పి.సి.నరసింహారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి. సి. నరసింహా రెడ్డి తెలుగు అకాడమీలో జిల్లావారీ మాండలిక పద సంకలనాల కోసం కృషి చేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ లెక్చరర్‌గా చేరి అక్కడే డీన్‌గా ఉద్యోగవిరమణ చేశారు. యుజిసి కోసం 'ద్విభాషా వ్యవహారం - భాషా సామాజిక పరిశీలన' అనే అంశంపై ఒక ప్రాజెక్టు చేశారు. ఆయన చిత్రకారుడు కూడా.సుమారు 40 వేల బొమ్మలు గీశారు. జన్మ స్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా, గద్వాల తాలూకా గట్టు మండలంలోని 'పెంచుకలపాడు 'గ్రామం. ఆ ఊళ్లో రెండు పెద్ద బండరాళ్లు పెనవేసుకున్నట్టు ఉంటాయి. పెనవేసుకున్న 'కల్' (కన్నడంలో రాయి) కాబట్టి కాలక్రమంలో అది 'పెంచుకలపాడు'గా మారిందనేది కథనం. బసవమ్మ, నర్సిరెడ్డిలు అమ్మానాన్నలు. భార్య భారతీదేవి. నాన్న పోలీస్‌పటేల్‌. 'కానిగసాలెలో ప్రాథమిక విద్య.గద్వాలలో 5వ తరగతి. క్లాస్‌మేట్ డి.కె.సమరసింహారెడ్డి. హైదరాబాద్‌ నిజాం కాలేజీ. తెలుగు భాషా శాస్త్రంలో ఎం.ఏ. ఉస్మానియాలో చేశారు. పోరంకి దక్షిణామూర్తి, ఓలేటి సుబ్బారావుగార్లు తోటి విద్యార్థులు. చిన్నతనం నుండి ఏ చిత్తు పేపరు కన్పించినా ఏదో ఒక బొమ్మ గీయడం అలవాటు. బంగోరె బ్రౌన్‌పైన చేసిన ప్రాజెక్టులన్నిటికీ బొమ్మల్ని వేశారు. చలసాని ప్రసాదరావుగారు 'హిందూ కళ- వికాస దశ' అనే వ్యాసం ఈయనతో రాయించారు. చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం తెలుగు, తమిళం భాషల ప్రభావంతో ఉంటుంది. అక్కడి దళితులు కేవలం తమిళమే మాట్లాడాలనే రూలుందట. ఒక రెడ్డి కులస్థుడి ముందు ఒక దళితుడు తెలుగులో మాట్లాడటం నేరమైందట. అతన్ని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బల శిక్ష విధించారట. యు.జి.సి.లో ప్రాజెక్టు కోసం ఇదే తరహాలో మిగతా రాష్ట్ర సరిహద్దుల్లో తెలుగు - ఒరియా, తెలుగు - మరాఠి, తెలుగు - కన్నడం లపై పరిశోధన జరిపారు. దాదాపు 50, 60 వేల వాడుక పదాల్ని సేకరించారు.

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20090922191428/http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009%2F13-9%2Fmemories