వీరనరసింహ రాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవుడు 1617-1632
వేంకటపతి రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

వీరనరసింహరాయలు , ఇతను తుళువ నరస నాయకుని కుమారుడు. ఇతని అసలు పేరు రెండవ నరసనాయకుడు లేదా నరస నాయకుడు, సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిస్టించినాడు. ఇతని తండ్రి మొదతి నరస నాయకుడు 1503లో దివంగతులయినారు, తరువాత 1505 వరకూ ఇతను పెనుగొండనందు బందీగా ఉన్న సాళువ రెండవ నరసింహ రాయలు పేరుతో రాజ్యాన్ని పరిపాలించినాడు. కానీ 1506లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిస్టించినాడు.

విషయ సూచిక

[మార్చు] యుద్దములు

[మార్చు] తొలి రోజులలోని సామంత తిరుగుబాట్లు

ఇతను సాళువవంశమును అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసినారు, ముఖ్యముగా అదవానిపాలకుడు కాసప్పవడయరు, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగ పట్టణ పాలకుడు గుండరాజులు తిరుగుబాటు చేసినారు.

[మార్చు] అరవీటి వారి సహాయం

బహుమనీసుల్తాను మహమద్ షాఆదేశానుసారం అతని సామంతుడు యాసిప్ ఆదిల్ఖాన్ 1502లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు, అప్పటికే తిరుగుబాటు చేస్తున్న అదవాని కాసెప్పవడయ అతనికి వంతగా తనూ సైనికులను నడిపించినాడు, కానీ అరవీటి రామరాజు కుమారుడు అరవీటి తిమ్మరాజు కందనోలు ప్రాంతమును పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతుగా ఉండెను. అతను ఈ యాసిప్ ఆదిల్ఖాన్, కాసెప్పవడయ సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్దమందు ఓడించి తరిమేసినాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహ రాయలు అదవాని సీమను అరవీటి తిమ్మరాజునకు విజయానికి కానుకగా ఇచ్చినాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశస్తులూ, తుళువ వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.


వీరనరసింగ రాయలు మిగిలిన సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన శ్రీ కృష్ణదేవ రాయలును రాజ్యపాలనకు నియమించి, 1508నాటికి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణములను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరళా వీరు తోక జాదించినారు దానితో ఈ సారి తన సోదరులగు అచ్యుత రాయలు, శ్రీ రంగ రాయలును సైన్యసమేతముగా నామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో కొంకణ ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.

తరువాత వీర నరసింహ రాయలు మరొక దండయాత్ర దిగ్విజయంగా చేసినాడు.

ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆద్యాత్మిక మార్గములో పడి కంచి, కుంభకోణము, పక్షితీర్థము, శ్రీ రంగము, చిదంబరము, కాళహస్తి, గోకర్ణము, రామేశ్వరము, త్రిపురాంతకము, అహోబలము, శ్రీశైలము, తిరుపతి, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసినాడు.

[మార్చు] వారసుడు

ఇతని వద్ద సాళువ తిమ్మరుసు మహా మంత్రిగా ఉండేవారు, దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినారు, దానితో తిమ్మరుసును పిలిచి తన తరువాత రాజ్యానికి వారసునిగా తన ఎనిమి సంవత్సరాల కొడుకు తిరుమల రాయలును చేయమనీ, అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు కను గుడ్లు పీకి చూపించమనీ చెప్పినాడు, కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్దములందు శ్రీ కృష్ణదేవ రాయలు ప్రతాప సామర్ద్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా శ్రీ కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచినాడు.

[మార్చు] మరణం

ఇతను 1509లో మరణించినాడు.



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
తుళువ నరస నాయకుడు
విజయనగర సామ్రాజ్యము
1503 — 1509
తరువాత వచ్చినవారు:
శ్రీ కృష్ణదేవ రాయలు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు