హొయసల సామ్రాజ్యం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హొయసల సామ్రాజ్యం (కన్నడ: ಹೊಯ್ಸಳ ಸಾಮ್ರಾಜ್ಯ) (Hoysala Empire) 10 నుండి 14వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో ఒకటి. ఈ సామ్రాజ్యపు రాజధాని మెదట బేలూరు, తరువాత రాజధానిని హళిబేడుకు తరలించారు.
హొయసల రాజులు పశ్చిమ కనుమలలో ఎత్తైన పర్వత శ్రేణులైన మల్నాడుకు చెందినవారు. 12వ శతాబ్ధంలో పశ్చిమ చాళుక్యులకు కాలచూరి రాజవంశానికి మధ్య జరిగిన యుద్ధాలు హొయసల రాజులు ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని సారవంతమైన భూములను, తమిళనాడు రాష్ట్రంలోని కావేరి నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఉపకరించాయి. 13వ శతాబ్దంకల్లా హొయసల రాజులు ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని దాదాపు మొత్తం భూభాగాన్ని, తమిళనాడు, పశ్చిమ ఆంధ్రప్రదేశ్లలోని కొంత భాగాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు.
హొయసల శకంలో దక్షిణ భారతదేశంలో కళలు, శిల్ప కళాశైలి, సంస్కృతి చాలా అభివృద్ధి చెందాయి. ఈ సామ్రాజ్యము నేటికీ అద్భుతమైన హొయసల శిల్పానికి చిరస్మరణీయం. బేలూరులోని చెన్నకేశవాలయం, హళిబేడులోని హొయసలేశ్వరాలయం, సోమనాథపురంలో చెన్నకేశవాలయం వంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు కర్ణాటకంతటా విస్తరించి నేటికీ నిలిచి ఉన్న వందకు పైగా దేవాలయాలు హొయసల శిల్పకళకు తార్కాణం. హొయసల రాజులు లలిత కళలను కూడా ప్రోత్సహించి చేయూతనిచ్చారు. వీరి ఆదరణ వలన కన్నడ మరియు సంస్కృత సాహిత్యాలు వెల్లివిరిశాయి.