కోస్తా
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
తీరాంధ్ర | |
---|---|
ప్రాంతం | |
![]() భారతదేశ పటంలో తీరాంధ్ర ఎరుపు రంగులో సూచించబడుతున్నది | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 92,906 కి.మీ2 (35,871 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,41,93,868 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
ప్రామాణిక కాలమానం | UTC+05:30 (భాజాకా) |
పెద్ద నగరం | విశాఖపట్నం |
కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని తీరప్రాంతము. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్ అన్న ఇంగ్లీషు మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్లోని రెండు (కోస్తా, రాయలసీమ) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా
బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచింది.
కోస్తా ప్రజలు 1972లో జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.