మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
+{{authority control}} |
సతి నిషేధించడం గురించి |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|150px|మహబూబ్ ఆలీఖాన్|alt=|కుడి]] |
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|150px|మహబూబ్ ఆలీఖాన్|alt=|కుడి]] |
||
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు. |
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు. |
||
నిజాములు తమను తాము దాచడానికి కూడా పిలుస్తారు. దీనికి కారణం ఒక పాలకుడు రూపంలో, వారి ప్రజలు రాత్రి చీకట్లో ఏ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు హామీ ఇవ్వగలరు. |
|||
==== సతి ఆచారం ముగింపుకు సహకారం ==== |
|||
నిజామ్ తనకు నవంబర్ 12, 1876 న ఒక హెచ్చరిక ప్రకటన జారీ చేసారు. "తకుక్దార్లు, నవాబులు, జాగిర్దార్లు, భూస్వాములు మరియు ఇతరులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వం వారిపై తీవ్రమైన చర్య తీసుకుంటుంది"<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/english/deccan+chronicle-epaper-deccanch/letters+leave+a+rich+legacy+of+rulers-newsid-89750998|title=Letters leave a rich legacy of rulers}}</ref> |
|||
==మూలాలు== |
==మూలాలు== |
16:37, 12 అక్టోబరు 2018 నాటి కూర్పు
నవాబ్ మహబూబ్ ఆలీఖాన్ | |
---|---|
హైదరాబాదు రాజ్యం యొక్క 6వ నిజాం | |
పరిపాలన | 1869 – 1911 |
పట్టాభిషేకము | ఫిబ్రవరి 5, 1884 |
జననం | ఆగష్టు 17, 1866 |
జన్మస్థలం | పురానీ హవేలీ, హైదరాబాదు |
మరణం | డిసెంబర్ 12, 1911 |
మరణస్థలం | ఫలక్నుమా ప్యాలెస్ |
సమాధి | మక్కా మసీదు |
ఇంతకు ముందున్నవారు | అఫ్జలుద్దౌలా |
తరువాతి వారు | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ |
Consort | అమత్ ఉజ్జహరా బేగమ్ |
రాజకుటుంబము | పురానీ హవేలీ |
తండ్రి | అఫ్జలుద్దౌలా |
మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది.
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది.
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
నిజాములు తమను తాము దాచడానికి కూడా పిలుస్తారు. దీనికి కారణం ఒక పాలకుడు రూపంలో, వారి ప్రజలు రాత్రి చీకట్లో ఏ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు హామీ ఇవ్వగలరు.
సతి ఆచారం ముగింపుకు సహకారం
నిజామ్ తనకు నవంబర్ 12, 1876 న ఒక హెచ్చరిక ప్రకటన జారీ చేసారు. "తకుక్దార్లు, నవాబులు, జాగిర్దార్లు, భూస్వాములు మరియు ఇతరులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే, ప్రభుత్వం వారిపై తీవ్రమైన చర్య తీసుకుంటుంది"[1]
మూలాలు
- ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007.