సైహ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైహ జిల్లా
మిజోరాం పటంలో సైహ జిల్లా స్థానం
మిజోరాం పటంలో సైహ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంసైహ
Government
 • లోకసభ నియోజకవర్గాలుమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
 • శాసనసభ నియోజకవర్గాలు3
Area
 • మొత్తం1,399.9 km2 (540.5 sq mi)
Population
 (2011)
 • మొత్తం56,574
 • Density40/km2 (100/sq mi)
 • Urban
25,110 (44.38%)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత90.01
 • లింగ నిష్పత్తి979
Websiteఅధికారిక జాలస్థలి

మిజోరాం రాష్ట్రంలోని సైహ 8 జిల్లాలలో సైహ ఒకటి. జిల్లా ఉత్తర, వాయవ్య సరిహద్దులలో లంగ్‌లై జిల్లా, పడమర సరిహద్దులో లవంగ్‌త్లై జిల్లా, దక్షిణ, తూర్పు సరిహద్దులో మయన్మార్ ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1399.9 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా సైహ పట్టణం ఉంది. 2001-2011 మద్య కాలంలో జిల్లా జనసంఖ్య 60.823 నుండి 56,574 కు క్షీణించింది. మిజోరాం జిల్లాలో సైహ జిల్లా అత్యల్పమైన జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]

చరిత్ర[మార్చు]

సైహ జిల్లా ఒకప్పుడు చిన్ంతుయిపుయి జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1998లో చిన్ంతుయిపుయి జిల్లాను 2 భాగాలుగా విభజించి సైహ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం[మార్చు]

సైహ జిల్లా కేంద్రంగా సైహ పట్టణం ఉంది. మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో సైహ ఒకటి అంతేకాక వైశాల్యపరంగా సైహ 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ఐజ్‌వాల్, లంగ్‌లై. జిల్లాలో తుయిపాంగ్, సంగౌ, ఫురా, బౌల్‌పుయి మొదలన ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

2006లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతీయ జిల్లాలు (640) లలో వెనుకబడిన 250 జిల్లాలలో సైహ ఒకటని గుర్తించింది. " [2] " బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం " నుండి నిధులు అందుకుంటున్న జిల్లాలలో సైహ ఒకటి.[2]

విభాగాలు[మార్చు]

సైహ జిల్లా 3 రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులుగా (సైహ,సంగౌ, తుయిపాంగ్) విభజించబడింది. అలాగే 3 నియోజకవర్గాలుగా (సైహ,సంగౌ, తుయిపాంగ్) విభజించబడింది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 56,574
ఇది దాదాపు గ్రీన్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం [3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 628వ స్థానం
1చ.కి.మీ జనసాంద్రత 40
2001-11 కుటుంబనియంత్రణ శాతం -7.34%
స్త్రీ పురుష నిష్పత్తి 979:1000
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 90.01%.[4]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

జిల్లాలో మరా ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. మారా ప్రజలకు " మారా అటానిమస్ జిల్లా కౌంసిల్ " పేరిట అటానిమస్ జిల్లా (సైహ, తుయిపాంగ్ రీజనల్ డెవెలెప్మెంట్ బ్లాకులు) ఉంది. తరువాత స్థానంలో ఉన్న లై ప్రజలు " లై అటానిమస్ జిల్లా కౌంసిల్ "లో భాగమైన సంగౌ రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులో ఉన్నారు.

వృక్షజాలం, జంతుజాలం[మార్చు]

1997లో సైహ జిల్లాలో 50చ.కి.మీ వైశాల్యంలో " పాంగ్పుయి నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[5]

మూలాలు[మార్చు]

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Greenland 57,670 July 2011 est.
  4. census2011. "Saiha District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు[మార్చు]