శేషభట్టరు సింగరాచార్యులు
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
శేషభట్టరు సింగరాచార్యులు మహబూబ్ నగర్ జిల్లా లోని జటప్రోలు సంస్థానంలో ఆస్థానకవిగా ఉండేవాడు. సంస్థానపు ప్రభువు చిన మాధవరావు సింగరాచార్యులను ఆదరించారు. ఇతనికి గడియకు నూరు పద్యాలు చెప్పగల దిట్టని, రోజుకో గ్రంథం రాయగల సమర్థుడని పేరుంది. 'కేశవ విలాసం ' అను ప్రబంధం వీరి ప్రముఖ రచన[1]... చిన మాధవరావు కోరిక మేరకు వీరు 'శూద్ర ధర్మోత్పల ద్యోతినీస్మృతి కౌముది ' అను దీర్ఘ శీర్షిక కలిగిన మరో రచన చేశారు. ఈ గ్రంథం శ్రీరాయ మదనపాలుడు అదే పేరుతో రచించిన గీర్వాణ గ్రంథానికి వ్యాఖ్యాన రూప అనువాదం. శూద్రులకు గర్భధానాది సంస్కారాలు, పల్లెలా తోమాలి, ఎలా పడుకోవాలి మొదలగు అనేక విషయాలు ఇందులో వర్ణితాలు. కవి ఈ గ్రంథాన్ని జటప్రోలు సంస్థానపు ప్రభువైన చిన మాధవరావు తండ్రి నరసింగరావుకు అంకితమిచ్చాడు.
మూలాలు
[మార్చు]- ↑ సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-29