అనూప రాజ్యం
అనూప అనేది ఇతిహాసమైన మహాభారతంలో ప్రస్తావించిన ఒక రాజ్యం. ఇది ప్రస్తుత మహారాష్ట్రలో ఉన్న విదర్భకు వాయవ్యంగా ఉంది. మద్ర, కాంభోజ వంటి పశ్చిమ రాజ్యాలకు చెందిన జాతుల వారు దీనిని స్థాపించారు.
మహాభారతంలో ప్రస్తావనలు
[మార్చు]ప్రాచీన భారతదేశ (భారతవర్ష) రాజ్యంగా అనూప ప్రస్తావన
[మార్చు]....ఉపవృత్తులు, అనూప వృత్తులు, సురాష్ట్రులు, కేకయులు; కుటులు, మాహేయులు, కక్షులు, సముద్రనిష్కుటులు; ఆంధ్రులు (6,9).
దక్షుని వంశంలో అనూప
[మార్చు]దక్షుడు ఒక ప్రజాపతి (అనేక మంది సంతానాన్ని కలిగి, ఒక జాతికి మూలపురుషుడైనవాడు). ప్రధ అతని కుమార్తెలలో ఒకరు. ఆమెను మరీచి మహర్షి కుమారుడు కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. అనూప ఆమె కుమార్తెలలో ఒకరు. (1,65)
పశ్చిమానుపక పేరుతో రాజు
[మార్చు]మృతపుడు అని పిలిచే అసురులలో శ్రేష్ఠుడు భూమిపై రాజై, పశ్చిమానుపక అనే పేరు పొందాడు.(1,67)
ధర్మరాజు సభలో అనూప రాజు
[మార్చు]కేతుమతుడు, వసుదానుడు, వైదేహుడు, కృతక్షణుడు: గొప్ప బలం ఉన్న సుధర్ముడు, అనిరుద్ధుడు, శ్రుతాయువు; అజేయుడైన అనూప రాజు, అందమైన కర్మజిత్తు; శిశుపాలుడు అతని కుమారునితో పాటు కరూష రాజు; అజేయులైన వృష్ణి వంశ యువకులు, ఈ రాజులందరూ రాజధాని ఇంద్రప్రస్థంలో కొత్తగా నిర్మించిన యుధిష్ఠిరుని సభలో ఉన్నారు. (2,4)
కురుక్షేత్ర యుద్ధంలో అనూపులు
[మార్చు]కురుక్షేత్ర యుద్ధం రెండవ రోజున పాండవుల క్రౌంచారుమ (పక్షి ఆకారం) సైనిక వ్యూహంలో దశార్ణులు, ప్రయాగులు, దాశేరకులు, అనూపకులు, కిరాతులు ఆ వ్యూహం మెడ భాగంలో మోహరించబడ్డారు. (6,50)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- కిసరి మోహన్ గంగూలీ, The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose, 1883–1896.
