీ పరుచూరి బలరామయ్య మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని, వడ్డి వందితసాయి కి, International Space Development conference (ICDS) నుండి ఆహ్వానం వచ్చింది. ఈమె 2011లో 10వ తరగతిలో 560 మార్కులు తెచ్చుకొని, నూజివీడు ఐ.ఐ.ఐ.టి.లో ప్రవేశం పొంది, ప్రస్తుతం మొదటి సంవత్సరం బి.టెక్. చదువుచున్నది. 2014, మార్చిలో "నాసా" వారు నిర్వహించిన Space Settlement Student Design Test పోటీలకు, "Minerva, the future Paradise" అను ప్రాజెక్టు తయారుచేసి పంపినది. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతికి ఎంపికైనది. ఈ సందర్భంగా ఈమెకు, 2014, మే-14 నుండి 18 వరకూ అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహిసే సెమినారులో పాల్గొని, తను పంపిన ప్రాజెక్టుపై ఓరల్ ప్రెజెంటేషను చేయటానికి ఆహ్వానం అందినది. ఈ ఆహ్వానం మేరకు ఆమె, అష్టకష్టాలకోర్చి, లాస్ ఏంజల్స్ వెళ్ళి తన ప్రాజెక్టు నివేదికను సవివరంగా నాసా శాస్త్రవేత్తలకు వివరించి, వారి మన్ననలను పొందినది. ఆమె ఆలోచనలకు ముచ్చటపడిన ఆ శాస్త్రవేత్తలు మరెన్నో విలువైన విషయాలను ఆమెతో చర్చించారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నందితసాయి, తన మేధస్సుతో అందర్నీ ఆకర్షించింది. అమెరికా వెళ్ళి రావదానికి ఆమెకు ఎందరో చేయూతనిచ్చారు. ముఖ్యంగా రేపల్లెకు చెందిన ఎం.సి.ఎ. (Medical and Cultural Association) సంస్థ సహకారం అడుగడుగునా ఆమెకు అందడంతో తన ఆలోచనలను నాసా శాస్త్రవేత్తలతో పంచుకొనడానికి ఆమెకు అవకాశం లభించింది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8464. ఇందులో పురుషుల సంఖ్య 4207, స్త్రీల సంఖ్య 4257, గ్రామంలో నివాస గృహాలు 2230 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 859 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=పేటేరు&oldid=4130271" నుండి వెలికితీశారు