జయరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయరాజు
కవి, గాయకుడు
జననం
విద్యబి. ఎ. పట్టభద్రుడు
వృత్తిసింగరేణిలో ఫిట్టర్‌
తల్లిదండ్రులుతల్లి గొడిశాల చెన్నమ్మ, తండ్రి గొడిశాల కిష్టయ్య

జయరాజు తెలంగాణకు చెందిన కవి, పాటల రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని, 2023లో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2] జయరాజ్‌ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన ‘అవని’ పుస్తకం హిందీ, ఇంగ్గిష్‌, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందింది.

తల్లిదండ్రులు[మార్చు]

జయరాజు మహబూబాబాద్‌ జిల్లా, మహబూబాబాద్‌ మండలం, గుమ్మనూర్‌ లో జన్మించాడు. తల్లి గోడిశాల చెన్నమ్మ, తండ్రి గొడిశాల కిష్టయ్య.

బాల్యం, చదువు[మార్చు]

చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్థి నాయకుడిగా కళాశాల, హాస్టల్ సమస్యల పై పోరాడిండు. మహబూబాబాద్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి, కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది.[3]

ఉద్యోగం[మార్చు]

సింగరేణిలో ఫిట్టర్‌ గా ఉద్యోగంలో చేరాడు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడాడు. ఆ క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నెలరోజులు చేసిన సమ్మెతో పాల్గొన్నాడు. చివరికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రలోభ పెట్టినా జయరాజ్‌ తన పంథా వీడలేదు.

పాటగానే[మార్చు]

పేదలకై బుట్టి పాటలు రాశాడు. కదిలే పాటల ప్రవాహంలా పల్లెపాటలను కూడా రాశాడు. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు “ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట, కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై రాసిన “ఎక్కడ ఉన్నారో అన్నలు... యాడా ఉన్నారో... నింగీలోన తొంగి చూసే చుక్కలైనారో..’ ఈ పాట జయరాజును ప్రపంచానికి పరిచయం చేసింది. చెలకల్లో లేని నీళ్లు రైతు కళ్లల్లో చూసి జయరాజు రాసిన ‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైన వచ్చిపోవే.. వానమ్మ..’ కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన, పనిపాటల్లోనా కష్టజీవికి తోడైనిలిచింది. నీల్లోసుకున్న కంకి నీళ్లాడలేక పాయే అన్న పదం, గుండె గల్ల ఎవరినైనా కదిలిస్తది. అంత సక్కని పాట వానమ్మ పాట.

2023 కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న జయరాజ్

వెండితెరకు[మార్చు]

జయరాజు రాసిన పాటలు సినిమారంగానికి కూడా వెళ్ళాయి. అడవిలో అన్న సినిమాకు హైలెట్‌గా నిలిచిన వందనాలమ్మ పాటను, దండోరా సినిమాలో ఆణిముత్య గీతమైన కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజే రాశాడు.[3]

పురస్కారాలు[మార్చు]

  1. కాళోజీ సాహిత్య పురస్కారం (తెలంగాణ ప్రభుత్వం, 09.09.2023. రవీంద్రభారతి)[2]
  2. సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం ( 2018 అక్టోబరు 14)[4][5]

మూలాలు[మార్చు]

  1. "Jayaraj: 2023 కాళోజీ అవార్డుకు ఎంపికైన గాయకుడు జయరాజ్‌ | kaloji award for writer and singer jayaraj". web.archive.org. 2023-09-07. Archived from the original on 2023-09-07. Retrieved 2023-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 telugu, NT News (2023-09-09). "Kaloji Award | క‌వి జ‌య‌రాజ్‌కు కాళోజీ పుర‌స్కారం ప్ర‌దానం". www.ntnews.com. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.
  3. 3.0 3.1 telugu, NT News (2023-09-08). "పాటల 'రాజు'కు పురస్కారం." www.ntnews.com. Archived from the original on 2023-09-08. Retrieved 2023-09-14.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (6 October 2018). "జయరాజ్‌కు సుద్దాల-జానకమ్మ పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 30 September 2019. Retrieved 30 September 2019.
  5. ఈనాడు, తెలంగాణ (15 October 2018). "ప్రజా చైతన్యం తెచ్చిన కవి సుద్దాల హనుమంతు". www.eenadu.net. Archived from the original on 30 సెప్టెంబరు 2019. Retrieved 30 September 2019.

ఇతర లంకెలు[మార్చు]

http://avaninews.com/article.php?page=48 http://www.teluguliterature.in/2014/04/blog-post_20.html[permanent dead link]

"https://te.wikipedia.org/w/index.php?title=జయరాజు&oldid=4151481" నుండి వెలికితీశారు