చాంద్ బాషా పి
- చాంద్ బాషా పి .... హింది పండిట్గా పనిచేస్తూ.... వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు వ్రాశారు. 2008, లో నిజామాబాద్ జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త,2007, అనంతపురంలో ఇలా చాల పురస్కారాలందుకున్నారు.
బాల్యము[మార్చు]
చాంద్ బాషా పి..... అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలో 1972., సెప్టెంబరు 8 న జన్మించారు. ఇతని కలంపేరు: జాబిలి జయచంద్ర. వీరి తల్లితండ్రులు: ఎ.రమిజాబి, ఎ.జాఫర్ అలీ సాహెబ్. చదువు: ఎం.ఏ (హిందీ)., హెచ్ప్టి. ఉద్యోగం: హింది పండిట్.
రచనా వ్యాసంగము[మార్చు]
1996లో సాహిత్య రంగ ప్రవేశం.2000లో చేశారు. ఇతని కవిత 'మట్టిమనిషి' తొలి సారి ప్రచురితం అయ్యింది. అప్పటినుండి వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు ప్రచురించ బడ్డాయి...
అవార్డులు-పురస్కారాలు[మార్చు]
రాధేయ కవితా పురస్కారం (2005, అనంతపురం), తెలుగు సాహితీ సమితి పురస్కారం (2006, కర్నూలు), శరత్ సాహితీ స్రవంతి పురస్కారం (2007, కరీంనగర) ఇందుకూరి సాహితీ భారతి పురస్కారం 2008, నిజామాబాద్, జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త 200, అనంతపురం, ఇలా చాల పురస్కారాలందుకున్నారు. ఇతని లక్ష్యం: అసమానతలు లేని సమాజ నిర్మాణంలో కవిగా సాహిత్య సేవ. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవా కార్యకర్తగా నిరంతరం చేయూత ఇవ్వడం.
మూలాల జాబితా[మార్చు]
- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56