డోన్
డోన్ | |
— పట్టణo — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°25′00″N 77°53′00″E / 15.4167°N 77.8833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | డోన్ |
ప్రభుత్వము | |
- మునిసిపల్ కమిషనర్ | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,272 |
- పురుషుల సంఖ్య | 29,470 |
- స్త్రీల సంఖ్య | 29,802 |
- గృహాల సంఖ్య | 12,827 |
పిన్ కోడ్ | 518 222 |
ఎస్.టి.డి కోడ్ | 08516 |
ద్రోణాచలం లేదా డోన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన నగర పంచాయితీ. ఇది డోన్ మండలానికి కేంద్రం.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2568 ఇళ్లతో, 10971 జనాభాతో 4790 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5620, ఆడవారి సంఖ్య 5351. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1336 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 458. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594404[1].పిన్ కోడ్: 518222.
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల , డోన్ లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కర్నూలులో ఉన్నాయి.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
డోన్లో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం[మార్చు]
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జల వనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగు దొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
డోన్లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.బడడద
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం[మార్చు]
డోన్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 542 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1223 హెక్టార్లు
- బంజరు భూమి: 25 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 3000 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 2704 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 321 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
డోన్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 256 హెక్టార్లు* చెరువులు: 65 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
డోన్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]
గ్రానైట్
చరిత్ర[మార్చు]
డోన్ చరిత్రాత్మక పట్టణం. దీని పాతపేరు ద్రోణపురి. బ్రిటిష్ వారి కాలంలో దీనికి డోన్ అనే పేరు వచ్చింది. కాచిగూడ - గుంతకల్లు, గుంటూరు - గుంతకల్లు మార్గాలు డోన్ పట్టణం గుండా పోతున్నది. ఈ పట్టణం విద్యాధికులు గల పట్టణం. నీలం సంజీవరెడ్డి ఈ ప్రాంతంనుండే ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని అలంకరించాడు. ఓ చారిత్రాత్మక కథనం ప్రకారం, పాండవుల గురువైన ద్రోణాచార్యుడు, తీర్థయాత్రలకు పోతూ ఈ ప్రాంతంలోని కొండల శిఖరాలపై కొంత సమయం బసచేశాడు. ఈ చరిత్ర సంస్మణార్థం, ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చింది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో దీని పేరు డోన్ గా స్థిర పడింది. ద్రోణపురి, ద్రోణాచలం, డోన్ పేర్లు ఈ పట్టణానికి చెందినవే.
భౌగోళికం[మార్చు]
ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పట్టణం గుండా హైదరాబాదు, బెంగళూరు మధ్యగల జాతీయ రహదారి-7 పోతున్నది. డోన్ నుండి హైదరాబాదు 270 కి.మీ. బెంగళూరు 340 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ పట్టణం గుండా పోయే రైలు మార్గాన్ని బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు.
గణాంకాలు[మార్చు]
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 59,272.[2] ఇందులో పురుషుల సంఖ్య 29,470, మహిళల సంఖ్య 29,802 గ్రామంలో నివాస గృహాలు 12,827 ఉన్నాయి.
రాజకీయాలు[మార్చు]
రాజకీయ చైతన్యంగల ఈ పట్టణం నుండే ఇద్దరు ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఎమ్.ఎల్.ఏ.లుగా ఎన్నికైనారు. ప్రస్తుత శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (వై సి పి)
పరిశ్రమలు[మార్చు]
డోన్ పట్టణ పరిసరాలలో అనేక ఖనిజాలు ఉన్నాయి.సున్నపురాయి, గ్రానైటు గనులు గలవు. వీటికి అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొల్పబడ్డాయి. లఘు, మధ్యతరహా పరిశ్రమలు, సిమెంటు పరిశ్రమ అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి.
మతపర విషయాలు[మార్చు]
డోన్ పట్టణం మతసామరస్యానికి నిలయం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరభావంతో సామరస్యంగా జీవిస్తారు. డోన్ పట్టణంలోగల మూడు కొండలపై ఓ దేవాలయం, దర్గా, చర్చి నిర్మించారు. ఈ తరహా దృశ్యం మతసామరస్యాలకు ప్రతీక. డోన్ పట్టణ చరిత్రలో ఎన్నడునూ మతపరమైన వివాదాలు తలెత్తలేదు. ధార్మిక ప్రదేశాలు:
- శ్రీరామ దేవాలయం (ప్రాచీనమైనది)
- కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (ప్రాచీనమైనది)
- మాలిక్ బాబా దేవాలయం
- శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (నెహ్రూనగర్) - ఇచ్చట వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
- శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము (కొత్తపేటలో రాజా థియేటర్ వెనుక)
విద్యా విజ్ఞాన విషయాలు[మార్చు]
డోన్ పట్టణం విద్యాసాంకేతికరంగాల నిపుణులు కల పట్టణం. ఇక్కడివారు అనేక ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నిపుణులుగా రాణిస్తున్నారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలలోనూ, దేశవిదేశాలలోనూ పనిచేస్తున్నారు. డోన్ పట్టణంలో రెండు ఎయిడెడ్ పాఠశాలలు, రెండు జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది అందులో జనరల్, ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి, ఒక ప్రభుత్వ & ప్రైవేటు డిగ్రి కళాశాల ఉంది
పండుగలు[మార్చు]
కులమత తారతమ్యాలు లేకుండా ప్రజలు ఇక్కడ అనేక పండుగలు జరుపుకుంటారు. దీనికి మంచి ఉదాహరణ శివరాత్రి ఉత్సవాలు. స్థానిక దేవాలయ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పాత బుగ్గ వద్ద శివరాత్రి సందర్భంగా తిరుణాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఇతరములు[మార్చు]
- డోన్ పట్టణం సాధారణ జీవనానికి అనువైనది. వస్తువులు చౌకథరలు ఇందుకొక కారణం. డోన్ పట్టణం వేగవంతంగా పెరుగుతున్నది.
- రాజకీయ బలాలు చాలా ఉత్సాహకరంగా వుంటాయి.
- ఇక్కడి రైల్వేస్టేషను రాష్ట్రంలోగల పెద్ద స్టేషనులలో ఒకటి, రద్దీగానూ వుంటుంది, జిల్లాలోనే అతిపెద్ద స్టేషను, ప్రధాన కూడలి.
- డోన్ పేరు ద్రోణాచలం అయిననూ రైల్వే వారు ఇప్పటికీ డోన్ పేరుతోనే వ్యవహారికాలను జరపదం జరుగుతున్నది.
- ఈ పట్టణంలో పెరిగిన మర్రి రాఘవయ్య గారు ఆఖిల భారత స్థాయిలో రైల్వే కార్మికుల ప్రదాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
మండల గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 1,20,232 - పురుషులు 60,558 - స్త్రీలు 59,674
- అక్షరాస్యత (2011) - మొత్తం 57.00% - పురుషులు 69.94% - స్త్రీలు 43.67%
రవాణా వ్యవస్థ[మార్చు]
డోన్ పట్టణం నుండి భారతదేశంలోని బెంగుళూర్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, ఢిల్లీ, లక్నో,జైపూర్ మొదలైన ముఖ్య పట్టణాలకు రైలు మార్గం అందుబాటులో ఉంది. 7వ నంబర్ జాతీయ రహదారి ఈ పట్టణం గుండా పోవుచున్నది.
మూలాలు[మార్చు]
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-28.