కల్యాణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్యాణ్ సింగ్
21వ రాజస్థాన్ గవర్నరు
In office
2014 సెప్టెంబరు 4 – 8 సెప్టెంబర్ 2019
అంతకు ముందు వారుమార్గరెట్ అల్వా
తరువాత వారుకల్రాజ్ మిశ్రా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
(అదనపు భాధ్యత)
In office
2015 జనవరి 28 – 2015 ఆగస్టు 12
అంతకు ముందు వారుఊర్మిళా సింగ్
తరువాత వారుఆచార్య దేవవ్రత్
పార్లమెంటు సభ్యుడు , లోక్‌సభ
In office
2009–2014
అంతకు ముందు వారుదేవేంద్ర సింగ్ యాదవ్
తరువాత వారురాజ్‌వీర్ సింగ్
నియోజకవర్గంఎటాహ్ , ఉత్తర ప్రదేశ్
16వ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
1991 జూన్ 24 – 1992 డిసెంబరు 6
అంతకు ముందు వారుములాయం సింగ్ యాదవ్
తరువాత వారురాష్ట్రపతి పాలన
In office
1997 సెప్టెంబరు 21 – 1999 నవంబరు 12
అంతకు ముందు వారుమాయావతి
తరువాత వారురామ్ ప్రకాష్ గుప్తా
వ్యక్తిగత వివరాలు
మరణంలక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
జీవిత భాగస్వామిరాంవతి దేవి (1952–2021) (అమె మరణం)
సంతానం2 రాజ్‌వీర్ సింగ్ తో సహా)
పురస్కారాలుపద్మ విభూషణ్ (2022) (మరణానంతరం)

కళ్యాణ్ సింగ్, భారతీయ రాజకీయ నాయకుడు.  భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యుడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా , పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు పనిచేశాడు. 2014 సెప్టెంబరు 4 నుండి 2019 సెప్టెంబరు 8 వరకు రాజస్థాన్ గవర్నరుగా పనిచేసారు. అతని మరణానంతరం భారత ప్రభుత్వం  2022 వ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.[1][2]

జననం

[మార్చు]

1932 జనవరి 5న అలిగఢ్ జిల్లాలో యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్) లో జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మ అభ్యర్థిగా మొదటిసారిగా 1967 లో అట్రౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలలో పోటీ చేసి 4351 ఓట్లతో  గెలిచారు. ఆ తరువాత  1969, 1974, 1977, 1980, 1985, 1989, 1991, 1993, 1996, 2002  సంవత్సరాల  శాసనసభ ఎన్నికలలో ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసి 9 సార్లు విజయం సాధించాడు. 1980లో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శిగా, 1984లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1991,1997లలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[3]

ముఖ్యమంత్రిగా మొదటి పర్యాయం

[మార్చు]

1990 చివరలో భారతీయ జనతా పార్టీ దాని హిందూ-జాతీయవాద అనుబంధ సంస్థలు అయోధ్య నగరంలోని బాబ్రీ మసీదుపై హిందూ దేవాలయాన్ని నిర్మించాలనే ఆందోళనకు మద్దతుగా రామరథ యాత్ర అనే మతపరమైన ర్యాలీని నిర్వహించాయి. యాత్ర ఒక ముఖ్యమైన ప్రజా ఉద్యమంగా మారింది హిందువులలో మతపరమైన మిలిటెంట్ భావాలను బలపరిచింది. దాని తర్వాత గణనీయమైన మత హింస సంభవించింది. 1991లో జరిగిన పార్లమెంటరీ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలు సాధించింది. దీంతో 1991 జూన్ లో కళ్యాణ్ సింగ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

ముఖ్యమంత్రిగా రెండవ పర్యాయం

[మార్చు]

రాష్ట్రపతి పాలన కాలం తరువాత 1993 నవంబరులో మళ్లీ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. సింగ్ అత్రౌలి ,కాస్ గంజ్ అనే రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికలలో పోటీ చేసి రెండింటినీ గెలుచుకున్నాడు. బిజెపి ఓటు వాటా గత ఎన్నికలలో మాదిరిగానే ఉంది, కానీ గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్య 221 నుండి 177 కు తగ్గింది, సమాజ్ వాదీ పార్టీ ,బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. బిఎస్ పి నాయకుడు యాదవ్ , మాయావతి మధ్య పొత్తు 1995 లో విచ్ఛిన్నమైంది, మాయావతి బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  తదనంతరం కళ్యాణ్ సింగ్ 1997 సెప్టెంబరులో రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

మరణం

[మార్చు]

89 సంవత్సరాల వయస్సులో 21 ఆగస్టు 2021న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. telugu, 10tv (2022-01-25). "Padma Awards 2022 : పద్మ అవార్డుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికంటే..? | Padma Awards 2022 : Padma Awards 2022: Full List Of Recipients". 10TV (in telugu). Retrieved 2022-01-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "Late CDS Bipin Rawat, Kalyan Singh and Ghulam Nabi Azad among Padma awardees | Full list here". India Today (in ఇంగ్లీష్). 2022-01-25. Retrieved 2024-09-12.
  3. "Kalyan_Singh".{{cite web}}: CS1 maint: url-status (link)