మెండు శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెండు శ్రీనివాస్
జననం
మరణం2022 జూన్ 5
మరణ కారణంగుండెపోటు
వృత్తిజర్నలిస్టు
పిల్లలుఇద్దరు కుమారులు

మెండు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు. ఆంధ్రజ్యోతి పత్రిక స్టేట్‌ బ్యూరోచీఫ్‌గా, సీఎంవో బీట్ రిపోర్టర్‌గా పనిచేశాడు.[1]

జననం[మార్చు]

శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం, వ‌రంగ‌ల్ జిల్లాలోని పరకాల పట్టణంలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పత్రికారంగం[మార్చు]

ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన శ్రీనివాస్, 1993 జూలైలో భూపాలపల్లి కేంద్రంలో ఈనాడు మండల విలేఖరిగా తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత 1994లో కొత్తగా ప్రారంభిన వార్త దినపత్రికలో మండల విలేఖరిగా చేరాడు. 1998లో వార్త జగిత్యాల ఆర్ సీ ఇన్ చార్జిగా వెళ్ళాడు. 2000లో వార్త కరీంనగర్ బ్యూరోగా నియామకమై అక్కడ మూడేళ్ళపాటు పనిచేశాడు. ఆ తరువాత గుంటూరు వార్త బ్యూరోగా అక్కడ నాలుగేళ్ళు పనిచేశాడు. కొద్దికాలం ఓ పత్రికలో డెస్క్ కూడా పనిచేశాడు. 2008లో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా చేరి, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ స్థాయికి ఎదిగాడు.[2] 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన నాటినుండి ఆ పార్టీకి సంబంధించిన బీట్ న్యూస్ నుంచి ప్ర‌ధాన వార్త‌ల వరకు రాశాడు.[3]

మరణం[మార్చు]

ఆంధ్రజ్యోతి క్రికెట్ టీమ్ పీసీసీ క్రికెట్ క్లబ్ ఫ్రెండ్లి మ్యాచ్ కోసం శ్రీనివాస్ తన స్వగ్రామం పరకాలకు వెళ్ళాడు. 2022, జూన్ 5న క్రికెట్ అటలో ఓఎనర్‌గా బ్యాటింగ్‌కు వెళ్ళి 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు.[4] బాగా అలసిపోయిన శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.[1] శ్రీనివాస్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, టి. హరీష్ రావు, ఎంపి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు సంతాపం తెలిపారు.[5][6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-06-05. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  2. Web, Disha (2022-06-05). "ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ హ‌ఠాన్మర‌ణం". www.dishadaily.com. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  3. "గుండెపోటుతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మెండు శ్రీ‌నివాస్ మృతి". Prabha News. 2022-06-05. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  4. Desam, A. B. P. (2022-06-05). "ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం - గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి". telugu.abplive.com. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  5. telugu, NT News (2022-06-05). "సీనియర్‌ జర్నలిస్ట్‌ మెండు శ్రీనివాస్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  6. Telugu, Tnews (2022-06-05). "క్రికెట్ ఆడుతూ సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ మృతి". TNews Telugu. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.