గోపాలకృష్ణ గోఖలే
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| గోపాలకృష్ణ గోఖలే | |
|---|---|
| మే 9, 1866 - ఫిబ్రవరి 19 1915 | |
గోపాలకృష్ణ గోఖలే |
|
| జన్మస్థలం: | రత్నగిరి , మహారాష్ట్ర , భారత్ |
| నిర్యాణ స్థలం: | బాంబే, భారత్ |
| ఉద్యమము: | భారత స్వాతంత్ర్యోద్యమము |
| ప్రధాన సంస్థలు: | భారత జాతీయ కాంగ్రెస్, డెక్కన్ ఎడుకేషన్ సొసైటి |
గోపాలక్రిష్ణ గోఖలే (ఆంగ్లం : Gopal Krishna Gokhale), (హిందీ : गोपाल कृष्ण गोखले ) (మే 9, 1866 - ఫిబ్రవరి 19, 1915) భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖపాత్ర వహించాడు. గొప్ప సామాజిక సేవకుడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
విషయ సూచిక |
బాల్య జీవితం [మార్చు]
గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత మహారాష్ట్ర) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.
విద్య [మార్చు]
భారత స్వాతంత్ర్యోద్యమము [మార్చు]
ఇతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ని స్థాపించాడు.
జిన్నాకు మరియు గాంధీకి గురువు [మార్చు]
ముహమ్మద్ అలీ జిన్నా మరియు మహాత్మా గాంధీ లకు రాజకీయ గురువు.
గోఖలే ఇన్స్టిట్యూట్ [మార్చు]
గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE), సాధారణంగా గోఖలే ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి. భారత్ లో ప్రాచీన ఆర్థికశాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర పుణె లోని జింఖానా ప్రాంతంలో గలదు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయముతో స్థాపించబడిన విద్యాలయం. నేటికినీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారే ఈ విద్యాలయానికి ట్రస్టీలు.
మూలాలు [మార్చు]
|
|||||||||||||||||