దొంగల బండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగల బండి
దర్శకత్వంసతీష్ వేగేశ్న
రచనసతీష్ వేగేశ్న (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతజి. ఎస్. కె. నాయుడు
తారాగణంఅల్లరి నరేష్, తాన్య
ఛాయాగ్రహణంఎస్. అరుణ్ కుమార్
కూర్పునందమూరి హరి
సంగీతంవల్లూరి రాజశేఖర్
నిర్మాణ
సంస్థ
జి. ఎస్. కె. నెట్వర్క్
విడుదల తేదీ
2008 డిసెంబరు 12 (2008-12-12)
భాషతెలుగు

}}

దొంగలబండి 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. నిజాం కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.[1]

కథ[మార్చు]

నిజాం సామ్రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క బంధువులు మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

1: అమ్మ చెప్పింది , గానం.రంజిత్

2:నేలకు జారేనే , గానం.రాజశేఖర్

3: చేత వీణ, గానం. రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్

4: ఓరోరి మావయ్య, గానం. రాజశేఖర్, ప్రియా

5: సన్నజాజి పక్క, గానం. మాణిక్య వినాయగాం, భార్గవి పిళ్ళై

6: పక పక నవ్వు, గానం.శ్రీనాథ్, సాయి సరిత , మధుప్రియ, సాహితీ , శ్రావ్య .

మూలాలు[మార్చు]

  1. జీవి. "దొంగలబండి సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 5 October 2016.

బయటి లింకులు[మార్చు]