వాస్కోడగామా

వికీపీడియా నుండి
వాస్కో డ గామా
Vasco da Gama.png
జననం జ.1469
సైనెస్, అలెంతెహో, పోర్చుగల్
మరణం డిసెంబరు 24 1524
కొచ్చిన్
వృత్తి అన్వేషకుడు, నావికాదళ సైన్యాధ్యక్షుడు
భార్య/భర్త కాటరీనా దె అటైదే

వాస్కో డ గామా (Vasco da Gama) క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498 లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డ గామా బృందము మొట్టమొదట కాలికట్ లో కాలుమోపింది.

ఆరంభ జీవితం [మార్చు]

పోర్చుగల్ నుండి బయలుదేరుతున్న వాస్కో డ గామా

వాస్కో డ గామా 1460లో[1] లేదా 1469లో[2], పోర్చుగీసు ఈశాన్య తీరంలో చిన్న గ్రామమైన సైనెస్‌లో బహుశా నొస్సా సెన్యోరా దస్ సాలాస్ చర్చి ప్రక్కనున్న ఇంట్లో జన్మించాడు. అలెంతెహో తీరంలోని అతికొద్ది రేవుల్లో ఒకటైన సైనెస్‌, ప్రధానంగా బెస్తవారు నివాసముండే కొన్ని వెల్లవేసి, ఎర్రటి పెంకులతో కప్పబడిన పెంకుటిళ్ల సముదాయము.

వాస్కో డ గామా తండ్రి ఎస్తేవో డ గామా 1460 లలో డ్యూక్ ఆఫ్ విసూ, డామ్ ఫెర్నాండో యొక్క కుటంబములో నైట్‌ గా ఉండేవాడు.[3] డామ్ ఫెర్నాండో, ఎస్తేవో ను సైనెస్‌ కు అల్కైదే-మోర్ (గవర్నరు)గా నియమించి, ఎస్త్రెమోజ్‌ లో సబ్బుల తయారీపై పన్నులు వసూలు చేసుకునేట్టు కొంత ఆదాయం కల్పించాడు.

ఎస్తేవో డ గామా భార్య పేరు డానా ఇసబెల్ సొడ్రె. ఆవిడ హొయొ సొడ్రె కూతురు.

మూలాలు [మార్చు]