రాజవోలు సుబ్బరాయ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజవోలు సుబ్బరాయ కవి మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర నదికి ఉత్తరాన విలసిల్లిన రాజవోలు ( నేటి రాజోలి) ప్రాంతానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. రాజవోలు ప్రభువైన ముష్టిపల్లి వేంకటభూపాలుడుకి సమకాలికుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. అపస్తంభసూత్రుడు. శ్రీవత్సగోత్రుడు. సంసృతాంధ్రములందు సమాన పాండిత్యం కలిగినవాడు. ఈ కవి ' జయవిజయాభ్యుదయం ' అను ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఈ ప్రబంధాన్ని రాజులకు అంకితమివ్వడానికి ఇష్టపడని కవి, తనకెంతో ఇష్టమైన రాజోలి గ్రామంలో వెలిసిన వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఈ సుబ్బరాయ కవి చిత్రాంగదా పరిణయం, గరుడాంజనేయ సంవాదం, సుదంత పరిణయం, కృష్ణార్జున సంవాదం (ద్విపద) మొదలగు రచనలు చేసినట్లు తానే స్వయంగా ఓ సీసపద్యంలో చెప్పుకున్నాడు[1]. ఈ కవి పరాశర వేంకటభట్టు, రమణార్యులు తన గురువులని చెప్పుకున్నాడు. పింగళి సూరన స్ఫూర్తితో 'జయవిజయాభ్యుదయం ' రాయడం వలన అది 'కళాపూర్ణోదయం ' ను పోలి ఉంటుందని కూడా చెప్పుకున్నాడు.

కవి వంశ క్రమం[మార్చు]

హనుమంతరాయలు
↓ (3కుమారులు)
↓—————————————↓—————————————↓
తిమ్మప్రధానుడు తిమ్మరుసయ్య చెన్నప్ప
↓ ( 4 కుమారులు)
↓ ————————————————↓—————————————————↓———————————————————↓
లచ్చన్న (...) (...) (...)
↓ ( కుమారుడు)
శేషాచలామాత్యుడు
↓ ( 5 కుమారులు)
↓—————————↓———————↓—————↓——————↓
రాజవోలు సుబ్బరాయ కవి (...) (...) (...) (...) 

మూలాలు[మార్చు]

  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-101